విజయవాడ బందర్ రోడ్డులో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో ముగిసింది.. గంట పాటు బందర్ రోడ్డులో రోడ్ షో నిర్వహించారు ప్రధాని మోడీ.. ఈ రోడ్ షోలో వాహనంపై ప్రధాని మోడీకి ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నిలబడి.. దారిపొడవునా.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.. ప్రధాని మోడీ రోడ్ షో.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిలో కొత్త జోష్ నింపిందని కూటమి నేతలు చెబుతున్నారు..
చేజర్ల మండలంలోని కాకివాయి గ్రామంలో ప్రజలంతా ఒకే నిర్ణయం తీసుకొని.. గ్రామ అభివృద్ధికి సహకరిస్తుంటారు. గతంలో పలుమార్లు ఈ గ్రామంలో ఎన్నికలు లేకుండా సర్పంచులు ఎన్నుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీతో పాటు, లోక్సభ ఎన్నికలు రావడంతో తాము ఓట్లు అమ్ముకోబోమంటూ.. గ్రామస్తులు.. ఊరంతా వేసిన గోడపత్రాలు.. ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి.
హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన కడప కోర్టు.. ఇరువర్గాల వాదనలు వింది.. ఆ తర్వాత షర్మిల, సునీత, బీటెక్ రవి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారన్న పేర్కొంది.. షర్మిల, సునీతకు, పులివెందుల టీడీపీ అభ్యర్థి మా రెడ్డి రంగారెడ్డికి అలియాస్ బీటెక్ రవికి రూ.10 వేల జరిమానా విధించింది కడప కోర్టు.. ఆ జరిమానాను జిల్లా లీగల్ సెల్కు కట్టాలన పేర్కొంది కడప కోర్టు.
ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆకాక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి బహిరంగసభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు.. ఏపీ వికాస్ మోడీ లక్ష్యంగా పేర్కొన్నారు..