YS Jagan: డయేరియా మృతుల కుటుంబాలకు పరామర్శ.. ఆర్థిక సాయం ప్రకటించిన జగన్
- విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
- గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలకు పరామర్శ..
- డయేరియా మృతుల కుటుంబాలకు రూ 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటన..
- కూటమి హయాంలో గ్రామ స్వరాజ్యం అస్తవ్యస్తం అయ్యిందన్న మాజీ సీఎం..
YS Jagan: విజయనగరం జిల్లా పర్యటనలో ప్రభుత్వంపై హాట్ కామెంట్లు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను.. డయేరియాతో ఆస్పత్రిపాలైనవారిని పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా డయేరియా మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు.. కూటమి హయాంలో గ్రామ స్వరాజ్యం అస్తవ్యస్తం అయ్యింది.. 14 మంది డయేరియాతో చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు.. సెప్టెంబర్ లో మొదటి కేసు నమోదైనా 35 రోజులపాటు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.. గుర్ల, ఘోషాడలో తీవ్రంగా డయేరియా ప్రబలింది.. గుర్ల గ్రామాల్లో డయేరియాతో నేను ట్వీట్ చేస్తేనే ప్రభుత్వం స్పందించిందన్నారు..
Read Also: Madhabi Puri Buch: పార్లమెంటరీ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టిన సెబీ చీఫ్
Also Read
- Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..
- Travels Bus Caught Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..
- Vizianagaram Incident: యువకుడి వికృత చేష్టలు.. నిండు గర్భిణీ ఇంటి ముందు అసభ్య ప్రవర్తన..!
- Road Accident: జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు.. ఓ ప్రాణం బలి!
ఇక, వ్యాధి తీవ్రతను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు.. చంపావతి నదిలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.. మెయింటెనెన్స్ రెన్యువల్ కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు.. క్లోరినేషన్ జరిగిందో లేదో కూడా పట్టించుకోలేదు అని మండిపడ్డారు వైఎస్ జగన్.. సచివాలయ సహాయ సహకారాలు తీసుకోవాలనే ఆలోచనే లేదు.. శానిటేషన్ పట్టించుకోలేదు.. 345 మంది డయేరియాతో ప్రభుత్వ ఆసుపత్రిలో, 100 మందికి పైగా ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు.. ఇష్యూ ని కవర్ చేసుకోవాలనే దిక్కుమాలిన ఆలోచనలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.. మండలంలో 14 మంది చనిపోతే కనీసం విశాఖ కేజీహెచ్ కి తీసుకెళ్లలేకపోయారంటూ ప్రశ్నించిన జగన్.. గ్రామీణ ప్రజల పట్ల ప్రభుత్వం అశ్రద్ధగా ఉందన్నారు..
Read Also: MLC Jeevan Reddy: అవమానంగా భావిస్తున్న.. ఖర్గే, రాహుల్ గాంధీ లకు జీవన్ రెడ్డి లేఖ..
మేము అభివృద్ధి చేసిన స్కూల్లోనే వైద్యం అందించాడు.. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరం ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేకపోయారు? అని ప్రశ్నించారు జగన్.. ప్రభుత్వం నుండి సహాయం చేయకపోగా, డయేరియా వలన చనిపోయినట్లు చెప్పొద్దంటూ బాధిత కుటుంబాలకు అధికారులు చెప్పడం దారుణం అన్నారు.. ఆరోగ్య శ్రీ బకాయిలను కూడా ఈ ప్రభుత్వం చెల్లించలేకపోతుంది.. నిర్మాణంలో ఉన్న 12 మెడికల్ కాలేజీలను అమ్మేయడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.. ఆరోగ్యశ్రీ లో 25 లక్షలు వరకు ఉచిత వైద్యము అందించాం.. దానిని కూడా ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. 65 మంది ఇప్పటికే చికిత్స పొందుతున్నారు.. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. డయేరియా మృతుల కుటుంబాలకు రెండు లక్షలు పరిహారం అందజేస్తున్నాం.. ఏదైనా ఇష్యూ జరిగితే డైవర్షన్ ఎలా చేయాలో చూస్తున్నారు తప్పా పని చేయరు అని దుయ్యబట్టారు వైఎస్ జగన్..
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!