BJP: కోయంబత్తూర్ పేలుళ్ల టెర్రరిస్ట్ అంత్యక్రియలకు ఈ మర్యాదలేంటి ఏంటి..?
- ఉగ్రవాది ఎస్ఏ బాషా అంత్యక్రియలపై రచ్చ..
- అంత్యక్రియల ఊరేగింపుకు అనుమతి..
- డీఎంకే ప్రభుత్వంపై బీజేపీ ఫైర్..
- కోయంబత్తూర్ పేలుళ్లలో ప్రధాన సూత్రధారి ఎస్ఏ బాషా
BJP: ఉగ్రవాది ఎస్ఏ బాషా అంత్యక్రియల ఉరేగింపుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంపై తమిళనాడు ప్రభుత్వం, ఇండియా కూటమిపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. డీఎంకే పార్టీపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా బుధవారం మండిపడ్డారు. అల్-ఉమ్మర్ సంస్థ వ్యవస్థాపకుడు బాషా పెరోల్పై బయటకు వచ్చిన సమయంలో అనారోగ్యంతో మరణించారు. 1998 కోయంబత్తూర్ వరస పేలుళ్ల ఘటనలో బాషా మాస్టర్ మైండ్గా ఉన్నాడు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు.
‘‘ తమిళనాడు ఘటన షాకింగ్కి గురిచేస్తోంది. 1998 కోయంబత్తూర్ వరస పేలుళ్ల సూత్రధారి 58 మంది భారతీయులను హత్య చేసి, 231 మందిని గాయపరిచిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ‘‘అమరవీరుడి’’ హోదాను ఇచ్చింది. నమాజ్ ఇ జనాజా ఒక టెర్రరిస్టుకు అనుమతించబడింది. అతడిని ప్రశంసిస్తూ నినాదాలు చేస్తుంటే పోలీసులు భద్రత కల్పించారు’’ అని పూనావాలా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇండియా కూటమి ‘‘జాతీయ భద్రత’’ కన్నా ‘‘ఓటు బ్యాంక్ భద్రత’’కు ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. అఫ్జల్ గురుని ప్రశంసించడం నుంచి ఇప్పుడు బాషా వరకు, సిమీ రక్షించడం నుంచి పీఎఫ్ఐ వరకు ఇండియా కూటమి ప్రేమ కురిపిస్తోందని పూనావాలా అన్నారు.
Also Read
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
Read Also: Amit Shah: అంబేద్కర్ను గౌరవించింది మోడీ సర్కారే
ఇదిలా ఉంటే, తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై కూడా డీఎంకే ప్రభుత్వ తీరుపై బుధవారం విరుచుకుపడ్డారు. ‘‘మైనారిటీల బుజ్జగింపులో డీఎంకే ప్రభుత్వం ఏ స్థాయికి వెళ్లిందో చూపిస్తోంది. అమాయకపు ప్రాణాలను బలిగొన్న వ్యక్తి పెరోల్ సమయంలో మరణించాడు. అతడి అంత్యక్రియల ఊరేగింపుకు అనుమతి ఇవ్వడం సిగ్గుచేటు. ఈ రోజు శాంతిభద్రతలు చచ్చిపోయినందున కోయంబత్తూర్ బీజేపీ యూనిట్ వచ్చే శుక్రవారం బ్లాక్డేగా పాటిస్తుంది’’ అని అన్నామలై అన్నారు.
మరోవైపు డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్, అంత్యక్రియలు కుటుంబ హక్కు అని సమర్థించారు. ఈ పాదయాత్రతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘‘అది వారి హక్కు. మృతుడి కుటుంబం అంత్యక్రియల్ని నిర్వహిస్తుంది. గాంధీ హంతకుడి పుట్టినరోజుని బీజేపీ నిర్వహిస్తుంది. ఈ ఊరేగింపుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఒకరి అంత్యక్రియల్ని ఎలా ఆపగలం’’ అని ఇలంగోవన్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!