Amit Shah: దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వారు త్వరలోనే సిగ్గుపడతారు..
- త్వరలో ఇంగ్లీష్ మాట్లాడే వారు సిగ్గుపడుతారు..
- భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొందాల్సిన సమయం వచ్చింది..
- మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు ..
- భారతీయ భాషలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: భారతీయ భాషలు దేశ గుర్తింపుకు ఆత్మ వంటివని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అన్నారు. భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది, మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. మాజీ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రచించిన ‘మెయిన్ బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఈ దేశంలో, ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడతారు . అటువంటి సమాజం ఏర్పడటం ఎంతో దూరంలో లేదు. దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే మార్పు తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు అని నేను నమ్ముతున్నాను. మన భాషలు లేకుంటే, మనం నిజంగా భారతీయులుగా ఉండటం మానేస్తాము.’’ అని అమిత్ షా అన్నారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
‘‘మన దేశాన్ని, మన సంస్కృతిని, మన చరిత్రను, మన మతాన్ని అర్థం చేసుకోవడానికి, ఏ విదేశీ భాష కూడా సరిపోదు. పూర్తి భారతదేశ ఆలోచనను విదేశీ భాషల ద్వారా ఊహించలేము. ఈ యుద్ధం ఎంత కష్టమో నాకు పూర్తిగా తెలుసు, కానీ భారత సమాజం దానిని గెలుస్తుందని కూడా నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరోసారి, ఆత్మగౌరవంతో, మన దేశాన్ని మన స్వంత భాషలలో నడుపుతాము, ప్రపంచాన్ని కూడా నడిపిస్తాము’’ అని అన్నారు.
Read Also: Thug Life: ‘‘థగ్ లైఫ్’’ రిలీజ్ చేయాలి, ఇది మీ కర్తవ్యం.. కర్ణాటకపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
‘‘ప్రధాని మోడీ అమృత కాలం కోసం ‘పంచ్ ప్రాణ్’ (ఐదు ప్రతిజ్ఞలు) కు పునాది వేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క లక్ష్యాన్ని సాధించడం, బానిసత్వం యొక్క ప్రతి జాడను వదిలించుకోవడం, మన వారసత్వం పట్ల గర్వపడటం, ఐక్యత మరియు సంఘీభావానికి కట్టుబడి ఉండటం, ప్రతి పౌరుడిలో విధి స్ఫూర్తిని రగిలించడం – ఈ ఐదు ప్రతిజ్ఞలు 130 కోట్ల మంది ప్రజల సంకల్పంగా మారాయి. అందుకే 2047 నాటికి మనం శిఖరాగ్రంలో ఉంటాం, ఈ ప్రయాణంలో మన భాషలు ప్రధాన పాత్ర పోషిస్తాయి’’ అని చెప్పారు.
మాజీ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రాసిన పుస్తకం గురించి మాట్లాడుతూ.. పరిపాలన అధికారుల శిక్షణలో మార్పు అవసరమని కేంద్ర హోం మంత్రి చెప్పారు. ఏదైనా పాలకుడు లేదా నిర్వాహకుడు సానుభూతి లేకుండా పాలిస్తే, వారు పాలన యొక్క నిజమైన లక్ష్యాన్ని సాధించలేరని అన్నారు. మన దేశం కటిక చీకటిలో ఉన్నప్పుడు కూడా మన సాహిత్యం, మన మతం, స్వేచ్ఛ, సంస్కృతి దీపాలను వెలిగించిందని అన్నారు. సాహిత్య మన సమాజానికి ఆత్మ అని కేంద్ర హోంమంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!