Doklam issue: డోక్లాం సమీపంలో గ్రామాలను నిర్మిస్తోన్న చైనా..
- డోక్లాంలో గ్రామాలు నిర్మిస్తున్న చైనా..
- భూటాన్ భూభాగాన్ని ఆక్రమించి నిర్మాణాలు..
- భారత్కి ఆందోళనకర పరిణామాలు..
- డోక్లాంకి సమీపంలో ‘‘సిలిగురి కారిడార్’’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doklam issue: మరోసారి చైనా తన దొంగబుద్ధిని చాటుకుంది. గత 8 ఏళ్లుగా భూటాన్ భూభాగమైన డోక్లామ్ సమీపంలో 22 గ్రామాలను నిర్మించినట్లు శాటిలైట్ చిత్రాల్లో తేలింది. వీటిలో 8 గ్రామాలు 2020 నుంచి వ్యూహాత్మక డోక్లామ్ పీఠభూమికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నట్లు శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో ఉండగా ఈ పరిణామం జరిగింది.
డోక్లామ్ పీఠభూమి భూటాన్ భూభాగం. ఈ ప్రాంతం భారత్కి అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. ఈ పీఠభూమికి సమీపంలోనే అత్యంత కీలమైన ‘‘సిలిగురి కారిడార్(చికెన్ నెక్)’’ ఉంది. ఈ కారిడార్ ఈశాన్య భారతాన్ని, మిగిలిన దేశంతో కలుపుతోంది. భూటాన్ పశ్చిమ ప్రాంతంలోని డోక్లామ్ సమీపంలో ఉన్న ఈ గ్రామాలను చైనా తన సొంత గ్రామాలుగా చెప్పుకుంటోంది. వాటిలో చాలా వరకు సైనిక ఔట్పోస్టులు ఉన్నాయి. ఈ 22 గ్రామాల్లో అతిపెద్దది ‘‘జివు’’. ఇది పశ్చిమ సెక్టార్లోని త్షేతాంగ్ఖా అని పిలువబడే సాంప్రదాయ భూటాన్ పచ్చికభూమిపై నిర్మించబడిందని నివేదికలు తెలుపుతున్నాయి.
Also Read
- Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
- PM Modi: న్యూజిలాండ్లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
Read Also: Folk Singer Suicide: ఫోక్ సింగర్ ప్రాణం తీసిన సోషల్ మీడియా ప్రేమ
2017లో భారత్-చైనాల మధ్య డోక్లామ్ వివాదం ఏర్పడింది. రెండు దేశాల బలగాల మధ్య 73 రోజుల పాటు ప్రతిష్టంభన ఏర్పడింది. చైనా నిర్మిస్తున్న హైవేని, ఇతర మౌలిక సదుపాయాలను భారత్ అడ్డుకుంది. ‘‘ఫోర్స్ఫుల్ డిప్లమసీ’’ పేరుతో వెల్లడైన రిపోర్టులో చైనా భూటాన్కి చెందిన 2 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతంలోకి అధికారులు, నిర్మాణ కార్మికులు, సరిహద్దు పోలీసులు, సైనిక సిబ్బందిని తరలించింది.
చైనా నిర్మాణాలు భారత్కి ఆందోళన కలిగించేవే. చైనా చర్యలు భూటాన్తో 1998 ఒప్పందాన్ని ఉల్లంఘించాయని చైనాలో భారత మాజీ రాయబారి అశోక్ కాంత అన్నారు. చైనా చర్యలు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, యథాతథ స్థితిని కొనసాగించడానికి భూటాన్తో 1998 ఒప్పందాన్ని ఉల్లంఘించాయని చెప్పారు. వాస్తవాలను క్రమంగా మార్చే పనిలో చైనా ఉందని అన్నారు.
తాజావార్తలు
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!