బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకుంటున్నారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 541 పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిలో 500 పోస్టులు రెగ్యులర్ పోస్టులకు. 41 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులకు కేటాయించారు. Also Read:CM Chandrababu: ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీఆర్ సీఎం […]
టూ వీలర్ వాహనదారులు భద్రత కోసం హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. ప్రమాదాల్లో ప్రాణాలు రక్షించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మార్కెట్ లో నాణ్యతలేని హెల్మెట్స్ తక్కువ ధరకు లభిస్తుండడంతో వాటిని కొనేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దీని వల్ల డబ్బు సేవ్ అవుతుందని భావిస్తారే తప్ప ప్రాణాలను రిస్కులో పెట్టుకుంటున్నామన్న విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. ప్రభుత్వాలు సైతం ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్స్ ను యూజ్ చేయాలని సూచిస్తున్నాయి. మరి మీరు కూడా సేఫ్టీ కోసం […]
కూతురి చేతిలో హత్యకు గురైన తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారిణి అంజలి మృతదేహానికి నివాళ్ళు ఆర్పించారు సాంస్కృతిక శాఖ కళాకారులు,డిపీఆర్ఓ రాజేందర్ ప్రసాద్. స్వగ్రామం ఇనుగుర్తి గ్రామంలో అంజలి అంతిమయాత్రలో కళాకారులు, జేఏసీ నాయకులు, కుల సంఘాలనాయకులు పాల్గొన్నారు. తక్షణ సహాయం కింద పదివేల రూపాయలను అంజలి కుటుంబ సభ్యులకు అందచేశారు డీపీఆరోఓ రాజేందర్ ప్రసాద్.. అంజలి మృతదేహానికి నివాళులు అర్పించారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. అంజలి చిన్న కూతురు మనస్విని మాట్లాడుతూ అమ్మను చంపిన […]
తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం సూచించారు. విద్యా శాఖపై ఐసీసీసీలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 48 వేల మంది చేరారని అధికారులు సీఎంకు వివరించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రత్యేక […]
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రైజింగ్-2047పై సీఎం రేవంత్ రెడ్డిని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా అభినందనలు తెలిపాడు టోనీ బ్లెయిర్. ఇటీవల ఢిల్లీలో టోనీబ్లెయిర్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలంగాణ రైజింగ్ విజన్-2047 గురించి టోనీబ్లెయిర్కు వివరించారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047లో నిర్దేశించుకున్న 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, పెట్టుబడుల సాధన, రైతులు, మహిళా, యువ […]
ములుగు జిల్లా వాజేడు మండలం చేరుకూరు మోతుకులగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో మహిళా రైతుతో పాటు నాలుగు పశువులు మృతి చెందాయి. వృద్ధ రైతు దంపతులు సొంత పంట పొలంలో చెట్లు, కమ్మలు తొలగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టు నరుకుతుండగా చెట్టుకొమ్మ విద్యుత్ తీగలపై పడింది. బరువు ఎక్కువగా ఉండడంతో విద్యుత్ తీగలు తెగి కిందపడ్డాయి. Also Read:Weight loss Injection: బరువు తగ్గించే ఇంజెక్షన్ ‘వేగోవి’ విడుదల.. ధర […]
తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే రాష్ట్రపతికి బీసీ బిల్ పంపారని బిజెపి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చెయ్యాలి అంటే.. ఆ బిల్ ను 9 వ షెడ్యూల్ లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని తెలిపారు. కానీ రాష్ట్రపతి కి పంపారు.. రాష్ట్రపతి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మాకు తెలియదు. తమిళనాడు రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో కేసు ఉంది. బిల్ ను కేంద్రాన్ని […]
ప్రస్తుత రోజుల్లో సమాజంలో జరుగుతున్న దారుణాల పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. హనుమంత రావు మాట్లాడుతూ.. సమాజంలో భర్తలను భార్య.. తల్లినీ.. బిడ్డ చంపడం చూస్తుంటే బాధ ఐతుందన్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ మర్డర్స్ జరిగేవి. ఇప్పుడు లవ్ మర్డర్స్ జరుగుతున్నాయని తెలిపారు. అబ్బాయి, కానీ అమ్మాయి కానీ మీకు నచ్చకపోతే పెళ్లి చేసుకోకండి.. మీకు నచ్చిన వారినే చేసుకోండని సూచించారు. సమాజం ఎక్కడికి పోతుంది..? యమధర్మ రాజుతో కూడా భర్త […]
తెలంగాణలో లా సెట్,పీజీ ఎల్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి, ఓయూ విసి కుమార్, కన్వీనర్ విజయ లక్ష్మి పలితాలు విడుదల చేశారు. పరీక్షకు హాజరైన వారిలో 66.46 శాతం క్వాలిఫై అయినట్లు అధికారులు తెలిపారు. 57 వేల 715 మంది రిజిస్టర్ చేసుకోగా 45 వేల 609 మంది పరీక్షకు హాజరయ్యారు. 30 వేల 311 మంది అర్హత సాధించారు. లా సెట్ రాసిన వారిలో బి కామ్, బి […]
ఏనుగు దంతాల రవాణాకు పాల్పడుతున్న ముఠాలను రాచకొండ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. మూడు కోట్ల రూపాయల విలువైన రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. నిందితుడు ఏపీకి చెందిన రేకులకుంట ప్రసాద్ ని అరెస్ట్ చేశారు. ప్రసాద్ వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో రెండు ఏనుగు దంతాల విలువ రూ. 3 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. […]