India-North Korea: “కిమ్” రాజ్యంతో దౌత్య సంబంధాలు.. జాగ్రత్తగా వ్యవహరిస్తున్న భారత్..
- ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభించిన భారత్..
- కోవిడ్-19 నేపథ్యంలో తగ్గిన దౌత్య సంబంధాలు..
- అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న భారత్..
India-North Korea: భారత్ తన యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా తూర్పు దేశాలతో సంబంధాలు పెంచుకోవాలని అనుకుంటోంది. ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘‘కిమ్ జోంగ్ ఉన్’’ పాలనలో ఉన్న ఉత్తర కొరియాలోని భారత తన రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచింది. ఉత్తర కొరియా చాలా అస్పష్టతతో పనిచేస్తున్న కారణంగా, భారత్ ఆ దేశంతో దౌత్య సంబంధాలను తగ్గించింది. జూలై 2021లో భారతదేశం ఉత్తర కొరియాతో తన రాయబార కార్యాలయాన్ని మూసేసింది. రాయబారి అతుల్ మల్హరీ గోట్సర్వేతో పాటు మొత్తం సిబ్బందిని మాస్కో మీదుగా ఢిల్లీకి తరలించారు.
అయితే, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంబసీని మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. మొత్తం సిబ్బందిని వెనక్కి పిలిపించింది. కోవిడ్ -19 కారణంగా ఈ చర్య తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. 14 నెలల క్రితం గోట్సర్వేని మంగోలియాకు కొత్త రాయబారిగా పోస్టింగ్ ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలో భారతదేశం ప్యాంగ్యాంగ్తో తన రాయబార కార్యాలయంలో సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. కొద్ది రోజుల్లోనే సాంకేతిక సిబ్బంది, దౌత్య సిబ్బందిని ఉత్తర కొరియాకు పంపబడింది.
Also Read
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
- Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
Read Also: Bihar: ప్రేమలో పడ్డ ముగ్గురు పిల్లల తల్లి.. దగ్గరుండి పెళ్లి చేసిన భర్త!
ఒక నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలపై భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా గూఢచర్యంలో కిమ్ ప్రభుత్వం ప్రసిద్ధి. దీంతో రాయబార కార్యాలయంలోని ప్రతీ ఇంచు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరో కొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇటీవల కాలంలో ఉత్తర కొరియా ప్రభావం పెరుగుతోంది. ముఖ్యంగా క్షిపణి అభివృద్ధిలో దూసుకువెళ్తోంది. హైపర్ సోనిక్ క్షిపణులు, వ్యూహాత్మక ఆయుధాలు, షార్ట్ అండ్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ సాంకేతికతపై వేగంగా పనిచేస్తోంది. ఉత్తర కొరియాలో భారత ఉనికి ఉండటం వల్ల ఇలాంటి సాంకేతికత పాకిస్తాన్ వంటి దేశాలకు చేరకుండా అడ్డుకోవచ్చు. గత కొన్నేళ్లుగా ఉత్తర కొరియా రష్యా, చైనా, ఇరాన్లతో సంబంధాలను పెంచుకుంది. ఈ కూటమి భారత్-అమెరికా-జపాన్-ఆస్ట్రేలియా దేశాల క్వాడ్ కూటమిని కౌంటర్ చేయడానికి ఏర్పడింది. దౌత్యపరంగా దీనిని ఎదుర్కోవడానికి భారతదేశాని ప్రాధాన్యత ఉంటుంది. రష్యా, ఇరాన్తో భారత్కి ఉన్న బలమైన సంబంధాలు కూడా ఉత్తర కొరియా విషయంలో భారత్కి సహాయపడనున్నాయి.
తాజావార్తలు
-
AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
-
Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
-
Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
-
Ashu Reddy: 9.5 కోట్ల చీటింగ్ కేసు.. మీడియా ముందుకు అషు రెడ్డి?
-
Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!