Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం
- సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై వాదనలు
- న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది మే నెలలో హనీమూన్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కాళ్లపారాణి ఆరకముందే ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది ఇల్లాలు. అయితే ఈ కేసులో ఇటీవల ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. దీంతో బాధిత కుటుంబంతో పాటు యావత్తు దేశం అవాక్కైంది. ఇంత సీరియస్ కేసులో నిందితురాలికి బెయిల్ ఎలా వచ్చిందని నిశ్చేష్టులయ్యారు.

Also Read
- TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
- Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
- Bihar: షాకింగ్ నిర్ణయం.. బంకీపూర్ అభ్యర్థిని మార్చేసిన బీజేపీ.. కారణమిదేనా?
- Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
దీంతో నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేయాలంటూ బాధిత కుటుంబం షిల్లాంగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఇరువర్గాలు వాదనలు వినిపించారు. అయితే విచారణ పూర్తి కాకపోవడంతో శుక్రవారానికి వాయిదా పడింది. ఇప్పుడు తదుపరి విచారణపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. బెయిల్ రద్దవుతుందా? లేదంటే కొనసాగిస్తుందా? అన్నది సస్పెన్ష్గా ఉంది.
సోనమ్ రఘువంశీ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సంజీవ్ చందా వాదనలు వినిపించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గురువారం డిఫెన్స్ తమ వాదనలను వినిపించిందని తెలిపారు. వారి వాదనలపై కోర్టులో వివరంగా చర్చ జరిగిందని.. విచారణ చాలాసేపు కొనసాగిందని అన్నారు. అయితే వాదనలు పూర్తి కాలేదని.. విచారణను శుక్రవారం వరకు కొనసాగించాలని కోర్టు నిర్ణయించిందని చెప్పారు. తదుపరి విచారణలో డిఫెన్స్ తమ మిగిలిన వాదనలను వినిపిస్తుందని పేర్కొన్నారు.
సోనమ్ రఘువంశీకి బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉందా అని అడగ్గా.. సూటిగా సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని.. రాబోయే ఏ నిర్ణయంపైనా వ్యాఖ్యానించడం తగదని పేర్కొన్నారు. ప్రతి విచారణతో ఉత్సుకత పెరుగుతుండటంతో.. ఈ కేసు గణనీయమైన ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. గురువారం నాటి విచారణ తర్వాత.. ఇప్పుడు అందరి దృష్టి శుక్రవారం నాటి విచారణపైనే కేంద్రీకృతమై ఉంది.
తదుపరి విచారణపై అందరి దృష్టి
న్యాయ నిపుణుల ప్రకారం.. శుక్రవారం నాడు ప్రతివాద పక్షం తమ వాదనలను పూర్తి చేస్తుంది. దీని తర్వాత బెయిల్ పిటిషన్పై తదుపరి కార్యాచరణను కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అయితే తుది నిర్ణయం ఏమిటనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక సూచన రాలేదు. ప్రస్తుతం అందరి దృష్టి షిల్లాంగ్ కోర్టులో జరుగుతున్న విచారణపైనే ఉంది. ఈ కేసులో శుక్రవారం నాటి విచారణ కీలకమైనదిగా భావిస్తున్నారు.
గతేడాది మే 11న రాజా రఘువంశీ-సోనమ్ రఘువంశీకి వివాహమైంది. అనంతరం హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. విహార యాత్ర పేరుతో భర్తను నమ్మించి.. ప్రియుడితో కలిసి భర్తను సోనమ్ చంపేసింది. ఈ ఘటన యావత్తు దేశాన్ని కుదిపేసింది. తొలుత రాజా మృతదేహం లభించగా.. కొద్దిరోజుల తర్వాత సోనమ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఏడాది తర్వాత బెయిల్ లభించడంతో బాధిత కుటుంబం షాక్కు గురైంది.
తాజావార్తలు
-
S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
-
Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్లో కింగ్ రైటింగ్!
-
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
-
Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
-
TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!