బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో విషాదం నెలకొంది. షకీల్ తల్లి కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మృతి చెందింది. షకీల్ తల్లి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలిసిన పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా నేడు అచన్ పల్లిలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.