Mumbai Heavy Rains: దంచికొట్టిన వాన.. 24 గంటల్లో 265 మిల్లీమీటర్ల వర్షం.. నేడు స్కూల్స్ కు సెలవు..!
- ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు
- 24 గంటల్లో 265 మిల్లీమీటర్ల వర్షం
- నేడు స్కూల్స్ కు సెలవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 265 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నీటమునిగిపోవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతినగా, విమానాశ్రయంలో కూడా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీచడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. మంఖుర్డ్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఒక బహుళ అంతస్తుల భవనం కూలిపోవడం ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ముంబైకి జూలై 6న కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.
Also Read
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
పాఠశాలలకు సెలవు
వాతావరణ శాఖ హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రతను ప్రాధాన్యంగా భావిస్తూ జూలై 6న ముంబై పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. బీఎంసీ ఆధ్వర్యంలోని పాఠశాలలతో పాటు అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఉత్తర్వులు కేవలం పాఠశాలలకు మాత్రమే వర్తిస్తాయని, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని బీఎంసీ స్పష్టం చేసింది.
థానే, నవీ ముంబైలో కూడా సెలవులు
భారీ వర్షాల నేపథ్యంలో థానే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. జిల్లా మేజిస్ట్రేట్ శ్రీకృష్ణ నాథ్ పంచల్ జిల్లాలోని అన్ని అంగన్వాడీలు, బాల్వాడీలు, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. అదే విధంగా నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మేయర్ సుజాత పాటిల్, కమిషనర్ కైలాష్ షిండే ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
24 గంటల్లో భారీ వర్షపాతం నమోదు
బీఎంసీ విడుదల చేసిన వివరాల ప్రకారం, జూలై 4 సాయంత్రం 6 గంటల నుంచి జూలై 5 సాయంత్రం 6 గంటల వరకు ముంబై నగరంలో 265 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. శివారు ప్రాంతాల్లో 227 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అలాగే గగన్బవాడ ప్రాంతంలో అత్యధికంగా 143.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అధికారులు అప్రమత్తం
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉండటంతో విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు వాతావరణ హెచ్చరికలను పాటించాలని, అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!