రాజధాని అమరావతిలోని తుళ్ళూరులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. భూమిపూజ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హాస్పిటల్ నిర్వాహకులు పాల్గొన్నారు. నేలపాడు నుంచి అనంతవరం వెళ్లే E-7 రహదారిని ఆనుకుని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నూతనంగా నిర్మించనున్నారు. మొత్తం 21 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. మూడు దశలల్లో ఆసుపత్రి నిర్మాణం జరుగనుంది. 750 కోట్లతో మొదటి ఫేజ్ 500 పడకల హాస్పటల్ నిర్మాణం చేపట్టనున్నారు. రెండో విడతలో మరో 500 పడకలకు విస్తరించనున్నారు. 2028 చివరి నాటికి మొదటి దశ పనులు పూర్తికానున్నట్లు తెలిపారు.