Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం
- సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై వాదనలు
- న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది మే నెలలో హనీమూన్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కాళ్లపారాణి ఆరకముందే ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది ఇల్లాలు. అయితే ఈ కేసులో ఇటీవల ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. దీంతో బాధిత కుటుంబంతో పాటు యావత్తు దేశం అవాక్కైంది. ఇంత సీరియస్ కేసులో నిందితురాలికి బెయిల్ ఎలా వచ్చిందని నిశ్చేష్టులయ్యారు.

Also Read
- Pakistan: పాకిస్తాన్ పరువు తీసిన అమెరికా ఉపాధ్యక్షుడు..
- NEET Aspirant Suicide: మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. చివరి వీడియోలో భావోద్వేగ మాటలు..
- Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
- NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
దీంతో నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేయాలంటూ బాధిత కుటుంబం షిల్లాంగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఇరువర్గాలు వాదనలు వినిపించారు. అయితే విచారణ పూర్తి కాకపోవడంతో శుక్రవారానికి వాయిదా పడింది. ఇప్పుడు తదుపరి విచారణపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. బెయిల్ రద్దవుతుందా? లేదంటే కొనసాగిస్తుందా? అన్నది సస్పెన్ష్గా ఉంది.
సోనమ్ రఘువంశీ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సంజీవ్ చందా వాదనలు వినిపించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గురువారం డిఫెన్స్ తమ వాదనలను వినిపించిందని తెలిపారు. వారి వాదనలపై కోర్టులో వివరంగా చర్చ జరిగిందని.. విచారణ చాలాసేపు కొనసాగిందని అన్నారు. అయితే వాదనలు పూర్తి కాలేదని.. విచారణను శుక్రవారం వరకు కొనసాగించాలని కోర్టు నిర్ణయించిందని చెప్పారు. తదుపరి విచారణలో డిఫెన్స్ తమ మిగిలిన వాదనలను వినిపిస్తుందని పేర్కొన్నారు.
సోనమ్ రఘువంశీకి బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉందా అని అడగ్గా.. సూటిగా సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని.. రాబోయే ఏ నిర్ణయంపైనా వ్యాఖ్యానించడం తగదని పేర్కొన్నారు. ప్రతి విచారణతో ఉత్సుకత పెరుగుతుండటంతో.. ఈ కేసు గణనీయమైన ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. గురువారం నాటి విచారణ తర్వాత.. ఇప్పుడు అందరి దృష్టి శుక్రవారం నాటి విచారణపైనే కేంద్రీకృతమై ఉంది.
తదుపరి విచారణపై అందరి దృష్టి
న్యాయ నిపుణుల ప్రకారం.. శుక్రవారం నాడు ప్రతివాద పక్షం తమ వాదనలను పూర్తి చేస్తుంది. దీని తర్వాత బెయిల్ పిటిషన్పై తదుపరి కార్యాచరణను కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అయితే తుది నిర్ణయం ఏమిటనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక సూచన రాలేదు. ప్రస్తుతం అందరి దృష్టి షిల్లాంగ్ కోర్టులో జరుగుతున్న విచారణపైనే ఉంది. ఈ కేసులో శుక్రవారం నాటి విచారణ కీలకమైనదిగా భావిస్తున్నారు.
గతేడాది మే 11న రాజా రఘువంశీ-సోనమ్ రఘువంశీకి వివాహమైంది. అనంతరం హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. విహార యాత్ర పేరుతో భర్తను నమ్మించి.. ప్రియుడితో కలిసి భర్తను సోనమ్ చంపేసింది. ఈ ఘటన యావత్తు దేశాన్ని కుదిపేసింది. తొలుత రాజా మృతదేహం లభించగా.. కొద్దిరోజుల తర్వాత సోనమ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఏడాది తర్వాత బెయిల్ లభించడంతో బాధిత కుటుంబం షాక్కు గురైంది.
తాజావార్తలు
-
Parastoo Ahmadi : హిజాబ్ ధరించలేదని గాయనిపై అరాచకం.. ఏకంగా 74 కొరడా దెబ్బల శిక్ష!
-
Pakistan: పాకిస్తాన్ పరువు తీసిన అమెరికా ఉపాధ్యక్షుడు..
-
Bangladesh: బంగ్లాదేశ్లో మార్మోగిన ‘‘జై శ్రీరాం’’ నినాదాలు.. ఢాకాలో హిందువుల భారీ ర్యాలీ..
-
KL Rahul: రాహుల్ను ల్యాబ్లో ఎలుకలా వాడుకుంటున్నారు.. అభిమానుల ఆగ్రహ జ్వాలలు..
-
Tollywood: పుష్ప 2 తర్వాత 20 తెలుగు పాన్ ఇండియా ఫెయిల్యూర్స్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!