Stock Market: లాభాల పంట పండించిన స్టాక్ మార్కెట్.. రేపటి వ్యూహం ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ఈక్విటీ మార్కెట్లలో నేడు సరికొత్త ఉత్సాహం నెలకొంది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా 6 శాతానికి పైగా పతనం కావడం దేశీయ మార్కెట్లకు భారీ బూస్ట్నిచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి.. శాంతి చర్చలు సఫలమవుతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. ఫలితంగా సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా లాభపడి ఇన్వెస్టర్లపై లాభాల జల్లు కురిపించాయి.
నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బిఎస్ఇ సెన్సెక్స్ 1,074 పాయింట్లు (1.42 శాతం) పెరిగి 76,488 వద్ద స్థిరపడగా, నిఫ్టీ50 సూచీ 312 పాయింట్లు (1.32 శాతం) లాభంతో 24,031 వద్ద 24 వేల మార్కును దాటి ముగిసింది.
Also Read
- EV Subsidy: మీరు ఈవీ వెహికిల్ ఇంకా తీసుకోలేదా..? ఇదే కరెక్ట్ సమయం.. మరోసారి సబ్సిడీ పెంపు..!
- Nirmala Sitharaman: దేశానికి కీలకమైన 3Fలపై.. భారత దేశీయ ఆర్థిక వ్యవస్థపై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
- Credit Card Tips: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ 5 ఛార్జీలపై ఒక లుక్కేయండి.. లేదంటే అప్పుల పాలవుతారు!
- Reliance Industries: రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండగ.. ఐదు రోజుల్లోనే రూ.24 వేల కోట్ల సంపద
నాలుగో త్రైమాసిక (Q4) బలమైన ఫలితాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు మార్కెట్ను ముందుండి నడిపించాయి. వీటితో పాటు ఆటోమొబైల్, రియల్టీ రంగాలు కూడా భారీగా లాభపడ్డాయి. జెఎస్డబ్ల్యూ సిమెంట్ క్యూ4 లాభాలు 2,162 శాతం పెరిగినప్పటికీ, నేడు స్వల్పంగా 2 శాతం లాభాల స్వీకరణకు గురై రూ. 135.76 వద్ద ముగిసింది.
గత వారం మార్కెట్ ఇలా..
గత వారం మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు, రూపాయి విలువ క్షీణత మార్కెట్ను ఒత్తిడికి గురిచేశాయి. సూచీలు కీలక సపోర్ట్ స్థాయిలను పరీక్షించే దిశగా కదలాడాయి. నేటి భారీ ర్యాలీతో మార్కెట్ కీలకమైన రివర్సల్ జోన్ను దాటినట్లు కనిపిస్తున్నప్పటికీ.. విశ్లేషకులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
నిఫ్టీ 23,800–23,900 పరిధిని దాటి నిలదొక్కుకోవడం సానుకూల అంశం. అయితే మార్కెట్ లాభాల పరంపరను కొనసాగించాలంటే ఈ స్థాయిల పైన స్థిరంగా ముగియాల్సి ఉంటుంది. ఒకవేళ అంతర్జాతీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరిగితే, మార్కెట్ కరెక్షన్కు గురై తిరిగి 23,200 నుంచి 23,000 స్థాయిలను పరీక్షించే అవకాశం ఉంది. క్రూడాయిల్ ధరల స్థిరత్వం, అంతర్జాతీయ దిగుబడుల తగ్గుదలపైనే రేపటి నుంచి మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుంది. జియోపాలిటికల్ ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గితే ఈ వారం మార్కెట్ మరిన్ని రికార్డులను సృష్టించవచ్చు.
తాజావార్తలు
-
Stock Market: లాభాల పంట పండించిన స్టాక్ మార్కెట్.. రేపటి వ్యూహం ఇలా..
-
Chandrababu: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతాం.. భారీగా నిధులిస్తామన్న చంద్రబాబు
-
Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)
-
NBK112 Movie Launch Date: టాలీవుడ్లో మోస్ట్ పవర్ఫుల్ కాంబో.. ‘NBK112’ ముహూర్తానికి డేట్ ఫిక్స్!
-
Fee Refund: నీట్ యూజీ పరీక్ష ఫీజు రిఫండ్.. దరఖాస్తుకు రెండు రోజులే సమయం..
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!