Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
- కీలక నేతలకు అవకాశం
- ఈనెల 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు పార్టీ కీలక నేతలను రంగంలోకి దించింది. మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్కు అవకాశం కల్పించింది.
మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్తో పాటు రజనీష్ అగర్వాల్ను కూడా రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది. ఒడిశాలో ఇటీవల బీజేడీని వీడి బీజేపీలో చేరిన మాజీ నేత దేవాశిష్ సామంత్రాయ్ను ఉప ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ నుంచి తై తగక్కు బీజేపీ టికెట్ ఇచ్చింది. గుజరాత్ రాష్ట్రం నుంచి రాజుభాయ్ శుక్లా, ముకేశ్భాయ్ రాథ్వా, మాన్సింగ్ పర్మార్లను అభ్యర్థులుగా ప్రకటించింది. రాజస్థాన్లో ఆల్కా గుర్జర్, సతీశ్ పూనియాలకు బీజేపీ అవకాశం కల్పించింది. మణిపూర్ నుంచి ఏ. శారదా దేవిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది.
Also Read
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
దేశవ్యాప్తంగా ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. పలు రాష్ట్రాల్లో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఒడిశాలో ఇటీవలే బీజేపీలో చేరిన దేవాశిష్ సామంత్రాయ్కు అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ తన విస్తరణ వ్యూహాన్ని కొనసాగిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
27 రాజ్యసభ స్థానాల్లో పోలింగ్..
దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 27 రాజ్యసభ స్థానాలకు ఈనెల 18న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 18న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరాం రాష్ట్రాల్లో మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.
BJP has nominated BJP national general secretary Tarun Chugh as its Rajya Sabha candidate from Madhya Pradesh.
Debashish Samantray, a former BJD leader who recently joined the BJP, has been announced as the Odisha Rajya Sabha by-election candidate. https://t.co/A33a4SSgCf
— ANI (@ANI) June 4, 2026
తాజావార్తలు
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!