Bihar Election 2025: బీహార్లో హోరాహోరీ .. లేటెస్ట్ సర్వేలో సంచలన ఫలితాలు.. ఎవరికి ఎన్ని సీట్లు..?
- బీహార్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు..
- స్వల్ప ఆధిక్యతలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే..
- 243 సీట్లలో ఎన్డీయేకు 120-140 సీట్లు, ఆర్జేడీ కూటమికి 93-112 సీట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Election 2025: బీహార్ ఎన్నికలకు మరో ఐదు రోజులు మాత్రమే సమయంలో ఉంది. 243 సీట్లకు రెండు విడుతలుగా నవంబర్ 6, 11న ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు నవంబర్ 14న వెలువడుతాయి. ఈ ఎన్నికలు అధికార బీజేపీ+జేడీయూల ఎన్డీయే కూటమికి, ప్రతిపక్ష మహాఘటబంధన్ లోని ఆర్జేడీ+కాంగ్రెస్+వామపక్షాల కూటమికి ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే అనుకుంటుంటే, ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని ఆర్జేడీ కూటమి భావిస్తోంది.
అయితే, తాజాగా వెలువడిని బీహార్ ఒపీనియన్ పోల్లో హోరాహోరీ పోటీ తప్పదని తేలింది. రెండు కూటముల మధ్య టఫ్ ఫైల్ ఉన్నప్పటికీ, ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం వస్తుందని జేవీసీ పోల్ అంచనా వేసింది. ఎన్డీయే కూటమికి 120 నుంచి 140 సీట్లు వచ్చే అవకాశం ఉందని, మహాఘటబంధన్ కూటమికి 93-112 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. రెండు కూటముల మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని చెప్పింది.
Also Read
- PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
Read Also: Nitish Kumar: ‘‘నా కుటుంబం కోసం ఏం చేయలేదు’’.. ఎన్నికల ముందు నితీష్ కుమార్ వీడియో మెసేజ్..
243 సీట్లలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో బీజేపీ 70 నుంచి 81 సీట్లు గెలుచుకుంటుందని, జేడీయూ 42 నుంచి 48 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, ఎల్జేపీ(రామ్ విలాస్) 5 నుంచి 7 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని, హెచ్ఏఎం(ఎస్) 2 సీట్లకు పరిమితం కావచ్చని అంచనా వేసింది.
ప్రతిపక్ష మహాఘటబంధన్ కూటమిలో ఆర్జేడీ 69 నుంచి 78 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 9-17 సీట్లు గెలుచుకుంటుందని, సీపీఐ(ఎంఎల్), సీపీఐ, సీపీఐ(ఎం) కలిసి 14 నుంచి 17 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అనూహ్యంగా ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ కేవలం ఒక స్థానానికి పరిమితమవుతుందని సర్వే చెప్పింది.
ఓట్ల శాతంలో ఎన్డీయే ముందంజలో ఉంది. ఓట్ల వాటా పరంగా చూస్తే, ఎన్డీయేకు 41% నుండి 43% వరకు పొందుతుందని, ఆర్జేడీ+ కాంగ్రెస్ మహాఘటబంధన్ కూటమికి 39% నుండి 41% ఓట్లు వస్తాయని, జన్ సురాజ్ పార్టీ 6% నుండి 7% వరకు పొందుతుందని ఒపీనియన్ పోల్ చెప్పింది.
తాజావార్తలు
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
-
Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
-
US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!