KCR: ప్రగతి భవన్కు కుమార స్వామి.. కేసీఆర్తో దేశ రాజకీయాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kumaraswamy met with KCR: జేడీయూ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ కానున్నారు. వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలపై ఇరు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. మొదటగా ఇద్దరు నేతలు ప్రగతి భవన్ లో లంచ్ చేయనున్నారు. ఆ తరువాత సాయంత్ర 5 గంటల వరకు ఇరు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. కేసీఆర్ కొత్తగా జాతీయ పార్టీ పెడుతారనే చర్చ నేపథ్యంలో కుమారస్వామితో కీలక భేటీ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో సీఎం కేసీఆర్, మాజీ ప్రధాని దేవెగౌడతో బెంగళూర్ లో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో కేసీఆర్ దేశవ్యాప్తంగా ప్రాంతీయపార్టీలు, నేతలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో దేవెగౌడతో జరిగిన చర్చలకు కొనసాగింపుగానే తాజాగా కుమారస్వామి, సీఎం కేసీఆర్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపేతర ఫ్రంటులను ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నాయకులను కలుస్తున్నారు.
Also Read
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
Read Also: Danam Nagender: సీఎం కేసీఆర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే నందుబిలాల్ నిరసన చేయడం తప్పా?
గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే ఉన్న సమయంలో ఆయనతో ముంబైలో భేటీ అయ్యారు. ఇటీవల కాలంలో వరసగా ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జేడీయూ నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తో పాట్నాలో సమావేశం అయ్యారు. ఆ సమయంలో కూడా వీరి జాతీయ స్థాయిలో బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. బీహార్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు.
అయితే మిగతా ఎన్డీయేతర, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో సఖ్యతగా ఉంటున్నాయి. అయితే బీజేపేతర, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్న సీఎం కేసీఆర్ తో కుమార స్వామి చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా.. ఈ సమావేశం అనంతరం ఇరు నేతలు మీడియాలో మాట్లాడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీలో నాలుగు రోజులు పర్యటించారు. తాజాగా కేసీఆర్ తో జేడీయూ అధినేత కుమారస్వామితో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఇరు నేతలు ఏం మాట్లాడుతారనే దానిపైన ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..