India-China: చైనా వైస్ ప్రెసిడెంట్తో అజిత్ దోవల్ భేటీ..
- చైనా వైస్ ప్రెసిడెంట్తో అజిత్ దోవల్ భేటీ..
- రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-China: భారత్-చైనాల మధ్య సంబంధాల బలోపేతం కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ హాన్ జెంగ్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను స్థిరమైన అభివృద్ధిలోకి తీసుకురావడానికి రెండు దేశాలు క్రమంగా ఆర్థిక, వాణిజ్య, సంస్కృతి వంటి రంగాల్లో పరస్పరం సహకారాన్ని పునరుద్ధరించాలని ఆయన అన్నారు.
5 ఏళ్ల తర్వాత ప్రత్యేక ప్రతినిధుల చర్చల 23వ రౌండ్లో పాల్గొనేందుకు భారత ప్రతినిధి బృందానికి అజిత్ దోవల్ నేతృత్వం వహించారు. చివరి సమావేశం 2019లో ఢిల్లీలో జరిగింది. ఈ మీటింగ్లో వైస్ ప్రెసిడెంట్ హాన్ మాట్లాడుతూ.. చైనా, భారత్ ప్రాచీన నాగరికతలు, అభివృద్ధి చెందుతున్న ప్రధాన శక్తులుగా స్వాతంత్య్రం, సంఘీభావం, సహకారానికి కట్టుబడి ఉన్నాయని అన్నారు. వచ్చే ఏడాది చైనా, భారత్ల మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు 75 ఏళ్లు నిండుతాయని హాన్ జెంగ్ పేర్కొన్నారు.
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- CM Vijay: సీఎం విజయ్కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
Read Also: Mumbai: ఘోర విషాదం.. బోటు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
దీనికి ముందు అజిత్ దోవల్ ఆ దేశ విదేశాంగ ప్రతినిధితో భేటీ అయ్యారు. సరిహద్దు సమస్యల పరిష్కారానికి 6 ఒప్పందాలపై సంతకాలు చేవారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దులో శాంతి నెలకొనాలని నిర్ణయించారు. టిబెల్లోని కైలాస్ మానస్సరోవర యాత్రను ప్రోత్సహించడంతో పాటు నాథులా బోర్డర్ ట్రేడ్, క్రాస్ బోర్డర్ రివర్ కోపరేషన్పై సమోధ్య కుదిరింది.
2020లో తూర్పు లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వెంబడి గాల్వాన్లో సైనిక ప్రతిష్టంభన తర్వాత ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తు్న్నాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. 3,488 కి.మీ విస్తీర్ణంలో ఉన్న భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించడానికి 2003లో ఏర్పాటైన ప్రత్యేక ప్రతినిధులు యంత్రాంగం 22 సార్లు సమావేశమయ్యారు.
తాజావార్తలు
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!