Stock Market: లాభాల పంట పండించిన స్టాక్ మార్కెట్.. రేపటి వ్యూహం ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ఈక్విటీ మార్కెట్లలో నేడు సరికొత్త ఉత్సాహం నెలకొంది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా 6 శాతానికి పైగా పతనం కావడం దేశీయ మార్కెట్లకు భారీ బూస్ట్నిచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి.. శాంతి చర్చలు సఫలమవుతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. ఫలితంగా సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా లాభపడి ఇన్వెస్టర్లపై లాభాల జల్లు కురిపించాయి.
నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బిఎస్ఇ సెన్సెక్స్ 1,074 పాయింట్లు (1.42 శాతం) పెరిగి 76,488 వద్ద స్థిరపడగా, నిఫ్టీ50 సూచీ 312 పాయింట్లు (1.32 శాతం) లాభంతో 24,031 వద్ద 24 వేల మార్కును దాటి ముగిసింది.
Also Read
- FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
- Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
- Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
నాలుగో త్రైమాసిక (Q4) బలమైన ఫలితాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు మార్కెట్ను ముందుండి నడిపించాయి. వీటితో పాటు ఆటోమొబైల్, రియల్టీ రంగాలు కూడా భారీగా లాభపడ్డాయి. జెఎస్డబ్ల్యూ సిమెంట్ క్యూ4 లాభాలు 2,162 శాతం పెరిగినప్పటికీ, నేడు స్వల్పంగా 2 శాతం లాభాల స్వీకరణకు గురై రూ. 135.76 వద్ద ముగిసింది.
గత వారం మార్కెట్ ఇలా..
గత వారం మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు, రూపాయి విలువ క్షీణత మార్కెట్ను ఒత్తిడికి గురిచేశాయి. సూచీలు కీలక సపోర్ట్ స్థాయిలను పరీక్షించే దిశగా కదలాడాయి. నేటి భారీ ర్యాలీతో మార్కెట్ కీలకమైన రివర్సల్ జోన్ను దాటినట్లు కనిపిస్తున్నప్పటికీ.. విశ్లేషకులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
నిఫ్టీ 23,800–23,900 పరిధిని దాటి నిలదొక్కుకోవడం సానుకూల అంశం. అయితే మార్కెట్ లాభాల పరంపరను కొనసాగించాలంటే ఈ స్థాయిల పైన స్థిరంగా ముగియాల్సి ఉంటుంది. ఒకవేళ అంతర్జాతీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరిగితే, మార్కెట్ కరెక్షన్కు గురై తిరిగి 23,200 నుంచి 23,000 స్థాయిలను పరీక్షించే అవకాశం ఉంది. క్రూడాయిల్ ధరల స్థిరత్వం, అంతర్జాతీయ దిగుబడుల తగ్గుదలపైనే రేపటి నుంచి మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుంది. జియోపాలిటికల్ ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గితే ఈ వారం మార్కెట్ మరిన్ని రికార్డులను సృష్టించవచ్చు.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!