-
Bank of Baroda Recruitment 2025: 10th పాసై ఖాళీగా ఉన్నారా? ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ కు ఇప్పుడే అప్లై చేసుకోండి
ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం పొందాలనుకునే 10వ తరగతి పాసైన యువతకు ఇదే మంచి ఛాన్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్/ప్యూన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 22 పోస్టులు, తెలంగాణలో 13 పోస్టులు భర్తీకానున్నాయి. అభ్యర్థులు 10వ తరగతి (SSC/ మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థికి రాష్ట్రం/ప్రాంతం ప్రకారం స్థానిక భాషపై పరిజ్ఞానం ఉండాలి. Also […] -
MG Windsor EV Pro: దుమ్మురేపే ఫీచర్లతో ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 449 KM రేంజ్..
జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్స్ మార్కెట్ లోకి కొత్త కారును విడుదల చేసింది. దుమ్మురేపే ఫీచర్లతో కొత్త కారు MG విండ్సర్ ఈవీ ప్రోను భారత్ మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ కొత్త మోడల్ అధునాతన ఫీచర్లు, పెద్ద బ్యాటరీ ప్యాక్, మెరుగైన రేంజ్తో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉంది. జేఎస్ డబ్ల్యూ ఎంజీ విండ్సర్ ప్రో EV లో 52.9 KWh సామర్థ్యం గల బ్యాటరీ అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కి.మీ. […] -
Health Tips: తేనె ఆరోగ్యానికి, అందానికి వరం.. ప్రతి రోజు స్పూన్ చాలు
ప్రస్తుత కాలంలో ఉన్నోడి, లేనోడి లక్ష్యం ఒకటే డబ్బు సంపాదన. డబ్బు సంపాదించాలనే ఆరాటంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. టైముకు తినకపోవడం, సరియైన నిద్ర లేకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం కూడా కారణమవుతోంది. పోషకాహారాలు, ఔషద గుణాలున్న పానియాలు ఆహారంలో చేర్చుకుంటే వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు. వాటిలో తేనె ఒకటి. ఆయుర్వేదంలో తేనెను ఔషధంగా పరిగణిస్తారు. తేనె అందాన్ని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా […] -
UNSC: పహల్గామ్ దాడి వెనుక లష్కరే.. పాకిస్తాన్ ను గట్టిగా మందలించిన యూఎన్ భద్రతా మండలి
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆందోళన చెందిన పాకిస్తాన్ UNSC తో సమావేశం కావాలని అభ్యర్థించింది. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) రహస్య సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ ఒంటరి అయింది. ఈ సమావేశాన్ని పాకిస్తాన్ మరోసారి భారతదేశానికి వ్యతిరేకంగా అబద్ధాలు వ్యాప్తి చేయడానికి, కాశ్మీర్ సమస్యను లేవనెత్తడానికి ఉపయోగించుకుంది. సమావేశంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులు పాకిస్తాన్ […] -
Hyderabad: బాలిక ప్రాణం తీసిన మెసేజ్ లు.. అసలు ఏం జరిగిందంటే?
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అసభ్యకర మెసేజ్ లు బాలిక ప్రాణాలు తీశాయి. రంగనాయకుల గుట్టకు చెందిన బాలిక మీనాక్షి ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల విద్యార్ది రోహిత్ తన తమ్ముడి సోషల్ మీడియా అకౌంట్ నుంచి బాలికకు అసభ్యకర మెసేజ్ లు పంపించాడు. బాలికను వేధించసాగాడు. పోకిరి చేష్టలకు భయపడిపోయిన బాలిక తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వెంటనే అప్రమత్తమైన వారు రెండు రోజుల క్రితం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు […] -
Gold Rates: బంగారం ధరలకు రెక్కలు.. రూ. 2700 పెరిగిన తులం గోల్డ్ ధర
బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఇటీవల ఒక్కరోతే తులం గోల్డ్ ధర రూ. 3000 పెరిగి షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పసిడి ధరలు లక్ష రూపాయల మార్కుకు చేరుకున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి భారీగా పుత్తడి ధరలు పెరిగాయి. నేడు తులం గోల్డ్ పై రూ. 2,730 పెరిగింది. వెండి ధరలు మాత్రం స్పల్పంగా తగ్గాయి. నేడు కిలో వెండిపై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర […] -
Chennai: బీజేపీ మహిళా నాయకురాలి దారుణ హత్య.. తల నరికేసిన దుండగులు
తమిళనాడులో బీజేపీ మహిళా నాయకురాలి దారుణ హత్య సంచలనంగా మారింది. అత్యంత కిరాతకంగా అంతమొందించారు దుండగులు. తలనరికి హత్య చేశారు. మహిళా నేత హత్యతో తమిళనాడు ఉలిక్కిపడింది. గత రాత్రి శరణ్య ఇంటికి వెళుతుండగా వెంటాడిన దండుగులు తల నరికి చంపారు. మధురై సెంట్రల్ నియోజకవర్గం బీజేపీ మాజీ నాయకురాలుగా ఉన్న శరణ్య. గత ఎడాది మధురై పర్యటన సమయంలో మంత్రి పళబివేల్ త్యాగరాజన్ కారుమీదా శరణ్య చెప్పులు విసిరింది. అకేసులో శరణ్య సహా పలువురు బిజెపి […] -
Mock drill: పాక్ కు చెమటలు పట్టిస్తున్న భారత్.. దేశవ్యాప్తంగా రేపు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్..
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకునే నిర్ణయాలు పాక్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దౌత్యదాడికి దిగిన భారత్ మరో వైపు యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తుండడంతో పాక్ కు వెన్నులో వణుకు పుడుతుంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం 2025 మే 7న దేశవ్యాప్తంగా 244 గుర్తించబడిన పౌర రక్షణ జిల్లాల్లో భారీ మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది. క్షిపణి దాడులు లేదా వైమానిక దాడులు వంటి యుద్ధం లాంటి పరిస్థితులలో సాధారణ ప్రజలు ఎంత […] -
Supreme Court: సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. వెబ్ సైట్ లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తన వెబ్ సైట్ లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు, నియామక వివరాలను అప్ లోడ్ చేసింది. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యకు పూనుకుంది. జడ్జీల సంబంధిత వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలనే పూర్తి కోర్టు నిర్ణయానికి అనుగుణంగా, సుప్రీంకోర్టు సోమవారం తన వెబ్సైట్లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను అప్లోడ్ చేసినట్లు తెలిపింది. Also Read:What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే? ఏప్రిల్ […] -
Bihar: ఘోర ప్రమాదం.. కారు-ట్రాక్టర్ ఢీ.. 8 మంది మృతి
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కతిహార్ జిల్లాలో కారు, ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కారులోని ప్రయాణికులు వివాహ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా NH-31లోని సమేలి బ్లాక్ ఆఫీస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులందరూ పురుషులేనని, వారు ఎస్యూవీ కారులో ప్రయాణిస్తున్నారని కతిహార్ పోలీస్ ఎస్పీ వైభవ్ శర్మ పిటిఐకి తెలిపారు. ముందు నుంచి […]
తాజావార్తలు
-
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
-
Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
-
Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
-
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
-
PM Modi: తొలిసారి ‘బుక్మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్ఫుల్ బోర్డు
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!