Crime: ఛీ ఇదేం తల్లి.. కామం, డబ్బు కోసం దారుణం.. ప్రియుడితో కలిసి కన్నకొడుకు హత్య..
- ఇదే తల్లి.. కామం, డబ్బు కోసం దారుణం..
- సొంత కొడుకును ఇన్సూరెన్స్ డబ్బు కోసం హత్య..
- ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్తో మర్డర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: ఉత్తర్ ప్రదేశ్లో దారుణమైన సంఘటన జరిగింది. సభ్య సమాజం తలదించుకునే పని చేసింది ఓ తల్లి. కొడుకు అని చూడకుండా ప్రియుడి కోసం హత్యకు పాల్పడింది కసాయి తల్లి. అక్రమ సంబంధం, కామం, డబ్బు కోసం కన్న కొడుకునే హతమార్చింది. కాన్పూర్ దేహాత్లో జరిగిన ఈ సంఘటన స్థానికుల్ని నివ్వెరపరించింది. అంగద్పూర్ నివాసి అయిన మమతా సింగ్, తన ప్రియుడు మయాంక్ కటియార్, అతడి సోదరుడు రిషి సహాయంతో తన 25 ఏళ్ల కుమారుడు ప్రదీప్ సింగ్ను చంపినట్లు పోలీసులు తెలిపారు.
మమతా సింగ్ భర్త చనిపోయిన తర్వాత, ఆమెకు మయాంక్తో సాన్నిహిత్యం పెరిగింది. ప్రదీప్ తన తల్లి సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నాడు. కానీ తన ప్రేమికుడితోనే ఉండాలని మమతా సింగ్ వాదించేది. దీంతో ఆమె తన కొడుకును అంతం చేయాలని నిర్ణయించుకుంది. హత్యకు ముందు నుంచే పక్కా పథకంలో హత్య చేయాలని భావించింది. దీని తర్వాత, తన కొడుకు పేరు మీద కోటి రూపాయలకు పైగా విలువైన నాలుగు బీమా పాలసీలు తీసుకుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఆమె తన కొడుకును హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
Read Also: Amazon layoffs: అమెజాన్ ఉద్యోగులకు నిద్రలేని రాత్రులు.. అందరిలో “లేఆఫ్” భయం..
సంఘటన జరిగిన రోజున మమతా, ఆమె ప్రియుడు భోజనం పేరుతో ప్రదీప్ను ఇంటికి పిలిచారు. తిరిగి వస్తుండగా మయాంక్, రిషి అనే వ్యక్తులు ప్రదీప్పై సుత్తితో దాడి చేశారు. దీంతో అతనున అక్కడిక్కడే మరణించాడు. దీనిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు హైవేపై మృతదేహాన్ని పడేశారు. అయితే, పోస్టుమార్టంలో అతడి తలపై అనేక పగుళ్లు ఉండటంతో కొట్టి చంపినట్లుగా నిర్ధారించారు. మొబైల్ లొకేషన్ ఆధారంగా నేరం జరిగిన చోట మమతా, ఆమె ప్రియుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుల నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో గ్రామస్తులు నివ్వెరపోయారు. ప్రదీప్ తన తల్లిని ఎంతగానో ప్రేమించే వాడని గ్రామస్తులు చెబుతున్నారు. మమతా డబ్బుల కోసం ఇంత దూరం వెళ్తుందని అనుకోలేదని ప్రదీప్ తాత జగదీష్ నారాయణ్ విలపించారు.
తాజావార్తలు
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!