Veerababu Burugadda
Author- NTV Telugu-
Sangareddy: బతుకుదెరువు కోసం వలస వచ్చిన భార్యాభర్తలు.. తెల్లవారుజామున దారుణం..
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఇద్దరు దంపతుల హత్య కలకలం రేపింది. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఓ వాచ్మన్ దంపతులను అత్యంత దారుణంగా హత్యచేశారు. దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఆ ప్రాంతంలో బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఇద్దరి ప్రాణాల్ని కబలించటం పలు అనుమానాలకు తావిస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలో భార్యాభర్తలను హత్య చేయడం సంచలనం సృష్టించింది. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. […] -
Train Accident: ఘోర రైలు ప్రమాదం.. కాలేజీ బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు..
తమిళనాడులోని కరూర్ జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కరూర్ సమీపంలోని వెల్లియానై వద్ద ఒక ప్రైవేట్ కళాశాల బస్సును గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. సుమారు 50 మంది విద్యార్థులతో వెళ్తున్న ఆ కళాశాల బస్సు, ఒక రైల్వే క్రాసింగ్ దాటే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రైల్వే క్రాసింగ్ వద్ద ఎటువంటి సిగ్నల్ వ్యవస్థ లేదా గేట్లు లేకపోవడమే […] -
Best Income: నాడు ఎకరం రూ.15 వేలు.. నేడు నెలకు రూ.14.50 లక్షల ఆదాయం.. ఎలా అంటే..
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టే పెట్టుబడులు భవిష్యత్తుకు భద్రతను ఇస్తాయని చాలామంది నమ్ముతారు. పెద్దలు కూడా తమ పిల్లలకు ఎప్పుడూ ఒక చిన్న స్థలాన్నయినా కొని ఉంచమని.. అది ఎప్పటికైనా మీకు ఆదుకుంటుందని పదే పదే సూచిస్తుంటారు. ఈ మాటలు ఎంత నిజమో నిరూపించే ఒక ఆసక్తికరమైన ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఆసక్తికరమైన విషయాన్ని స్టాక్ మార్కెట్ ట్రేడర్ అయిన స్వప్నిల్ కొమావర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. […] -
Google Map: గూగుల్ మ్యాప్స్లో సరికొత్త విప్లవం.. ఇకపై మ్యాప్స్తో మాట్లాడవచ్చు..
గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు కేవలం మార్గాన్ని చూపించే దిక్కూచీ మాత్రమే కాదు.. మీ ప్రయాణంలో తోడుండే ఒక స్నేహితుడిలా మారుతోంది. ప్రయాణాల్లో కొత్త అనుభూతిని అందించేందుకు గూగుల్ ఇటీవల రెండు కొత్త జెమిని ఏఐ ఫీచర్స్ను తీసుకొచ్చింది. అవి మన దైనందిన ప్రయాణాలను మరింత సులభతరం చేస్తాయి. మ్యాప్స్తో మాట్లాడండి.. ఇకపై మీరు మ్యాప్స్ను నేరుగా అడగవచ్చు. ఉదాహరణకు.. ‘ఎక్కువ క్యూలో నిలబడకుండా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే చోటు ఎక్కడ ఉంది? లేదా పిల్లలతో వెళ్లడానికి ప్రశాంతంగా […] -
Fastag: వాహనాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ కొత్త ధరలు..
జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రైవేట్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక సమాచారాన్ని అందించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను సవరించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయించింది. ప్రస్తుతం వార్షిక పాస్ ధర రూ. 3,000గా ఉండగా.. ఏప్రిల్ 1, 2026 నుంచి ఇది 2.5 శాతం పెరిగి రూ. 3,075 కానుంది. రహదారుల నిర్వహణ , టోల్ రేట్ల వార్షిక సమీక్షలో భాగంగా ఈ పెంపును చేపట్టినట్లు […] -
Twin Sister: తోడబుట్టిన చెల్లి అని కూడా చూడలేదు.. 40 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు తన కవల సోదరిని కత్తితో 40 సార్లకు పైగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తన తల్లిని కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది. అసలేం జరిగింది..? హార్దిక్, హింశిక అనే కవలలు (25 ఏళ్లు) గురుగ్రామ్లో పని చేస్తున్నారు. హోలీ పండుగ కోసం వారు తమ తల్లి నీలిమ వద్దకు మొరాదాబాద్ వచ్చారు. శుక్రవారం తిరిగి వెళ్లడానికి […] -
Subsidy: టీ కొట్టు, హోటల్ యజమానులకు శుభవార్త.. దానిపై రూ.2 తగ్గింపు..
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాల వల్ల గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన వంట గ్యాస్ (LPG) సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల తమిళనాడులో గ్యాస్ కొరత తీవ్రమై, హోటళ్లు, చిన్న వ్యాపారాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్న వ్యాపారులను ఆదుకోవడానికి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటానికి ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్యాస్ సిలిండర్ల కొరత తీరే వరకు, […] -
SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..
తమ ఆడపిల్లల భవిష్యత్తును బంగారుమయం చేయాలని, వారికి ఆర్థికంగా అండగా ఉండాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసమే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సుకన్య సమృద్ధి యోజన’పథకంలో చాలా మంది పెట్టుబడి పెడుతుంటారు. ఈ పథకంలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటంతో పాటు.. దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయి. అయితేజజ ఈ ఖాతా విషయంలో ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. దీనిని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు, కానీ ఇది మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. […] -
Exams: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షలు ఏవో తెలుసా.. మన ఇండియా నుంచి కూడా ఉన్నాయ్…
ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో ఒక మంచి ఉద్యోగం సాధించాలని.. ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కల ఉంటుంది. ఆ కలను నిజం చేసుకోవడం కోసం లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఏళ్ల తరబడి కష్టపడి రకరకాల పోటీ పరీక్షలు రాస్తుంటారు. అయితే.. ప్రపంచంలో కొన్ని పరీక్షలు మాత్రం అత్యంత కఠినమైనవిగా పేరుగాంచాయి. ఇవి కేవలం మీ తెలివితేటలనే కాకుండా.. మీ సహనాన్ని, మానసిక ధైర్యాన్ని కూడా పరీక్షిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన ఆ పరీక్షలు ఏవో ఇప్పుడు […] -
Father Property: తండ్రి ఆస్తులు అన్నీ కొడుకువి కావు.. సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు..
హిందూ వారసత్వ చట్టం, ఆస్తి హక్కుల విషయంలో ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి సంపాదించిన ప్రతీ పైసా, ప్రతీ గజం స్థలం ఆటోమేటిక్ గా కొడుకుకు దక్కుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ.. చట్టం దృష్టిలో ‘వారసత్వ ఆస్తి’కి, ‘స్వార్జిత ఆస్తి’కి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇదే అంశంపై కేరళ హైకోర్టు తాజాగా ఒక సంచలన తీర్పును వెలువరించింది. తండ్రి కష్టార్జితంపై కొడుకుకు ఉండే హక్కుల విషయంలో న్యాయస్థానం కీలక స్పష్టత ఇచ్చింది. కేరళ […]
తాజావార్తలు
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
-
Tamil Producers: టోకెన్ స్ట్రైక్’కి దిగిన తమిళ నిర్మాతలు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!