Veerababu Burugadda
Author- NTV Telugu-
Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్లుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం..
తెలంగాణ ప్రభుత్వం శాసనసభ , శాసన మండలిలో ప్రభుత్వ విప్ల నియామకానికి సంబంధించిన కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నియామకాలు మార్చి 18 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను తెలంగాణ గెజిట్లో ప్రత్యేక సంచికగా ప్రచురించాలని కూడా సూచించారు. అసెంబ్లీలో 3గ్గురు, కౌన్సిల్లో ఇద్దరు.. తెలంగాణ శాసనసభలో ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్లుగా నియమించారు. వారు పెద్దపల్లి […] -
DK-Deepika: మూడోసారి తండ్రైన దినేశ్ కార్తీక్.. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన దీపికా..
భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్, స్క్వాష్ స్టార్ దీపికా పల్లికల్ దంపతులు తమ ఇంట్లోకి కొత్త అతిథి వచ్చిందని సంతోషంగా ప్రకటించారు. వీరికి ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకు ‘రాహా పల్లికల్ కార్తీక్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వీరికి ఇప్పటికే కబీర్, జియాన్ అనే ఇద్దరు కవల కొడుకులు ఉన్నారు. ఇప్పుడు తమ కొడుకులకు తోడుగా చిన్న చెల్లాయి […] -
Gold Rates: ఫెడ్ ఎఫెక్ట్.. యూ టర్న్ తీసుకున్న బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు ఎంతంటే..
ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు సాధారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి కొంచెం భిన్నంగా మారింది. అమెరికా డాలర్ బలపడటం, అక్కడి ట్రెజరీ బాండ్లపై వడ్డీ లాభాలు పెరగడం వల్ల ఇన్వెస్టర్లు బంగారం, వెండి నుంచి దూరమవుతున్నారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా కొనసాగించడంతో ఈ ప్రభావం మరింత కనిపిస్తోంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ వైపు మొగ్గు చూపుతారు. ఈ కారణాల వల్ల […] -
Rythu Bharosa: రైతులకు అలర్ట్.. రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ పథకానికి సంబంధించి నూతన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. సాగు పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే కొత్త రైతులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఎవరు అర్హులు..? రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా నిబంధనల ప్రకారం 2026 ఫిబ్రవరి 28 నాటికి తమ పేరు మీద భూమి […] -
Gate Results: గేట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2026) ఫలితాలను ఐఐటీ గువాహటి అధికారికంగా ప్రకటించింది. ఐఐటీలు, ఐఐఎస్సీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఫలితాలను ఎలా చూసుకోవాలి..? ఈ ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో గేట్ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు, […] -
Stock Market Down: స్టాక్ మార్కెట్ భారీ పతనం.. కారణాలు ఇవే..
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఇష్టమైన ఉగాది పర్వదినం వేళ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను ఇస్తాయనుకుంటే.. స్టాక్ మార్కెట్ మాత్రం నేడు ‘బ్లడ్ బాత్’ (భారీ పతనం)తో షాక్ ఇచ్చింది. నిఫ్టి, బ్యాంక్ నిఫ్టి, సెన్సెక్స్ లు భారీగా కుప్పకూలిపోయాయి. ఈ భారీ పతనానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే.. ముఖ్యంగా పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్, ఖతార్లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ (Ras Laffan) ఇండస్ట్రియల్ సిటీపై క్షిపణి దాడులు చేయడం […] -
Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!
రంగారెడ్డి జిల్లాలో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించే ముఠాల పట్ల జిల్లా సివిల్ సప్లై అధికారి (DSO) వనజాతా రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, ప్రజల భద్రతను పణంగా పెట్టి అక్రమ వ్యాపారం సాగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు. రాజేంద్రనగర్ పరిధిలో భారీ తనిఖీలు.. బుధవారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ కాళీ మందిర్ సమీపంలో పౌరసరఫరాల శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ […] -
Holidays: మార్చి 20న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..
తెలంగాణ రాష్ట్రంలో పండుగల సందడి మొదలైంది. మార్చి నెలలో వరుసగా వస్తున్న ఉగాది, రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగల మధ్యలో ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఉద్యోగులకు ఊరటనిస్తోంది. జుమాతుల్ వడా (రంజాన్ మాసపు చివరి శుక్రవారం) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మార్చి 20, 2026న ఐచ్ఛిక సెలవు (Optional Holiday) ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తేదీ మార్పుకు కారణం… నిజానికి ఈ సెలవును మొదట మార్చి 13న ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే.. చంద్రదర్శనం, […] -
Railway Zone: విశాఖ రైల్వే జోన్ పనులు.. రైల్వే మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ రైల్వే రంగంలో జరుగుతున్న కీలక పరిణామాలు, ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ పురోగతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్లో వివరాలను వెల్లడించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. జోన్ పనులను పర్యవేక్షించేందుకు జనరల్ మేనేజర్ (GM) సహా ఇతర ఉన్నతాధికారుల నియామక ప్రక్రియ పూర్తయ్యింది. జోన్ కార్యకలాపాలను తక్షణమే ప్రారంభించేందుకు వీలుగా వైజాగ్లోని VMRDA భవనం ‘ది […] -
Telangana CS: తెలంగాణ సీఎస్ పదవీ కాలం పొడిగింపు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణారావు పదవీ కాలం పొడిగింపుపై గత కొద్దిరోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఆయన సర్వీసును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక ఉత్తర్వులు అందాయి. తాజా పొడిగింపుతో రామకృష్ణారావు జూన్ నెలాఖరు వరకు తెలంగాణ సీఎస్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. వాస్తవానికి రామకృష్ణారావు గతేడాది […]
తాజావార్తలు
-
DoT New SIM Rules 2026: కొత్త SIM Card తీసుకోవాలనుకుంటున్నారా? DoT కొత్త రూల్స్ ఇవే.. పూర్తి వివరాలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!