Krishnam Raju: కృష్ణం రాజు మరణంపై ప్రధాని మోదీ, అమిత్ షా సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishnam Raju: లెజండరీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణం రాజు(83) మరణంపై యావత్ సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఓ గొప్ప నటుడు మరణించడంతో దేశవ్యాప్తంగా పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ వార్త విని ఒక్కసారిగా సినీలోకం, ఆయన అభిమానులు షాక్ అయ్యారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో కన్నుముశారు.
ప్రముఖ తెలుగు నటుడు, మాజీ కేంద్రమంత్రి హైదరాబాద్ లో మృతి చెందడం పట్ల ప్రధాన మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ, కృష్ణం రాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ పీఎం మోదీ ట్వీట్ చేశారు. ‘‘ రాబోయే తరాలు అతని సినీ నైపుణ్యం, సృజనాత్మకతను గుర్తుంచుకుంటాయి. సమాజసేవలో ముందున్నారు. రాజకీయ నాయకుడిగా చెరగని ముద్ర వేశారు’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేశారు.
Also Read
- IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
- Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
Read Also: AIG Doctors: కృష్ణంరాజు మృతి కారణం అదే.. ఏఐజీ వైద్యులు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ ప్రముఖుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు మనల్ని విడిచిపెట్టడం చాలా బాధ కలిగించిందని.. తన నటనతో లక్షల మంది హృదయాలను గెలుచుకున్నారని.. సమాజ అభివృద్ధికి కృషి చేశారని. ఆయన మరణం తెలుగు చిత్రసీమలో లోటును మిగిల్చిందంటూ ట్విట్టర్ ద్వారా అమిత్ షా సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఆయన మరణం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సంతాపం వ్యక్తం చేశారు. సినీనటులు కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Saddened by the passing away of Shri UV Krishnam Raju Garu. The coming generations will remember his cinematic brilliance and creativity. He was also at the forefront of community service and made a mark as a political leader. Condolences to his family and admirers. Om Shanti pic.twitter.com/hJyeGVpYA5
— Narendra Modi (@narendramodi) September 11, 2022
తాజావార్తలు
-
IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!