Veerababu Burugadda
Author- NTV Telugu-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో అత్యుత్తమ గుర్తింపు సాధించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కనబరిచిన అద్భుతమైన పనితీరును మెచ్చిన కేంద్ర ప్రభుత్వం, అందుకు ప్రోత్సాహకంగా రూ.200 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. కేంద్రం నుంచి అందిన ఈ అదనపు నిధులను రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా-శిశు ఆరోగ్య సేవలను మరింత […] -
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న బలమైన ఉపరితల ఆవర్తనం, దాని అనుబంధ ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ తీవ్ర ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉత్తర కోస్తా ఆంధ్రాలోని శ్రీకాకుళం, విజయనగరం, […] -
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. బాపట్ల జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (GGH) అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయమై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గా ప్రసాద్ స్పందిస్తూ, రోగికి ప్రస్తుతం ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఆసుపత్రిలో కరోనా కేసుల నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని […] -
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబోతున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (RSK) ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు అత్యంత పారదర్శకంగా, వేగంగా రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుపై కొందరు […] -
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
రోహిత్ శర్మ సెంచరీ మార్కును అందుకుని లార్డ్స్ మైదానంలో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కళ్లు చెదిరే శతకంతో చెలరేగాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ కేవలం 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 120.00 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి టీమిండియాను రేసులో నిలిపాడు. గత కొన్ని ఇన్నింగ్స్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడంటూ వచ్చిన విమర్శలన్నింటికీ […] -
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి చేసి సత్తా చాటాడు. లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి తన ఫామ్ అందుకున్నాడు. గత కొన్ని ఇన్నింగ్స్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హిట్ మ్యాన్, ఈ కీలక మ్యాచ్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో చెలరేగాడు. ఇంగ్లాండ్ విధించిన 388 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ […] -
Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో ‘లగ్జరీ’ ఫోన్.. రేపు అందుబాటులోకి..
భారత మార్కెట్లోకి మోటరోలా సరికొత్త స్మార్ట్ఫోన్ ‘మోటరోలా ఎడ్జ్ 70 మాక్స్’ ను విడుదల చేసింది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ (8GB+256GB) ధర రూ.54,999 కాగా, టాప్-ఎండ్ వేరియంట్ (12GB+256GB) ధర రూ.59,999 గా ఉంది. జూలై 20 నుండి ఫ్లిప్కార్ట్, మోటరోలా అధికారిక స్టోర్లలో లభించే ఈ ఫోన్పై హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ.5,000 ఇన్స్టంట్ డిస్కౌంట్, అలాగే రూ.5,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీనితో ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర […] -
Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
యువకుడు, మంచి ఎత్తు ఉన్నాడు, లార్డ్స్ లాంటి పిచ్లపై బౌలింగ్ బాగా వేస్తాడు.. ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతాడు అని సెలెక్టర్లు భావించారు. భారత అభిమానులు, నెటిజన్లు కూడా ఈ యువ పేసర్ నుంచి ఒక అద్భుతమైన స్పెల్ను ఆశించారు. కానీ కట్ చేస్తే.. సీన్ రివర్స్ అయింది! లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆ బౌలర్కు చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో 26 ఏళ్ల భారత ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ […] -
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త రికార్డు సృష్టించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. తద్వారా భారత జట్టు ముందు 388 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ చరిత్రలోనే వన్డే ఫార్మాట్లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే […] -
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ ప్రయాణీకులతో పాటు త్వరలో అందుబాటులోకి రానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రయాణీకుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) కీలక అడుగు వేసింది. భోగాపురం ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ కోసం ప్రత్యేకంగా పర్యావరణహిత ఎలక్ట్రిక్ (ఈవీ) బస్సుల రూట్లను రవాణా శాఖ అధికారులు తుది మార్గదర్శకాలతో ఖరారు చేశారు. రానున్న ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా […]
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!