BJP: కోయంబత్తూర్ పేలుళ్ల టెర్రరిస్ట్ అంత్యక్రియలకు ఈ మర్యాదలేంటి ఏంటి..?
- ఉగ్రవాది ఎస్ఏ బాషా అంత్యక్రియలపై రచ్చ..
- అంత్యక్రియల ఊరేగింపుకు అనుమతి..
- డీఎంకే ప్రభుత్వంపై బీజేపీ ఫైర్..
- కోయంబత్తూర్ పేలుళ్లలో ప్రధాన సూత్రధారి ఎస్ఏ బాషా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఉగ్రవాది ఎస్ఏ బాషా అంత్యక్రియల ఉరేగింపుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంపై తమిళనాడు ప్రభుత్వం, ఇండియా కూటమిపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. డీఎంకే పార్టీపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా బుధవారం మండిపడ్డారు. అల్-ఉమ్మర్ సంస్థ వ్యవస్థాపకుడు బాషా పెరోల్పై బయటకు వచ్చిన సమయంలో అనారోగ్యంతో మరణించారు. 1998 కోయంబత్తూర్ వరస పేలుళ్ల ఘటనలో బాషా మాస్టర్ మైండ్గా ఉన్నాడు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు.
‘‘ తమిళనాడు ఘటన షాకింగ్కి గురిచేస్తోంది. 1998 కోయంబత్తూర్ వరస పేలుళ్ల సూత్రధారి 58 మంది భారతీయులను హత్య చేసి, 231 మందిని గాయపరిచిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ‘‘అమరవీరుడి’’ హోదాను ఇచ్చింది. నమాజ్ ఇ జనాజా ఒక టెర్రరిస్టుకు అనుమతించబడింది. అతడిని ప్రశంసిస్తూ నినాదాలు చేస్తుంటే పోలీసులు భద్రత కల్పించారు’’ అని పూనావాలా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇండియా కూటమి ‘‘జాతీయ భద్రత’’ కన్నా ‘‘ఓటు బ్యాంక్ భద్రత’’కు ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. అఫ్జల్ గురుని ప్రశంసించడం నుంచి ఇప్పుడు బాషా వరకు, సిమీ రక్షించడం నుంచి పీఎఫ్ఐ వరకు ఇండియా కూటమి ప్రేమ కురిపిస్తోందని పూనావాలా అన్నారు.
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
Read Also: Amit Shah: అంబేద్కర్ను గౌరవించింది మోడీ సర్కారే
ఇదిలా ఉంటే, తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై కూడా డీఎంకే ప్రభుత్వ తీరుపై బుధవారం విరుచుకుపడ్డారు. ‘‘మైనారిటీల బుజ్జగింపులో డీఎంకే ప్రభుత్వం ఏ స్థాయికి వెళ్లిందో చూపిస్తోంది. అమాయకపు ప్రాణాలను బలిగొన్న వ్యక్తి పెరోల్ సమయంలో మరణించాడు. అతడి అంత్యక్రియల ఊరేగింపుకు అనుమతి ఇవ్వడం సిగ్గుచేటు. ఈ రోజు శాంతిభద్రతలు చచ్చిపోయినందున కోయంబత్తూర్ బీజేపీ యూనిట్ వచ్చే శుక్రవారం బ్లాక్డేగా పాటిస్తుంది’’ అని అన్నామలై అన్నారు.
మరోవైపు డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్, అంత్యక్రియలు కుటుంబ హక్కు అని సమర్థించారు. ఈ పాదయాత్రతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘‘అది వారి హక్కు. మృతుడి కుటుంబం అంత్యక్రియల్ని నిర్వహిస్తుంది. గాంధీ హంతకుడి పుట్టినరోజుని బీజేపీ నిర్వహిస్తుంది. ఈ ఊరేగింపుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఒకరి అంత్యక్రియల్ని ఎలా ఆపగలం’’ అని ఇలంగోవన్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!