India-North Korea: “కిమ్” రాజ్యంతో దౌత్య సంబంధాలు.. జాగ్రత్తగా వ్యవహరిస్తున్న భారత్..
- ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభించిన భారత్..
- కోవిడ్-19 నేపథ్యంలో తగ్గిన దౌత్య సంబంధాలు..
- అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-North Korea: భారత్ తన యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా తూర్పు దేశాలతో సంబంధాలు పెంచుకోవాలని అనుకుంటోంది. ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘‘కిమ్ జోంగ్ ఉన్’’ పాలనలో ఉన్న ఉత్తర కొరియాలోని భారత తన రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచింది. ఉత్తర కొరియా చాలా అస్పష్టతతో పనిచేస్తున్న కారణంగా, భారత్ ఆ దేశంతో దౌత్య సంబంధాలను తగ్గించింది. జూలై 2021లో భారతదేశం ఉత్తర కొరియాతో తన రాయబార కార్యాలయాన్ని మూసేసింది. రాయబారి అతుల్ మల్హరీ గోట్సర్వేతో పాటు మొత్తం సిబ్బందిని మాస్కో మీదుగా ఢిల్లీకి తరలించారు.
అయితే, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంబసీని మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. మొత్తం సిబ్బందిని వెనక్కి పిలిపించింది. కోవిడ్ -19 కారణంగా ఈ చర్య తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. 14 నెలల క్రితం గోట్సర్వేని మంగోలియాకు కొత్త రాయబారిగా పోస్టింగ్ ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలో భారతదేశం ప్యాంగ్యాంగ్తో తన రాయబార కార్యాలయంలో సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. కొద్ది రోజుల్లోనే సాంకేతిక సిబ్బంది, దౌత్య సిబ్బందిని ఉత్తర కొరియాకు పంపబడింది.
Also Read
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
Read Also: Bihar: ప్రేమలో పడ్డ ముగ్గురు పిల్లల తల్లి.. దగ్గరుండి పెళ్లి చేసిన భర్త!
ఒక నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలపై భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా గూఢచర్యంలో కిమ్ ప్రభుత్వం ప్రసిద్ధి. దీంతో రాయబార కార్యాలయంలోని ప్రతీ ఇంచు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరో కొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇటీవల కాలంలో ఉత్తర కొరియా ప్రభావం పెరుగుతోంది. ముఖ్యంగా క్షిపణి అభివృద్ధిలో దూసుకువెళ్తోంది. హైపర్ సోనిక్ క్షిపణులు, వ్యూహాత్మక ఆయుధాలు, షార్ట్ అండ్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ సాంకేతికతపై వేగంగా పనిచేస్తోంది. ఉత్తర కొరియాలో భారత ఉనికి ఉండటం వల్ల ఇలాంటి సాంకేతికత పాకిస్తాన్ వంటి దేశాలకు చేరకుండా అడ్డుకోవచ్చు. గత కొన్నేళ్లుగా ఉత్తర కొరియా రష్యా, చైనా, ఇరాన్లతో సంబంధాలను పెంచుకుంది. ఈ కూటమి భారత్-అమెరికా-జపాన్-ఆస్ట్రేలియా దేశాల క్వాడ్ కూటమిని కౌంటర్ చేయడానికి ఏర్పడింది. దౌత్యపరంగా దీనిని ఎదుర్కోవడానికి భారతదేశాని ప్రాధాన్యత ఉంటుంది. రష్యా, ఇరాన్తో భారత్కి ఉన్న బలమైన సంబంధాలు కూడా ఉత్తర కొరియా విషయంలో భారత్కి సహాయపడనున్నాయి.
తాజావార్తలు
-
The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న ‘ది ఇండియా స్టోరీ’ టీజర్
-
Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
-
IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ
-
Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
-
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!