Venu Goapl Reddy
Author- NTV Telugu-
Pakistan: బలూచిస్తాన్లో మారణహోమం.. 24 గంటల్లో 41 మంది మృతి..
Pakistan: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య ఘర్షణతో అట్టుడికిపోతోంది. గత 24 గంటల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 23 మంది ఉగ్రవాదులు మరణించారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పరిణామాలను సమీక్షించేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బలూచిస్తాన్ వెళ్లారు. -
India-Bangladesh: బంగ్లాదేశ్ అక్రమ బంకర్ నిర్మాణం.. అడ్డుకున్న బీఎస్ఎఫ్..
India-Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ అతి చేస్తోంది. ముఖ్యంగా తన స్థాయి ఏమిటో మరిచిపోయి భారత్కి వార్నింగ్ ఇస్తోంది. అక్కడి జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీమ్ వంటి మతోన్మాద, తీవ్రవాద సంస్థలు భారత దేశాన్ని బెదిరించేలా ప్రకటనలు చేస్తున్నాయి. -
China: పెంటగాన్ కన్నా 10 రెట్లు పెద్దదైన మిలిటరీ ఫెసిలిటీ.. యూఎస్కి చైనా మరో సవాల్..
China: చైనా అన్ని రంగాల్లో అమెరికాకు సవాల్ విసురుతోంది. ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థ, టెక్నాలజీలో అమెరికాను మించి ఎదగాలని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన కార్యాచరణ వేగాన్ని పెంచింది. యూఎస్ని కాదని అగ్రరాజ్య హోదా తెచ్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చైనా ఏఐ చాట్బాట్ ‘‘డీప్ సీక్’’ పెద్ద సంచలనమే సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో అగ్రగామిగా ఉన్న అమెరికాకు చుక్కలు చూపించింది. -
Pakistan: కాల్పులతో దద్ధరిల్లిన బలూచిస్తాన్.. 18 మంది సైనికులు, 12 మంది ఉగ్రవాదులు హతం..
Pakistan: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ కాల్పులతో దద్దరిల్లుతోంది. ఉగ్రవాదులకు, సైన్యానికి జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఘర్షణల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 12 మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా తెలుస్తోంది. జనవరి 31-ఫిబ్రవరి 1 రాత్రి సమయంలో ప్రావిన్స్లోని కలాట్ జిల్లాలోని మంగోచార్ ప్రాంతంలో రోడ్డుని ఉగ్రవాదులు దిగ్భందించడంతో ఈ సంఘటన జరిగిందని పాక్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. -
Delhi Polls: ఎన్నికల ముందు ఆప్కి భారీ షాక్.. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు..
Delhi Polls: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే, ఎన్నికల ముందు వరసగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరగా, నిన్న ఆప్కి రాజీనామా చేసిన 08 మంది ఎమ్మెల్యేలు నేడు (శనివారం) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తమకు టికెట్ ఇవ్వకపోవడంతో 08 మంది ఎమ్మెల్యేలు నిన్న ఆప్కి రాజీనామా చేశారు. -
EV sector: ఈవీ బ్యాటరీ తయారీకి ప్రోత్సాహం.. తగ్గనున్న ఎలక్ట్రిక్ కార్, బైక్స్ ధరలు..
EV sector: కేంద్ర బడ్జెట్ 2025లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాలు(EV) పరిశ్రమలో లిథియం అయాన్ బ్యాటరీలు కీలకంగా ఉంటాయి. ఈ బ్యాటరీ తయారీలో ఉపయోగించే కీలకమై ఖనిజాలు, వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం (BCD)ని తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. -
Budget 2025: రక్షణ రంగానికి రూ.6.81 లక్షల కోట్లు.. ఆధునికీకరణకు పెద్దపీట..
Budget 2025: 2025 బడ్జెట్లో రక్షణ రంగానికి కేంద్రం ప్రాధాన్యత ఇచ్చి్ంది. ముఖ్యంగా రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 2025-26 బడ్జెట్లో ఢిఫెన్స్ రంగానికి రూ.6.81 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గతేడాది రూ. 6.2 లక్షల నుంచి 9.55 శాతం పెరుగుదల. -
Budget 2025: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. TDS పరిమితి పెంపు, NSSకు మినహాయింపు..
Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025లో సీనియర్ సిటిజన్లకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. వీరికి ఉపయోగపడేలా కీలకమైన పన్ను సంస్కరణల్ని ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని రూ. 50,000 నుండి రూ. 1,00,000 కు పెంచుతున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ ప్రకటనను సీనియర్ సిటిజన్లు స్వాగతిస్తున్నారు. దీని వల్ల మెరుగైన ఆర్థిక ఉపశమనం ఉండటంతో పాటు, వారిపై పన్ను భారం తగ్గబోతోంది, వారి పొదుపును పెంచే లక్ష్యంగా ఈ నిర్ణయం ఉండబోతోంది. -
Nirmala Sitharaman: ‘‘ఈ బడ్జెట్ ప్రజల గొంతుని వినిపించింది’’: ఆర్థిక మంత్రి..
Nirmala Sitharaman: 2025 కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్నుల ప్రకటనలు, రిబేట్ సీలింగ్ రూ. 7 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచడాన్ని ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ప్రజల గొంతును వినిపించిందని అన్నారు. శనివారం బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. -
Rahul Gandhi: ‘‘ బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ ’’.. బడ్జెట్పై రాహుల్ గాంధీ విమర్శలు..
Rahul Gandhi: నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. బడ్జెట్ని ‘‘ బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్’’ అని విమర్శించారు. ప్రభుత్వానికి ‘‘దివాళా ఆలోచన’’తో బాధపడుతోందని అన్నారు.
తాజావార్తలు
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
-
Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
-
Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
-
Central Cabinet Decisions: దక్షిణాదిలో కీలక రైలు మార్గానికి గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..!
-
Chennai Love Story: ప్రీమియర్స్ తో 3 కోట్లు కొల్లగొట్టిన చెన్నై లవ్ స్టోరీ
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!