Amit Shah: దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వారు త్వరలోనే సిగ్గుపడతారు..
- త్వరలో ఇంగ్లీష్ మాట్లాడే వారు సిగ్గుపడుతారు..
- భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొందాల్సిన సమయం వచ్చింది..
- మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు ..
- భారతీయ భాషలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
Amit Shah: భారతీయ భాషలు దేశ గుర్తింపుకు ఆత్మ వంటివని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అన్నారు. భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది, మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. మాజీ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రచించిన ‘మెయిన్ బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఈ దేశంలో, ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడతారు . అటువంటి సమాజం ఏర్పడటం ఎంతో దూరంలో లేదు. దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే మార్పు తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు అని నేను నమ్ముతున్నాను. మన భాషలు లేకుంటే, మనం నిజంగా భారతీయులుగా ఉండటం మానేస్తాము.’’ అని అమిత్ షా అన్నారు.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
‘‘మన దేశాన్ని, మన సంస్కృతిని, మన చరిత్రను, మన మతాన్ని అర్థం చేసుకోవడానికి, ఏ విదేశీ భాష కూడా సరిపోదు. పూర్తి భారతదేశ ఆలోచనను విదేశీ భాషల ద్వారా ఊహించలేము. ఈ యుద్ధం ఎంత కష్టమో నాకు పూర్తిగా తెలుసు, కానీ భారత సమాజం దానిని గెలుస్తుందని కూడా నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరోసారి, ఆత్మగౌరవంతో, మన దేశాన్ని మన స్వంత భాషలలో నడుపుతాము, ప్రపంచాన్ని కూడా నడిపిస్తాము’’ అని అన్నారు.
Read Also: Thug Life: ‘‘థగ్ లైఫ్’’ రిలీజ్ చేయాలి, ఇది మీ కర్తవ్యం.. కర్ణాటకపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
‘‘ప్రధాని మోడీ అమృత కాలం కోసం ‘పంచ్ ప్రాణ్’ (ఐదు ప్రతిజ్ఞలు) కు పునాది వేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క లక్ష్యాన్ని సాధించడం, బానిసత్వం యొక్క ప్రతి జాడను వదిలించుకోవడం, మన వారసత్వం పట్ల గర్వపడటం, ఐక్యత మరియు సంఘీభావానికి కట్టుబడి ఉండటం, ప్రతి పౌరుడిలో విధి స్ఫూర్తిని రగిలించడం – ఈ ఐదు ప్రతిజ్ఞలు 130 కోట్ల మంది ప్రజల సంకల్పంగా మారాయి. అందుకే 2047 నాటికి మనం శిఖరాగ్రంలో ఉంటాం, ఈ ప్రయాణంలో మన భాషలు ప్రధాన పాత్ర పోషిస్తాయి’’ అని చెప్పారు.
మాజీ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రాసిన పుస్తకం గురించి మాట్లాడుతూ.. పరిపాలన అధికారుల శిక్షణలో మార్పు అవసరమని కేంద్ర హోం మంత్రి చెప్పారు. ఏదైనా పాలకుడు లేదా నిర్వాహకుడు సానుభూతి లేకుండా పాలిస్తే, వారు పాలన యొక్క నిజమైన లక్ష్యాన్ని సాధించలేరని అన్నారు. మన దేశం కటిక చీకటిలో ఉన్నప్పుడు కూడా మన సాహిత్యం, మన మతం, స్వేచ్ఛ, సంస్కృతి దీపాలను వెలిగించిందని అన్నారు. సాహిత్య మన సమాజానికి ఆత్మ అని కేంద్ర హోంమంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?