గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గోల్డ్ పై సుంకాలు విధించబోమని ట్రంప్ ప్రకటించిన తర్వాత నేడు మరోసారి పుత్తడి ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 50 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 100 తగ్గింది.హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,135, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,290 వద్ద ట్రేడ్ అవుతోంది. Also Read:DRDO Manager […]
రాజస్థాన్లోని జైసల్మేర్లోని చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ సమీపంలోని డీఆర్డీఓ గెస్ట్ హౌస్ కాంట్రాక్ట్ మేనేజర్ మహేంద్ర ప్రసాద్ను అరెస్టు చేశారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ISI కోసం గూఢచర్యం చేయడం, దేశ రహస్య, వ్యూహాత్మక సమాచారాన్ని సరిహద్దు దాటి పాకిస్తాన్కు పంపడం వంటి ఆరోపణలపై రాజస్థాన్ CID ఇంటెలిజెన్స్ అతన్ని అరెస్టు చేసింది. మహేంద్ర ప్రసాద్ను ఆగస్టు 13 బుధవారం కోర్టులో హాజరుపరుస్తారు. అక్కడి నుంచి అతన్ని రిమాండ్కు తీసుకెళ్లి ప్రశ్నించనున్నారు. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ […]
నిన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేడు రిపోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగిన తీరు రాష్ట్ర […]
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పిన్ని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన గుగులోత్ హారిక బాత్రూమ్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అయితే సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో సెలైన్ బాటిల్ పెట్టించుకొని బంధువులు బైక్ పై ఖమ్మం హాస్పిటల్ కు బయలుదేరారు. మార్గమధ్యలో అంబులెన్స్ రావటంతో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం హారిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హారికకు తల్లిదండ్రులు లేకపోవడంతో బాబాయ్ సంరక్షణలో ఉంటున్నట్లు తెలిసింది. […]
నేడు పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏపి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్రలో పలుచోట్ల అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 40 -50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని హెచ్చరించారు. […]
వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేడు రిపోలింగ్ జరుగనుంది. Also Read:Srushti Ivf Center : బయట పడుతున్న […]
తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోత వానలతో రాష్ట్రం తడిసి ముద్దైపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 72 గంటలు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వయంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యం లో నేడు, రేపు GHMC పరిధిలోని పాఠశాలలకు […]
సేవింగ్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్, కస్టమర్లకు మరో షాక్ ఇచ్చింది. ఏటీఎం ఛార్జీలు పెంచింది. బ్రాంచ్లో జరిగే లావాదేవీలపై కూడా ఛార్జీలు విధించనుంది. సేవింగ్స్ ఖాతా కస్టమర్ల కోసం కొత్త మార్పులు చేసింది. ఈ మార్పులు 1 ఆగస్టు 2025 నుంచి అమలులోకి వచ్చాయి. ఏటీఎం ఛార్జీలు, నగదు డిపాజిట్, నగదు ఉపసంహరణతో సహా పొదుపు ఖాతాకు కనీస బ్యాలెన్స్కు సంబంధించి బ్యాంక్ అనేక సవరణలు చేసింది. Also Read:Breaking : కాసేపట్లో […]
స్మార్ట్ ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ను మార్చేసింది. అనేక పనులను సులభతరం చేసింది. AI వచ్చి మొబైల్ ను మరింత పవర్ ఫుల్ చేసింది. అయితే, ఫోన్ వాడుతున్న క్రమంలో పనితీరు తగ్గడం ప్రారంభమవుతుంది. స్మార్ట్ఫోన్ అకస్మాత్తుగా వేగాన్ని తగ్గించడం ప్రారంభించి, బ్యాటరీ వేగంగా అయిపోతుంటే లేదా ఛార్జింగ్లో సమస్య ఉంటే లేదా వేడెక్కుతున్నట్లయితే, ఇది మీ ఫోన్ త్వరలో పాడైపోతుందనడానికి సంకేతం కావచ్చు. అవును, టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్మార్ట్ఫోన్ పాడైపోయే ముందు […]
గత వారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, బ్రెజిల్ సహా అనేక దేశాలపై 50 శాతం సుంకం విధించాలని ఆదేశించారు. ట్రంప్ ఆదేశాలతో బంగారం దిగుమతులపై సస్పెన్స్ నెలకొంది. అదే సమయంలో, బంగారాన్ని సుంకాల యుద్ధం నుంచి దూరంగా ఉంచుతామని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో బంగారంపై ఎటువంటి సుంకం ఉండదని ఒక పోస్ట్ను పంచుకున్నారు. Also Read:Ayodhya: రామమందిరం చుట్టూ రక్షణ గోడ.. భారీగా […]