BJP: కోయంబత్తూర్ పేలుళ్ల టెర్రరిస్ట్ అంత్యక్రియలకు ఈ మర్యాదలేంటి ఏంటి..?
- ఉగ్రవాది ఎస్ఏ బాషా అంత్యక్రియలపై రచ్చ..
- అంత్యక్రియల ఊరేగింపుకు అనుమతి..
- డీఎంకే ప్రభుత్వంపై బీజేపీ ఫైర్..
- కోయంబత్తూర్ పేలుళ్లలో ప్రధాన సూత్రధారి ఎస్ఏ బాషా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఉగ్రవాది ఎస్ఏ బాషా అంత్యక్రియల ఉరేగింపుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంపై తమిళనాడు ప్రభుత్వం, ఇండియా కూటమిపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. డీఎంకే పార్టీపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా బుధవారం మండిపడ్డారు. అల్-ఉమ్మర్ సంస్థ వ్యవస్థాపకుడు బాషా పెరోల్పై బయటకు వచ్చిన సమయంలో అనారోగ్యంతో మరణించారు. 1998 కోయంబత్తూర్ వరస పేలుళ్ల ఘటనలో బాషా మాస్టర్ మైండ్గా ఉన్నాడు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు.
‘‘ తమిళనాడు ఘటన షాకింగ్కి గురిచేస్తోంది. 1998 కోయంబత్తూర్ వరస పేలుళ్ల సూత్రధారి 58 మంది భారతీయులను హత్య చేసి, 231 మందిని గాయపరిచిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ‘‘అమరవీరుడి’’ హోదాను ఇచ్చింది. నమాజ్ ఇ జనాజా ఒక టెర్రరిస్టుకు అనుమతించబడింది. అతడిని ప్రశంసిస్తూ నినాదాలు చేస్తుంటే పోలీసులు భద్రత కల్పించారు’’ అని పూనావాలా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇండియా కూటమి ‘‘జాతీయ భద్రత’’ కన్నా ‘‘ఓటు బ్యాంక్ భద్రత’’కు ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. అఫ్జల్ గురుని ప్రశంసించడం నుంచి ఇప్పుడు బాషా వరకు, సిమీ రక్షించడం నుంచి పీఎఫ్ఐ వరకు ఇండియా కూటమి ప్రేమ కురిపిస్తోందని పూనావాలా అన్నారు.
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
Read Also: Amit Shah: అంబేద్కర్ను గౌరవించింది మోడీ సర్కారే
ఇదిలా ఉంటే, తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై కూడా డీఎంకే ప్రభుత్వ తీరుపై బుధవారం విరుచుకుపడ్డారు. ‘‘మైనారిటీల బుజ్జగింపులో డీఎంకే ప్రభుత్వం ఏ స్థాయికి వెళ్లిందో చూపిస్తోంది. అమాయకపు ప్రాణాలను బలిగొన్న వ్యక్తి పెరోల్ సమయంలో మరణించాడు. అతడి అంత్యక్రియల ఊరేగింపుకు అనుమతి ఇవ్వడం సిగ్గుచేటు. ఈ రోజు శాంతిభద్రతలు చచ్చిపోయినందున కోయంబత్తూర్ బీజేపీ యూనిట్ వచ్చే శుక్రవారం బ్లాక్డేగా పాటిస్తుంది’’ అని అన్నామలై అన్నారు.
మరోవైపు డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్, అంత్యక్రియలు కుటుంబ హక్కు అని సమర్థించారు. ఈ పాదయాత్రతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘‘అది వారి హక్కు. మృతుడి కుటుంబం అంత్యక్రియల్ని నిర్వహిస్తుంది. గాంధీ హంతకుడి పుట్టినరోజుని బీజేపీ నిర్వహిస్తుంది. ఈ ఊరేగింపుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఒకరి అంత్యక్రియల్ని ఎలా ఆపగలం’’ అని ఇలంగోవన్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..