Amit Shah: దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వారు త్వరలోనే సిగ్గుపడతారు..
- త్వరలో ఇంగ్లీష్ మాట్లాడే వారు సిగ్గుపడుతారు..
- భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొందాల్సిన సమయం వచ్చింది..
- మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు ..
- భారతీయ భాషలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: భారతీయ భాషలు దేశ గుర్తింపుకు ఆత్మ వంటివని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అన్నారు. భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది, మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. మాజీ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రచించిన ‘మెయిన్ బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఈ దేశంలో, ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడతారు . అటువంటి సమాజం ఏర్పడటం ఎంతో దూరంలో లేదు. దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే మార్పు తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు అని నేను నమ్ముతున్నాను. మన భాషలు లేకుంటే, మనం నిజంగా భారతీయులుగా ఉండటం మానేస్తాము.’’ అని అమిత్ షా అన్నారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
‘‘మన దేశాన్ని, మన సంస్కృతిని, మన చరిత్రను, మన మతాన్ని అర్థం చేసుకోవడానికి, ఏ విదేశీ భాష కూడా సరిపోదు. పూర్తి భారతదేశ ఆలోచనను విదేశీ భాషల ద్వారా ఊహించలేము. ఈ యుద్ధం ఎంత కష్టమో నాకు పూర్తిగా తెలుసు, కానీ భారత సమాజం దానిని గెలుస్తుందని కూడా నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరోసారి, ఆత్మగౌరవంతో, మన దేశాన్ని మన స్వంత భాషలలో నడుపుతాము, ప్రపంచాన్ని కూడా నడిపిస్తాము’’ అని అన్నారు.
Read Also: Thug Life: ‘‘థగ్ లైఫ్’’ రిలీజ్ చేయాలి, ఇది మీ కర్తవ్యం.. కర్ణాటకపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
‘‘ప్రధాని మోడీ అమృత కాలం కోసం ‘పంచ్ ప్రాణ్’ (ఐదు ప్రతిజ్ఞలు) కు పునాది వేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క లక్ష్యాన్ని సాధించడం, బానిసత్వం యొక్క ప్రతి జాడను వదిలించుకోవడం, మన వారసత్వం పట్ల గర్వపడటం, ఐక్యత మరియు సంఘీభావానికి కట్టుబడి ఉండటం, ప్రతి పౌరుడిలో విధి స్ఫూర్తిని రగిలించడం – ఈ ఐదు ప్రతిజ్ఞలు 130 కోట్ల మంది ప్రజల సంకల్పంగా మారాయి. అందుకే 2047 నాటికి మనం శిఖరాగ్రంలో ఉంటాం, ఈ ప్రయాణంలో మన భాషలు ప్రధాన పాత్ర పోషిస్తాయి’’ అని చెప్పారు.
మాజీ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రాసిన పుస్తకం గురించి మాట్లాడుతూ.. పరిపాలన అధికారుల శిక్షణలో మార్పు అవసరమని కేంద్ర హోం మంత్రి చెప్పారు. ఏదైనా పాలకుడు లేదా నిర్వాహకుడు సానుభూతి లేకుండా పాలిస్తే, వారు పాలన యొక్క నిజమైన లక్ష్యాన్ని సాధించలేరని అన్నారు. మన దేశం కటిక చీకటిలో ఉన్నప్పుడు కూడా మన సాహిత్యం, మన మతం, స్వేచ్ఛ, సంస్కృతి దీపాలను వెలిగించిందని అన్నారు. సాహిత్య మన సమాజానికి ఆత్మ అని కేంద్ర హోంమంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!