అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలోని ల్యాండ్స్కేప్ సరఫరా కంపెనీలో 21 ఏళ్ల యువకుడు తుపాకీతో చెలరేగిపోయాడు. ముగ్గురు సహోద్యోగులను కాల్చి చంపి.. అనంతరం తుపాకీతో కాల్చుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం పట్టి పీడిస్తోంది. స్వచ్ఛమైన గాలి దొరకకా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కాలుష్య నివారణ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మేఘమథనం చేపట్టింది. కానీ ఈ ప్రయత్నం ఫెయిల్ అయింది.
బీబీసీలో భారీ కుదుపు చోటుచేసుకుంది. ట్రంప్ వర్గం నుంచి ఎదురైన వ్యతిరేకతతో బీబీసీ డైరెక్టర్ జనరల్, న్యూస్ సీఈవో ఇద్దరూ కూడా తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. దీంతో ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.
ప్రజల హక్కుల కోసం మహాత్మాగాంధీలాంటి పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కతిహార్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది. డిసెంబర్ 1 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
బీహార్లో రెండో విడత పోలింగ్ కోసం ఉధృతంగా ప్రచారం సాగుతోంది. అన్ని పార్టీలకు చెందిన అగ్ర నాయకులంతా ర్యాలీలు, బహిరంగ సభలతో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఓ వైపు ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్రమంత్రులు ప్రచారం చేస్తుండగా.. ఇంకోవైపు రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే లాంటి అగ్ర నేతలంతా ప్రచారం చేస్తున్నారు.
ఇండియా కూటమి లక్ష్యంగా మరోసారి ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సీతామర్హిలో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. యువతకు మేము ల్యాప్టాప్లు ఇస్తుంటే.. ఆర్జేడీ రివాల్వర్లు ఇస్తోందని విరుచుకుపడ్డారు. తొలి దశ ఎన్నికల్లో జంగిల్ రాజ్కు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారన్నారు.
ఇండియన్-అమెరికన్ వివేక్ రామస్వామిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు వర్షం కురిపించారు. వివేక్ తనకు బాగా తెలుసని.. చాలా ప్రత్యేకమైన వ్యక్తి అంటూ కొనిడాయారు.
బీహారీయులు కొత్త ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బీహార్లో తొలి విడతలో భారీగా పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం రెండో విడత ఎన్నికల కోసం ఉధృతంగా ప్రచారం సాగుతోంది. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు.
మెక్సికోలో ఇజ్రాయెల్ రాయబారి ఐనాట్ క్రాంజ్-నీగర్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపించాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఈ హత్యకు ప్లాన్ చేశాయని శుక్రవారం వెల్లడించాయి.