Malayalam cinema: సినిమా రంగంలో మహిళలపై వేధింపులు..సిట్ ఏర్పాటు చేసిన కేరళ సర్కార్..
- మలయాళ సినిమాపై సిట్ ఏర్పాటు చేసిన కేరళ సర్కార్..
- మహిళా వేధింపులపై హేమా కమిటీ సంచలన రిపోర్ట్..
- కమిట్మెంట్.. అడ్వాన్స్ పేరుతో మహిళలపై లైంగిక దోపిడి..
- నటి భావన కేసు తర్వాత హేమా కమిటీ ఏర్పాటు..
Malayalam cinema: మలయాళ సినీ పరిశ్రమలో మహిళా వేధింపులపై ఇటీవల హేమా కమిటి సమర్పించిన నివేదిక సంచలనంగా మారింది. కొందరు అగ్ర నటులుపై వచ్చిన ఆరోపణలు ప్రకంపలను రేపుతున్నాయి. మలయాళ పరిశ్రమలో మహిళా నటులపై కమిట్మెంట్ల పేరుతో వేధింపులు జరిగినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయితే, పరిశ్రమపై వస్తున్న ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది. మహిళా ఐఏఎస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలని పినరయి విజయన్ సర్కార్ ఆదివారం నిర్ణయించింది.
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై వేధింపులు, దోపిడీలు, దుర్వినియోగం మరియు ఇతర మానవ హక్కుల ఉల్లంఘన సంఘటనలను వెల్లడించిన జస్టిస్ కె హేమ కమిటీ నివేదిక ఆధారంగా సమగ్ర పోలీసు దర్యాప్తు ప్రారంభించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను డిమాండ్ చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. సిట్కి ఐజీ ర్యాంక్ అధికారిణి స్పర్జన్ కుమార్ నేతృత్వం వహిస్తారు. ఇతర సీనియర్ మహిళా అధికారులు సిట్లో ఉండనున్నారు.
Also Read
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
- Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
Read Also: Nagarjuna Akkineni: సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు.. కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటా..
అంతకుముందు, ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాత రంజిత్పై బెంగాల్ నటి శ్రీలేఖ మిత్ర సంచలన ఆరోపణలు చేశారు. 2009లో రంజిత్ దర్శకత్వం వహించిన ‘‘పలేరి మాణిక్యం: ఒరు పతిర కోలపతకతింటే కథ’’ సినిమా ఆడిషన్ సందర్భంగా తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెల్లడించింది. తనకు సినిమా అవకాశం ఇస్తానని, సినిమా గురించి చర్చించేందు హోటల్ గదికి రమ్మన్నాడని ఆమె చెప్పింది. గదిలోకి వెళ్లిన తర్వాత తనతో అసభ్యం ప్రవర్తించడంతో షాక్ గురై అక్కడ నుంచి బయటకు వచ్చినట్లు వెల్లడించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రంజిత్ రాజీనామా చేశాడు.
2017లో నటి భావనపై కారులో లైంగిక దాడి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆమెను కారులో తిప్పుతూ దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో కీలక నిందితుడిగా స్టార్ హీరో దిలీప్ ఉన్నాడు. ఈ ఘటన తర్వాత అప్పటి ప్రభుత్వం మలయాళ ఇండస్ట్రీలో మహిళల వేధింపులకు సంబంధించి రిపోర్టు ఇవ్వాలని జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నటి శారద, మాజీ ఐఏఎస్ అధికారిణి కేబీ వత్సల కుమారి సభ్యులుగా ఉన్నారు. 2019లో ఏర్పడిన కమిటీ తన నివేదికలో సినీ ఇండస్ట్రీలో అకృత్యాలను వెలుగులోకి తీసుకువచ్చింది. కాస్టింగ్ కౌచ్తో పాటు లైంగిక దోపిడికి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలను కమిటీ రిపోర్టు వెల్లడించింది. ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు, దోపిడి, అసభ్యంగా ప్రవర్తించడం సహజంగా మారిందని నివేదిక వెల్లడించింది. పరిశ్రమను ‘‘క్రిమినల్ గ్యాంగ్స్’’ నియంత్రిస్తున్నాయని ఆరోపించింది. తమకు లొంగని మహిళల్ని వేధిస్తున్నారని, కొంతమంది నిర్మాతలు, దర్శకులు, నటులు, ప్రొడక్షన్ కంట్రోలర్లతో కూడిన ‘‘పవర్ నెక్సస్’’ ఉందని ప్యానెల్ ఆరోపించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!