వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం లో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. వేలాది కోతులు గ్రామ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. ఇళ్లలోకి చొరబడి రక్కి గాయపరుస్తున్నాయి.. ఒంటరిగా తిరగలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువేత్తాయి. కోతుల నుండి మా ప్రాణాలు కాపాడండి మొర్రో అని వేడుకుంటున్నారు.. వానరసేనల దాడుల నుండి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఇల్లంద గ్రామ సర్పంచ్ కు ఇంతకు మించిన మార్గం కనిపించలేదు.. […]
మేడారం మహాజాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభంకాబోతోంది. ఇప్పటికే వేలాదిమంది భక్తులు మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మలకు ముక్కులు చెల్లించుకుంటున్నారు. మొక్కితె వరమిచ్చే వనదేవతలకు భక్తులు బంగారం సమర్పిస్తూ భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. కాగా ములుగు జిల్లా మేడారంలో హెలికాప్టర్ రైడ్స్ షురువయ్యాయి. తాడ్వాయి మండలం ఎలుబాక నుండి మేడారం ఏరియల్ వ్యూ వీక్షించేందుకు హెలికాప్టర్ సేవలు నడపనున్న టూరిజం శాఖ తాజాగా తెలిపింది. Also Read:Moon: చంద్రునిపై హోటల్!.. బుకింగ్స్ ప్రారంభం.. ధర తెలిస్తే షాకవుతారు మేడారం వచ్చే […]
ఇవాళ గ్రూప్-1 పై తెలంగా హైకోర్టు తీర్పు వెల్లడించనున్నది. ఉదయం 11 గంటల లోపు నిర్ణయం వెల్లడించనున్నది. ఇవాల్టి తీర్పుతో అపాయింట్మెంట్ లేటర్లు తీసుకున్న 563 గ్రూప్ 1 అధికారుల భవితవ్యం తేలనున్నది. ఇవాల్టి తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పింది. టీజీపీఎస్సీ 2024 లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించారు సెలెక్ట్ కాని అభ్యర్థులు. విచారణ అనంతరం సెలెక్షన్ లిస్టును రద్దు […]
ఇప్పటికే చంద్రునిపై ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. మానవ నివాసయోగ్యానికి అవసరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయా? చంద్రమండలంపై నీరు, ఖనిజాలు ఇలా ప్రతి అంశంపై అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ కంపెనీ చంద్రునిపై హోటల్ నిర్మించేందుకు రెడీ అయ్యింది. ఏకంగా హోటల్ లో బస చేసేందుకు బుకింగ్స్ ను కూడా ప్రారంభించింది. చంద్రునిపైకి వెళ్లగలమా? అనే అనుమానాలకు ఫుల్ స్టాప్ పడనున్నట్లే అనిపిస్తుంది. ఒకప్పుడు సైన్స్-ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమని భావించినది ఇప్పుడు వాస్తవంగా మారడానికి […]
మొజాంబికన్ మానవ హక్కుల కార్యకర్త గ్రాకా మాచెల్కు 2025 సంవత్సరానికి ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, డెవలప్ మెంట్ బహుమతిని ప్రదానం చేయనున్నట్లు జ్యూరీ బుధవారం ప్రకటించింది. మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ, క్లిష్ట పరిస్థితుల్లో విద్య, ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక సాధికారత, మానవతావాద సేవలలో ఆమె చేసిన అత్యుత్తమ కృషికి గాను మాచెల్ను ఎంపిక చేసిందని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ తెలిపింది. ఈ బహుమతి ప్రతియేటా ఇందిరా […]
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇవాళ ఆన్ లైన్ లో ఏప్రిల్ నెల దర్శన టిక్కెట్లు విడుదలకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదలవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ […]
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పంక్చర్ అయి అదుపుతప్పి రోడ్డు డివైడర్ దాటి అవతలివైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. సిరువెళ్ల మెట్ట పై ARBCVR ట్రావెల్స్ బస్సు, లారీ దగ్ధం అయ్యాయి. బస్సు, లారీ మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయాయి. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ మంటల్లో మృతి, బస్సు ఢీకొని లారీ క్లీనర్ మృతి చెందాడు. పలువురికి గాయాలు అయ్యాయి. మంటలు […]
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది మంది పేద, అసంఘటిత కార్మికులు పదవీ విరమణ తర్వాత కూడా హామీ ఇవ్వబడిన నెలవారీ పెన్షన్ను అందుకుంటారు. అటల్ పెన్షన్ యోజన (APY) ను 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రమోషనల్, అభివృద్ధి కార్యకలాపాలు మరియు గ్యాప్ ఫండింగ్ కోసం నిధుల మద్దతును విస్తరించడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసంఘటిత రంగంలోని కార్మికులకు వృద్ధాప్య ఆదాయ భద్రత కల్పించే లక్ష్యంతో […]
భారత సుప్రీంకోర్టు లా క్లర్కుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టులో లా క్లర్కులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం. మొత్తం 90 లా క్లర్కు పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. దీనికి బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీ అవసరం. వారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో న్యాయవాదిగా కూడా నమోదు చేసుకోవాలి . లా కోర్సులో ఐదవ […]
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను హత్య చేసినట్లు అంగీకరించిన వ్యక్తికి బుధవారం జపాన్ కోర్టు జీవిత ఖైదు విధించిందని NHK పబ్లిక్ టెలివిజన్ తెలిపింది. 45 ఏళ్ల టెట్సుయా యమగామి, జూలై 2022లో పశ్చిమ నగరమైన నారాలో తన ఎన్నికల ప్రచార ప్రసంగంలో అబేను హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. జపాన్లో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడైన అబే, ప్రధానమంత్రి పదవిని వదిలిపెట్టిన తర్వాత సాధారణ శాసనసభ్యుడిగా పనిచేస్తున్నప్పుడు, 2022లో పశ్చిమ నగరమైన నారాలో ప్రచారంలో […]