Karnataka: హౌసింగ్ పథకంలో ముస్లింలకు 15 శాతం కోటా.. కాంగ్రెస్ సర్కార్ ఆమోదం..
- హౌసింగ్ పథకంలో ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్..
- కర్ణాటక క్యాబినెట్ కీలక నిర్ణయం..
- నిర్ణయాన్ని సమర్థిస్తున్న కాంగ్రెస్ మంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహనిర్మాణ పథకాల్లో ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లను పెంచే ప్రతిపాదనను కర్ణాటక క్యాబినెట్ ఈ రోజు ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలు అమలు చేసే అన్ని హౌసింగ్ పథకాల్లో ముస్లింలకు ప్రత్యేక కోటాను మంజూరు చేసింది. మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లను ప్రస్తుత 10 శాతం నుండి 15 శాతానికి పెంచే ప్రతిపాదనకు గృహనిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మద్దతు ఇచ్చారు.
Read Also: Shashi Tharoor: బీజేపీతో సాన్నిహిత్యంపై నోరు విప్పిన శశి థరూర్.. ఏమన్నారంటే..!
Also Read
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
‘‘వాస్తవానికి మనం జనాభాను బట్టి ఆలోచించాలి, పట్టణ జనాభాలో ఎక్కువ మంది మైనారిటీలు, పేదలు ఉన్నారు.’’ అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ రిజర్వేషన్లను సమర్థించారు. ఇళ్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఇతరులకు కేటాయించలేదని, అందుకే ముస్లిం కోటాను 10 నుంచి 15 శాతానికి పెంచామని అన్నారు. మైనారిటీలు చాలా కాలంగా రిజర్వేషన్లు పెంచాలని అభ్యర్థిస్తున్నారని, దీంతో ఖాళీగా ఉన్న భవనాలను నింపే క్రమంలో 15 శాతం కోటా కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని మంత్రి ఎంసీ సుధాకర్ కూడా సమర్థించారు. కేంద్రం ఇప్పటికే మైనారిటీలకు 15 శాతం కేటాయింపులు చేస్తోందని, దానికి అనుగుణంగా రాష్ట్రం కూడా చర్యలు తీసుకుందని చెప్పారు.
మరోవైపు, కర్ణాటక ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత(సవరణ) బిల్లు-2025ను ప్రవేశపెట్టింది. రూ. 2 కోట్ల కన్నా తక్కువ విలువ చేసే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లును ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే, ఈ బిల్లును మే 22న కర్ణాటక గవర్నర్, రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. ప్రధాని మోడీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పలుమార్లు విమర్శించారు. మతం ఆధారంగా టెండర్లలో రిజర్వేషన్ మంజూరు చేస్తున్నారని, ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కుల్ని హరిస్తుందని ఆరోపించారు.
తాజావార్తలు
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?