-
Nicolas Maduro: నేడు అమెరికా కోర్టుకు మదురో.. మాదకద్రవ్యాల కేసులో అరెస్టును సవాలు చేయనున్న న్యాయవాదులు
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో సోమవారం మాన్హట్టన్ ఫెడరల్ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. అమెరికా మదురోపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా అభియోగం మోపింది. న్యూయార్క్లో ఆయన కోర్టులో హాజరు కావడం ఇదే మొదటిసారి. అయితే పదవీచ్యుతుడైన నాయకుడిని అమెరికా విచారించగలదా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. పలు నివేదికల ప్రకారం, మదురో కేసు పనామా మాజీ పాలకుడు మాన్యుయెల్ నోరిగా కేసును గుర్తుకు తెస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఆయన కూడా అమెరికా సైనిక చర్య […] -
Minister Nimmala Ramanaidu: ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో.. రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ చేశాడు
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. అబద్దాలకు అభూత కల్పనలకు ప్యాంటు చొక్కా వేస్తే అది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. నిజానికి, నిలకడకు, నిబద్ధతకు, నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని కొనియాడారు. మీ అవినీతి కరపత్రికలో ఒక పేజీ అబద్ధాలు అచ్చోసినంత మాత్రాన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మేస్థితిలో లేరు అని చురకలంటించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు […] -
CM Chandrababu: కృష్ణా జలాలపై స్పందించిన సీఎం చంద్రబాబు..
కృష్ణా జలాలపై తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల ఇష్యూపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. విదేశీ పర్యటన ముగించుకుని ఆదివారం (జనవరి 4) హైదరాబాద్ చేరుకున్న ఆయన.. ఇటీవల మరణించిన టీడీపీ […] -
Samudra Pratap: భారత కోస్ట్ గార్డ్ కు అత్యాధునిక స్వదేశీ నౌక.. ‘సముద్ర ప్రతాప్’ ప్రారంభానికి సిద్ధం
భారత కోస్ట్ గార్డ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక ‘సముద్ర ప్రతాప్’ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జనవరి 5న సైన్యంలోకి ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. గోవా షిప్యార్డ్ లిమిటెడ్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. ఈ నౌకలో అధునాతన ఆయిల్ స్పిల్ డిటెక్షన్ సిస్టమ్ అమర్చబడి ఉన్నాయి. ఇవి ప్రత్యేక ఎకనామిక్ కౌన్సిల్ లోపల, వెలుపల సమగ్ర కాలుష్య నిరోధక కార్యకలాపాలను నిర్వహించడంలో సహాయపడతాయి. Also Read:Krishna: అవనిగడ్డలో 45 రోజుల పసిపాప […] -
Krishna: అవనిగడ్డలో 45 రోజుల పసిపాప మృతి కేసును ఛేదించిన పోలీసులు.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు
కృష్ణాజిల్లా అవనిగడ్డలో 2 రోజుల క్రితం మృతి చెందిన 45 రోజుల పసికందు మృతి కేసును పోలీసులు ఛేదించారు. కన్నతల్లి పసిపాపను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న పాప వైద్యానికి ఖర్చు అవుతోందని అత్త సూటి పోటి మాటలు అనడంతో మనస్తాపానికి గురైంది కన్న తల్లి. తన బిడ్డకు అనారోగ్యం నయం కాదేమో అని గుండెలవిసేలా రోదించింది. దీంతో కన్న బిడ్డను చెరువులో పడేసినట్టు పోలీసులు గుర్తించారు. పసి పాప మృతికి కారకులైన […] -
MG Windsor EV: 2025 లో ఎలక్ట్రిక్ కింగ్గా నిలిచిన ఎంజీ విండ్సర్ EV.. మిడిల్ క్లాస్ కి బెస్ట్ ఆప్షన్..
ఎంజీ మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో MG విండ్సర్ EVని అందిస్తోంది. ఈ కారు 2025 వరకు అధిక డిమాండ్లో ఉంటుందని తయారీదారు పేర్కొన్నారు. ప్రస్తుత 2025 సంవత్సరంలో ఈ కారు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారుగా మారిందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత 2024 సంవత్సరంతో పోలిస్తే 2025 సంవత్సరంలో MG మోటార్ ఇండియా అమ్మకాలలో 19% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. జనవరి- డిసెంబర్ 2025 మధ్య 70,554 యూనిట్లను విక్రయించింది. ఇది […] -
IAS: ఐఏఎస్ కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక అనుమానాస్పద మృతి..
ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్ క్రిస్ట్ కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక అనుమానాస్పద మృతి చెందింది. త్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న దీపిక ను ఆయుష్ ఆసుపతిలో డిసెంబర్ 31న చేర్చారు కుటుంబ సభ్యులు. డిసెంబర్ 31న స్థానిక ఆయుష్ ఆసుపత్రిలో చేరిన సత్య గీతిక ఇవాళ తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతి పై అనుమానాలు ఉన్నాయని సత్య గీతిక సోదరి సరిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ […] -
AI chatbots: చాట్ జీపీటీ, గ్రోక్, జెమిని, ఇతర AI చాట్బాట్లను.. అడగకూడని విషయాలు ఇవే
ChatGPT, Grok, Google Gemini వంటి AI చాట్బాట్ల వినియోగం పెరిగింది. పలు రంగాల్లోని వ్యక్తులు, విద్యార్థులు వీటిని ఉపయోగిస్తున్నారు. నిపుణులు వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ టూల్స్ రాయడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి లేదా మీరు ఆలోచించగలిగే ఏదైనా విషయం గురించి వాస్తవాలను త్వరగా వెతకడానికి ఉపయోగపడతాయి. కానీ వాస్తవంగా చెప్పాలంటే, AIని అడగడానికి ప్రతి ప్రశ్న సురక్షితం కాదు. మీరు మీ గోప్యత, భద్రత, మంచి నిర్ణయాలు తీసుకోవడం గురించి శ్రద్ధ వహిస్తారా అయితే AI […] -
Nandyal: చాగలమర్రి మండలం మద్దూరులోని.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీలో వీడిన మిస్టరీ..
దేవుడి సొమ్ము చోరీకి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. కొద్ది రోజుల క్రితం నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులోని ప్రసిద్ధ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నకిలీ వెండి ఆభరణాల వ్యవహారం కలకలం రేపింది. కాగా తాజాగా ఈ కేసులో మిస్టరీ వీడింది. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5.8 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. కేసు విషయాలను నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ వెల్లడించారు. రూ. 14.76 లక్షల విలువైన 5కిలోల 800 […] -
Eluru: సారా అమ్ముతూ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడగా.. గ్రామం నుంచి వెలివేసిన కుల పెద్దలు.. అవమానం భరించలేక..
ఏలూరు జిల్లాకు చెందిన బొట్ల కనకరావు సారా అమ్ముతూ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడి నాలుగు రోజులపాటు రిమాండ్ కి వెళ్లి వచ్చాడు. జైలు నుంచి బయటకి వచ్చి తన సొంత గ్రామం ముసునూరు మండలం లోపూడి గ్రామంలో సొంత ఇంటికి వెళ్ళాడు. ఈ క్రమంలో గౌడ కులానికి చెందిన కుల పెద్దలు కనకారావు కుటుంబాన్ని 10రోజుల క్రితం మోకాలు దండ పై నిలబెట్టి పంచాయతీ పెట్టారు. పంచాయతీలో లక్ష రూపాయలు అపరాధ రుసుము విధించారు. కనకారావు కుటుంబం […]
తాజావార్తలు
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!