Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీవితంలో విజయం సాధించాలంటే కేవలం అదృష్టం ఉంటే సరిపోదు, అంకితభావంతో కూడిన కష్టం, పట్టుదల ఉండాలి. సున్నా నుంచి శిఖరానికి చేరడం ఎలాగో నిరూపించిన గొప్ప వ్యక్తి సావ్జీ ధోలాకియా. కేవలం 12 రూపాయలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన కథ ప్రతి ఒక్కరికీ ఒక పాఠం. పేదరికం నీ ఎదుగుదలని ఆపలేదని, లక్ష్యం వైపు నిజాయితీగా అడుగులు వేస్తే విజయం వరిస్తుందని ఆయన జీవితం నిరూపిస్తుంది. కష్టపడే తత్వం ఉంటే సామాన్యుడు కూడా అసామాన్యుడిగా మారవచ్చని చెప్పడానికి ఈయన ఒక గొప్ప ఉదాహరణ.
గుజరాత్లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సావ్జీ ధోలాకియా, చదువు మధ్యలోనే ఆపేసి కేవలం 13 ఏళ్ల వయసులో సూరత్ చేరుకున్నారు. అప్పట్లో ఆయన దగ్గర ఉన్నది కేవలం 12 రూపాయలు మాత్రమే. అది కూడా తను పుట్టిన ఊరిలో అప్పు చేసి మరీ తెచ్చుకున్నాడు. తన మామ వద్ద వజ్రాలకు మెరుగులు దిద్దే పనిలో చేరి, ఆ వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్నారు. సుమారు పదేళ్ల పాటు ఎంతో కష్టపడి పని నేర్చుకున్న తర్వాత, 1992లో తన సోదరులతో కలిసి ‘హరికృష్ణ ఎక్స్పోర్ట్స్’ అనే సంస్థను స్థాపించారు.
Also Read
- Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
మొదట్లో చిన్నగా మొదలైన ఈ వ్యాపారం, ధోలాకియా కష్టపడే తత్వంతో అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. నేడు ఆయన సంస్థ విలువ సుమారు 15,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఆయన కంపెనీ వజ్రాలు ప్రపంచంలోని ఎన్నో దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
సావ్జీ ధోలాకియా కేవలం డబ్బు సంపాదించడమే కాదు, తన దగ్గర పనిచేసే ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. తన కంపెనీ అభివృద్ధికి కారణమైన ఉద్యోగులకు దీపావళి కానుకగా వందలాది కార్లు, ఇళ్లు, ఖరీదైన నగలు బహుమతిగా ఇచ్చి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. కంపెనీ లాభాల్లో ఉద్యోగులకు కూడా వాటా ఉండాలని ఆయన నమ్ముతారు.
వ్యాపారవేత్తగానే కాకుండా సమాజ సేవలో కూడా ఆయన ముందుంటారు. చెరువుల నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టారు. దీనికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. 12 రూపాయలతో మొదలై 15 వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆయన ప్రయాణం నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తి.
తాజావార్తలు
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?