KCR: ప్రగతి భవన్కు కుమార స్వామి.. కేసీఆర్తో దేశ రాజకీయాలపై చర్చ
Kumaraswamy met with KCR: జేడీయూ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ కానున్నారు. వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలపై ఇరు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. మొదటగా ఇద్దరు నేతలు ప్రగతి భవన్ లో లంచ్ చేయనున్నారు. ఆ తరువాత సాయంత్ర 5 గంటల వరకు ఇరు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. కేసీఆర్ కొత్తగా జాతీయ పార్టీ పెడుతారనే చర్చ నేపథ్యంలో కుమారస్వామితో కీలక భేటీ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో సీఎం కేసీఆర్, మాజీ ప్రధాని దేవెగౌడతో బెంగళూర్ లో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో కేసీఆర్ దేశవ్యాప్తంగా ప్రాంతీయపార్టీలు, నేతలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో దేవెగౌడతో జరిగిన చర్చలకు కొనసాగింపుగానే తాజాగా కుమారస్వామి, సీఎం కేసీఆర్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపేతర ఫ్రంటులను ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నాయకులను కలుస్తున్నారు.
Also Read
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
- Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
Read Also: Danam Nagender: సీఎం కేసీఆర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే నందుబిలాల్ నిరసన చేయడం తప్పా?
గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే ఉన్న సమయంలో ఆయనతో ముంబైలో భేటీ అయ్యారు. ఇటీవల కాలంలో వరసగా ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జేడీయూ నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తో పాట్నాలో సమావేశం అయ్యారు. ఆ సమయంలో కూడా వీరి జాతీయ స్థాయిలో బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. బీహార్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు.
అయితే మిగతా ఎన్డీయేతర, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో సఖ్యతగా ఉంటున్నాయి. అయితే బీజేపేతర, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్న సీఎం కేసీఆర్ తో కుమార స్వామి చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా.. ఈ సమావేశం అనంతరం ఇరు నేతలు మీడియాలో మాట్లాడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీలో నాలుగు రోజులు పర్యటించారు. తాజాగా కేసీఆర్ తో జేడీయూ అధినేత కుమారస్వామితో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఇరు నేతలు ఏం మాట్లాడుతారనే దానిపైన ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!