ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తేజేశ్వర్ ను చంపేందుకు 4 సార్లు ప్రయత్నం చేసి విఫలం అయినట్లు పోలీసులు తెలిపారు. 5 వ సారి సక్సెస్ అయ్యింది సుపారీ బ్యాచ్. మాస్టర్ మైండ్ అంతా తిరుమల రావుది అని పోలీసులు భావిస్తున్నారు. సుపారీ టీమ్ తేజేశ్వర్ ను చేను సర్వే చేయాలని తీసుకెళ్లినట్లు గుర్తించారు. దాడి సమయంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు తేజేశ్వర్. గద్వాల మండలం వీరాపురం స్టేజి […]
నిజమాబాద్ జిల్లా బోధన్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెంటఖుర్డు గ్రామంలో దారుణం వెలుగుచూసింది. కన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు కసాయిలా మారాడు. కన్నతల్లి పట్ల కాలయముడయ్యాడు. తాగిన మత్తులో తల్లిని గొడ్డలితో నరికాడు చిన్న కొడుకు సురేశ్. తల్లిని హతమార్చిన అనంతరం నగలు ఎత్తుకెళ్లాడు. సుమారు 50 తులాల వెండి ఆభరణాలు అపహరించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు […]
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిలపై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు స్థానిక సంస్థల ఎన్నిల విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమీషన్ వాదనలు పూర్తయ్యాయి. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది. Also Read:OPPO K13x 5G: అసలు మిస్ అవ్వద్దు.. కేవలం […]
ఓ మహిళ చనిపోయినట్లు భావించిన ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు. నెల రోజుల తర్వాత అకస్మాత్తుగా ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆ మహిళ సజీవంగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విషాదం నెలకొన్న ఆ ఇంట్లో ఆనందం వెల్లువిరిసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహబ్బత్ పర్సా పంచాయతీలోని భాద్ప నయా బస్తీ నివాసి రామ్ స్వరూప్ రాయ్ భార్య రమా దేవి (45) మే 17న అకస్మాత్తుగా ఇంటి నుంచి అదృశ్యమైంది. కుటుంబ […]
ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా మిడ్నైట్ హామర్ అనే చారిత్రాత్మక సైనిక చర్యను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో, 7 B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు 14 GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ (MOP) బాంబులను ఇరాన్ అత్యంత సురక్షితమైన అణు స్థావరం అయిన ఫోర్డోపై జారవిడిచాయి. మాక్సర్ నుంచి వచ్చిన తాజా ఉపగ్రహ చిత్రాలు ఫోర్డో ఎగువ శిఖరంపై కనీసం 6 ఆయుధ ప్రవేశ రంధ్రాలు/క్రేటర్లను చూపిస్తున్నాయి. ఈ దాడులలో ఇరాన్ భారీ నష్టాలను […]
అమెరికా B-2 బాంబర్లను ఉపయోగించి ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేసింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్లోని అణు కేంద్రాలను నాశనం చేశామని అమెరికా పేర్కొంది. కానీ ఇరాన్ తమకు ఎటువంటి పెద్ద నష్టం జరగలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు (సోమవారం) మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలుస్తానని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి తెలిపారు. Also Read:Hormuz Strait: ఇరాన్ సంచలన నిర్ణయం.. హార్ముజ్ జలసంధి మూసివేత.. ఇదిలా ఉండగా, అనేక […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు పాకిస్తాన్ ప్రభుత్వం, దాని సైన్యం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవలి భారతదేశం-పాకిస్తాన్ వివాదంలో ‘నిర్ణయాత్మక దౌత్య జోక్యం’ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతిని సిఫార్సు చేస్తూ పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అధికారికంగా నార్వేలోని నోబెల్ శాంతి బహుమతి కమిటీకి ఒక లేఖ పంపారు. పాకిస్తాన్ ప్రభుత్వం […]
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఇది ఉద్రిక్తతను మరింత పెంచింది. అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడిలో B-2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించారు. ఇరాన్లోని పర్వతాల కింద 80 శాతం లోతులో ఉన్న ఫోర్డో అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది. యుఎస్ బి-2 బాంబర్ […]
అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరఘ్చి ఆదివారం ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేయడాన్ని ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడైన అమెరికా అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా “నేరపూరిత ప్రవర్తన” కలిగి ఉందని అరఘ్చి ఆరోపించారు. “ఈ ఉదయం జరిగిన సంఘటనలు రెచ్చగొట్టేవి, దీర్ఘకాలిక […]
ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం చాలా ప్రమాదకరమైన దశకు చేరుకుంది. ఆదివారం ఉదయం, అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది. అమెరికా చర్య తర్వాత, ప్రపంచంలో కలకలం రేగింది. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. ప్రధాని మోదీ ఈ సమాచారాన్ని ఎక్స్ పోస్ట్ ద్వారా పంచుకున్నారు. ‘నేను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితిపై వివరంగా చర్చించాము. […]