Stock Market: లాభాల పంట పండించిన స్టాక్ మార్కెట్.. రేపటి వ్యూహం ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ఈక్విటీ మార్కెట్లలో నేడు సరికొత్త ఉత్సాహం నెలకొంది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా 6 శాతానికి పైగా పతనం కావడం దేశీయ మార్కెట్లకు భారీ బూస్ట్నిచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి.. శాంతి చర్చలు సఫలమవుతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. ఫలితంగా సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా లాభపడి ఇన్వెస్టర్లపై లాభాల జల్లు కురిపించాయి.
నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బిఎస్ఇ సెన్సెక్స్ 1,074 పాయింట్లు (1.42 శాతం) పెరిగి 76,488 వద్ద స్థిరపడగా, నిఫ్టీ50 సూచీ 312 పాయింట్లు (1.32 శాతం) లాభంతో 24,031 వద్ద 24 వేల మార్కును దాటి ముగిసింది.
Also Read
- Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
నాలుగో త్రైమాసిక (Q4) బలమైన ఫలితాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు మార్కెట్ను ముందుండి నడిపించాయి. వీటితో పాటు ఆటోమొబైల్, రియల్టీ రంగాలు కూడా భారీగా లాభపడ్డాయి. జెఎస్డబ్ల్యూ సిమెంట్ క్యూ4 లాభాలు 2,162 శాతం పెరిగినప్పటికీ, నేడు స్వల్పంగా 2 శాతం లాభాల స్వీకరణకు గురై రూ. 135.76 వద్ద ముగిసింది.
గత వారం మార్కెట్ ఇలా..
గత వారం మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు, రూపాయి విలువ క్షీణత మార్కెట్ను ఒత్తిడికి గురిచేశాయి. సూచీలు కీలక సపోర్ట్ స్థాయిలను పరీక్షించే దిశగా కదలాడాయి. నేటి భారీ ర్యాలీతో మార్కెట్ కీలకమైన రివర్సల్ జోన్ను దాటినట్లు కనిపిస్తున్నప్పటికీ.. విశ్లేషకులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
నిఫ్టీ 23,800–23,900 పరిధిని దాటి నిలదొక్కుకోవడం సానుకూల అంశం. అయితే మార్కెట్ లాభాల పరంపరను కొనసాగించాలంటే ఈ స్థాయిల పైన స్థిరంగా ముగియాల్సి ఉంటుంది. ఒకవేళ అంతర్జాతీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరిగితే, మార్కెట్ కరెక్షన్కు గురై తిరిగి 23,200 నుంచి 23,000 స్థాయిలను పరీక్షించే అవకాశం ఉంది. క్రూడాయిల్ ధరల స్థిరత్వం, అంతర్జాతీయ దిగుబడుల తగ్గుదలపైనే రేపటి నుంచి మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుంది. జియోపాలిటికల్ ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గితే ఈ వారం మార్కెట్ మరిన్ని రికార్డులను సృష్టించవచ్చు.
తాజావార్తలు
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!