EV Subsidy: మీరు ఈవీ వెహికిల్ ఇంకా తీసుకోలేదా..? ఇదే కరెక్ట్ సమయం.. మరోసారి సబ్సిడీ పెంపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో హరిత రవాణాను ప్రోత్సహించడానికి , క్రూడాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ముమ్మరంగా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఫ్లాగ్షిప్ ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మరింత ఆర్థిక ఊతాన్ని అందించేందుకు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. పీఎం ఈ-డ్రైవ్ కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను పొడిగించేందుకు మంత్రిత్వ శాఖ అదనపు నిధులను కోరాలని యోచిస్తోంది. అయితే ఈ నిధుల పరిమాణంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
రూ.10,900 కోట్ల అంచనాతో 2024లో ప్రారంభమైన ఈ పథకంలో తొలుత ద్విచక్ర వాహనాల సబ్సిడీల కోసం రూ.1,772 కోట్లు కేటాయించారు. ఆశించిన దానికంటే నెమ్మదించిన విక్రయాల వేగం కారణంగా.. ఈ ప్రోగ్రామ్ను జూలై చివరి వరకు పొడిగించారు. ఇప్పుడు తాజా నిధులతో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ పథకం ద్వారా 2.47 మిలియన్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మే 24 నాటికి దాదాపు 2.35 మిలియన్ల వాహనాలకు సబ్సిడీలు లభించాయి. ప్రస్తుతం బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి మొదటి ఏడాది కిలోవాట్ అవర్కు (kWh) రూ.5,000, రెండో ఏడాదిలో దానిని రూ.2,500 కు తగ్గిస్తూ మార్కెట్ కు అనుగుణంగా సబ్సిడీలను అందిస్తున్నారు.
Also Read
- Off The Record: వైసీపీకి కొరకరాని కొయ్యలా మారిన రేపల్లె నియోజకవర్గం..
- G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్పై కీలక వ్యాఖ్యలు
- Land Missile: భారత అంబులపొదిలో మరో అస్త్రం.. భూతల దాడి క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
- India A vs Sri Lanka A: మొదట తిలక్ వర్మ.. తర్వాత వైభవ్ సూర్యవంశీ.. గందరగోళంగా భారత్-శ్రీలంక మ్యాచ్
ఆర్థిక సంవత్సరం 2022లో 2,52,787 యూనిట్లుగా ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు, ఆర్థిక సంవత్సరం 2026 నాటికి 1.46 మిలియన్లకు పెరిగాయి. అదే సమయంలో పెట్రోల్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13.2 మిలియన్ల నుంచి 11 మిలియన్లకు తగ్గాయి. ఆర్థిక సంవత్సరం 2027 కోసం పీఎం ఈ-డ్రైవ్కు రూ.1,500 కోట్లు కేటాయించారు. దీనిని అసలు ఈ-బస్సులు, ట్రక్కులు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం నిర్దేశించారు. తాజా నిర్ణయంతో ఈ బడ్జెట్ ప్రాధాన్యతలను తిరిగి సమీక్షించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
-
CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
-
Off The Record: వైసీపీకి కొరకరాని కొయ్యలా మారిన రేపల్లె నియోజకవర్గం..
-
G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్పై కీలక వ్యాఖ్యలు
-
Samantha: యాక్టర్గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్లో సమంత
ట్రెండింగ్
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!