Anasuya Bharadwaj: ప్రెస్ మీట్లో అనసూయ కన్నీళ్లు.. నేను బాగానే ఉన్నా, లేకపోయినా..!
- ప్రెస్ మీట్లో అనసూయ కన్నీళ్లు
- నేను లేకపోయినా నా కోసం నిలబడ్డారు
- అనారోగ్యంతో బాధపడుతున్న అనసూయ
- మద్దతుగా నిలిచిన వారికి అనసూయ ధన్యవాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతుంటారు. అయితే తాజాగా అను చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేయడమే కాకుండా.. ఆమెలోని సున్నితమైన కోణాన్ని ఆవిష్కరించాయి. గత కొంతకాలంగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని వెల్లడించారు. ఈ క్రమంలోనే మంగళవారం జరిగిన ఒక లైవ్ ప్రెస్ మీట్లో జూమ్ కాల్ ద్వారా పాల్గొనాల్సి వచ్చింది. ప్రెస్ మీట్లో పాల్గొన్న వారు చూపిన అపారమైన మద్దతును చూసి ఆమె ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా శివాజీ నటీమణుల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై అనసూయ స్పందించగా.. ఆమెపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె స్పందించారు.
ప్రెస్మీట్ సందర్భంగా తనకు ఎదురైన భావోద్వేగ క్షణాలపై అనసూయ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేశారు. ‘నేను బాగానే ఉన్నాను. నా ఆరోగ్య పరిస్థితిపై అనవసర ఆందోళనలు వద్దు. ఒక మహిళగా నా అభిప్రాయాన్ని, స్వేచ్ఛను వ్యక్తపరచినందుకే ఇలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం బాధాకరం. అయినా ఇలాంటి అనుభవాల నుంచే నేను మరింత బలాన్ని పొందుతున్నా. నా వెనుక నిలిచిన ఎంతోమంది ధైర్యవంతమైన మహిళల మద్దతు నాకు గొప్ప శక్తినిస్తోంది. వారి మద్దతు నన్ను మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తోంది’ అని అనసూయ భావోద్వేగం చెందారు.
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
Also Read: Nayanthara Remuneration: రూ.4 కోట్ల నుంచి 18 కోట్లకు.. ఆ ఒక్క హిట్ నయనతార కెరీర్నే మార్చేసింది!
‘మనమందరం మనుషులమే. భావోద్వేగాలు వ్యక్తపరచడం లేదా బలహీన క్షణాలు రావడం సహజమే. అలాంటి క్షణాల గురించి మాట్లాడడంపై నేను సిగ్గుపడను. అసలైన విషయం ఏమిటంటే.. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్లీ లేచి నిలబడటమే నిజమైన బలం. కొంతమంది ఇతరుల బలహీనతలను ఆసరాగా చేసుకుని లాభపడాలని చూస్తారు. అది నా వ్యక్తిత్వాన్ని ఏమాత్రం ప్రభావితం చేయదు. ఎలక్ట్రానిక్ మీడియాలోని కొన్ని విభాగాలపై నాకు నమ్మకం తగ్గుతున్నా.. న్యాయ వ్యవస్థపై మాత్రం పూర్తి విశ్వాసం ఉంది. క్లిక్బైట్ కథనాలు, ఊహాగానాలకు దూరంగా ఉండాలి. నిజాన్ని, మానవత్వాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. నిన్నటి ప్రెస్ మీట్లో నేను భౌతికంగా లేకపోయినప్పటికీ.. నా తరపున నిలబడి మద్దతుగా మాట్లాడిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కోసం మీరు మాట్లాడిన మాటలే నాకు దక్కిన నిజమైన విజయం. వృత్తిపరమైన ఎదుగుదల కంటే.. ఇలాంటి సంక్షోభ సమయాల్లో లభించే గౌరవం, తోడ్పాటు గొప్ప ఆస్తిగా భావిస్తున్నా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, వెలుగు నిండాలని కోరుకుంటున్నా’ అని అనసూయ సుదీర్ఘ పోస్టులు చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!