EV Subsidy: మీరు ఈవీ వెహికిల్ ఇంకా తీసుకోలేదా..? ఇదే కరెక్ట్ సమయం.. మరోసారి సబ్సిడీ పెంపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో హరిత రవాణాను ప్రోత్సహించడానికి , క్రూడాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ముమ్మరంగా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఫ్లాగ్షిప్ ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మరింత ఆర్థిక ఊతాన్ని అందించేందుకు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. పీఎం ఈ-డ్రైవ్ కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను పొడిగించేందుకు మంత్రిత్వ శాఖ అదనపు నిధులను కోరాలని యోచిస్తోంది. అయితే ఈ నిధుల పరిమాణంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
రూ.10,900 కోట్ల అంచనాతో 2024లో ప్రారంభమైన ఈ పథకంలో తొలుత ద్విచక్ర వాహనాల సబ్సిడీల కోసం రూ.1,772 కోట్లు కేటాయించారు. ఆశించిన దానికంటే నెమ్మదించిన విక్రయాల వేగం కారణంగా.. ఈ ప్రోగ్రామ్ను జూలై చివరి వరకు పొడిగించారు. ఇప్పుడు తాజా నిధులతో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ పథకం ద్వారా 2.47 మిలియన్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మే 24 నాటికి దాదాపు 2.35 మిలియన్ల వాహనాలకు సబ్సిడీలు లభించాయి. ప్రస్తుతం బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి మొదటి ఏడాది కిలోవాట్ అవర్కు (kWh) రూ.5,000, రెండో ఏడాదిలో దానిని రూ.2,500 కు తగ్గిస్తూ మార్కెట్ కు అనుగుణంగా సబ్సిడీలను అందిస్తున్నారు.
Also Read
- Karnataka: దారుణం.. భార్యను ఉరితీసి, చివరి క్షణాలను తల్లిదండ్రులకు చూపించిన భర్త..
- Artificial SUN: చైనా అద్భుత సృష్టి.. కృత్రిమ సూర్యుడు నిర్మాణం.. వీడియో వైరల్
- Akhilesh Yadav: ప్రధాని కోసం ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించారు.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు..
- Sanju Samson: కోహ్లీ సలహాలు నేను పట్టించుకోను.. సంచలన వ్యాఖ్యలు చేసిన సంజూ శాంసన్..
ఆర్థిక సంవత్సరం 2022లో 2,52,787 యూనిట్లుగా ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు, ఆర్థిక సంవత్సరం 2026 నాటికి 1.46 మిలియన్లకు పెరిగాయి. అదే సమయంలో పెట్రోల్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13.2 మిలియన్ల నుంచి 11 మిలియన్లకు తగ్గాయి. ఆర్థిక సంవత్సరం 2027 కోసం పీఎం ఈ-డ్రైవ్కు రూ.1,500 కోట్లు కేటాయించారు. దీనిని అసలు ఈ-బస్సులు, ట్రక్కులు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం నిర్దేశించారు. తాజా నిర్ణయంతో ఈ బడ్జెట్ ప్రాధాన్యతలను తిరిగి సమీక్షించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Sree Gowri Priya: ‘నాకు కోపం వచ్చినా.. బాధైనా మావోడు బయటకు వస్తాడు’.. శ్రీ గౌరీ ప్రియ షాకింగ్ కామెంట్స్!
-
Sai Razesh : ఫస్ట్ డే డిజాస్టర్ టాక్.. ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నా!
-
Karnataka: దారుణం.. భార్యను ఉరితీసి, చివరి క్షణాలను తల్లిదండ్రులకు చూపించిన భర్త..
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
Artificial SUN: చైనా అద్భుత సృష్టి.. కృత్రిమ సూర్యుడు నిర్మాణం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!