EV Subsidy: మీరు ఈవీ వెహికిల్ ఇంకా తీసుకోలేదా..? ఇదే కరెక్ట్ సమయం.. మరోసారి సబ్సిడీ పెంపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో హరిత రవాణాను ప్రోత్సహించడానికి , క్రూడాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ముమ్మరంగా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఫ్లాగ్షిప్ ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మరింత ఆర్థిక ఊతాన్ని అందించేందుకు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. పీఎం ఈ-డ్రైవ్ కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను పొడిగించేందుకు మంత్రిత్వ శాఖ అదనపు నిధులను కోరాలని యోచిస్తోంది. అయితే ఈ నిధుల పరిమాణంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
రూ.10,900 కోట్ల అంచనాతో 2024లో ప్రారంభమైన ఈ పథకంలో తొలుత ద్విచక్ర వాహనాల సబ్సిడీల కోసం రూ.1,772 కోట్లు కేటాయించారు. ఆశించిన దానికంటే నెమ్మదించిన విక్రయాల వేగం కారణంగా.. ఈ ప్రోగ్రామ్ను జూలై చివరి వరకు పొడిగించారు. ఇప్పుడు తాజా నిధులతో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ పథకం ద్వారా 2.47 మిలియన్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మే 24 నాటికి దాదాపు 2.35 మిలియన్ల వాహనాలకు సబ్సిడీలు లభించాయి. ప్రస్తుతం బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి మొదటి ఏడాది కిలోవాట్ అవర్కు (kWh) రూ.5,000, రెండో ఏడాదిలో దానిని రూ.2,500 కు తగ్గిస్తూ మార్కెట్ కు అనుగుణంగా సబ్సిడీలను అందిస్తున్నారు.
Also Read
- TG Police Recruitment: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రెడీ!
- Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
ఆర్థిక సంవత్సరం 2022లో 2,52,787 యూనిట్లుగా ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు, ఆర్థిక సంవత్సరం 2026 నాటికి 1.46 మిలియన్లకు పెరిగాయి. అదే సమయంలో పెట్రోల్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13.2 మిలియన్ల నుంచి 11 మిలియన్లకు తగ్గాయి. ఆర్థిక సంవత్సరం 2027 కోసం పీఎం ఈ-డ్రైవ్కు రూ.1,500 కోట్లు కేటాయించారు. దీనిని అసలు ఈ-బస్సులు, ట్రక్కులు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం నిర్దేశించారు. తాజా నిర్ణయంతో ఈ బడ్జెట్ ప్రాధాన్యతలను తిరిగి సమీక్షించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Seven Fishermen Missing: విశాఖ తీరంలో ఉత్కంఠ.. సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ గాలింపు
-
TG Police Recruitment: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రెడీ!
-
Hrithik Roshan: హృతిక్ రోషన్ సినిమాకు పరశురామ్ డైరెక్టర్? అసలు నిజం ఇదే!
-
ASUS Vivobook 15 2026: కొత్త ఇంటెల్ ప్రాసెసర్, 15.6-ఇంచెస్ డిస్ప్లేతో ఆసుస్ ల్యాప్టాప్ విడుదల.. ధర ఎంతంటే?
-
PM Narendra Modi: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. ట్రంప్కు, అమెరికా ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!