DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- కర్ణాటకలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం
- ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణం
- 13 మంది మంత్రులు ప్రమాణస్వీకారం
- మహిళలకు చోటు లేకపోవడంపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో బుధవారం డీకే.శివకుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. డీకే.శివకుమార్ ముఖ్యమంత్రిగా.. ఆయనతో పాటు 13 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. డీకే.శివకుమార్ అయితే ముఖ్యమంత్రి అయ్యారు గానీ.. మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం దక్కకపోవడంపై ప్రస్తుతం రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుల సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేబినెట్ను రూపొందించినప్పటికీ.. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక కేబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడం.. దేశంలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యంపై మరోసారి చర్చకు దారితీసింది. శాసనసభల్లో మహిళల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అధికార కేంద్రాల్లో వారికి తగిన స్థానం దక్కడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి?
ఇటీవల ఏర్పడిన పలు రాష్ట్ర ప్రభుత్వాల్లో మహిళలకు కనీసం కొంత మేర ప్రాతినిధ్యం కల్పించారు. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వంలో 35 మంది మంత్రుల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు. ఇక తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో 23 మంది మంత్రుల్లో నలుగురు మహిళలు చోటు దక్కించుకున్నారు. కేరళలో ముఖ్యమంత్రి సతీశన్ కేబినెట్లో 20 మంది మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. అసోంలో ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు మంత్రుల్లో ఒకరు మహిళ ఉన్నారు. కర్ణాటకలో 13 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తే ఒక్క మహిళ కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
కర్ణాటకలో 224 మంది సభ్యుల్లో అసెంబ్లీలో కేవలం 10 మంది మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కొత్త కేబినెట్లో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో లింగ సమానత్వంపై మరోసారి చర్చ మొదలైంది. రాజకీయ పార్టీల నిర్ణయాత్మక స్థానాల్లో మహిళలకు మరింత అవకాశాలు కల్పించాలని మహిళా సంఘాలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
-
Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
-
Michael : బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’ రూ. 9500 కోట్ల వసూళ్లతో ఆల్టైమ్ రికార్డ్
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!