ప్రొఫెసర్ కోదండరామ్..... పిల్లలకు రాజకీయ పాఠాలు చెప్పే సారు. క్లాస్రూమ్ లెసన్స్లో తనకు తిరుగులేదని అనింపించుకున్న ఈ మాస్టారు..... పొలిటికల్ ప్రాక్టికల్స్లో మాత్రం బాగా వెనుకబడ్డారన్న టాక్ నడుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటుదామని రంగంలోకి దిగినా సరైన వ్యూహరచన లేక బోల్తా పడుతున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో.
తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి... అయితే, గోదావరి నీళ్లు పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్తామని చెప్పామంటూ కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు.
తెలంగాణలో బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు వివిధ కారణాలు చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. మామూలుగా అయితే... ఇది రొటిన్ వ్యవహారంలాగే అనిపించేదిగానీ... పార్టీ ఫిరాయింపుల్ని బీఆర్ఎస్ సీరియస్గా తీసుకోవడంతో.... పొలిటికల్ ఫైర్ మొదలైంది. ఆ పది మంది మీద ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ ఓ వైపు సుప్రీం కోర్ట్లో పెద్ద యుద్ధమే చేస్తోంది గులాబీ పార్టీ.
2024 ఎన్నికలు ఒక చరిత్ర.. 9 నెలల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మరో చరిత్రగా అభివర్ణించారు సీఎం చంద్రబాబు నాయుడు.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీలో కూడా రెండు టీచర్ సంఘాలకు ఓటు వేయమని చెప్పాం.. పని చేసే వారికే గెలుపు వరిస్తుంది. జనసేన తరపున పవన్ కల్యాణ్కు అభినందనలు.. బీజేపీ, జనసేన కార్యకర్తలు క్రమశిక్షణతో పని చేశారని పేర్కొన్నారు..
ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా రెడ్బుక్పైనే చర్చ సాగుతోంది.. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ వైసీపీని విమర్శిస్తోంది.. అయితే, రెడ్బుక్పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్..
ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి కూడా.. పార్టీ ఆవిర్భావ వేడుకులకు వెళ్లాలనే నేతలు సిద్ధం అవుతున్నారు.. అందులో భాగంగా జిల్లాల నాయకులు, నియోజకవర్గం నేతలు, పార్టీ కార్యకర్తలు తరలి రావాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేమురి శంకర్ గౌడ్ కోరారు.
పోసాని కృష్ణ మురళిని అదుపులోకి తీసుకున్న ఆదోని త్రీ టౌన్ పోలీసులు.. పీటీ వారెంట్ పై తీసుకెళ్తున్నారు.. నిన్న నర్సరావుపేట కోర్టులో పోసానిని హాజరుపరిచారు పోలీసులు.. రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.. ఇక, ఈ రోజు పీటీ వారెంట్ పై ఆదోనికి తీసుకెళ్తున్నారు పోలీసులు.. మొదట రాజంపేట సబ్ జైలు.. ఆ తర్వాత గుంటూరు జైలుకు.. ఇప్పుడు అక్కడి నుంచి కర్నూలు.. ఇలా ఏపీని మొత్తం పోసాని కృష్ణమురళి చుట్టేలా ఉన్నారేమో..
నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యే ఉద్యోగుల వయోపరిమితి భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. అయితే, యూనిఫాం సర్వీసెస్ ర్రికూట్మెంట్లో రెండేళ్ల వయోపరిమితిని పెంచిన ఏపీ ప్రభుత్వం.. అదే, నాన్ యూనిఫాం ఉద్యోగాలకు 34 ఏళ్ల నుంచి ఏకంగా 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు.. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ శ్రేణులు.. ఓవైపు దువ్వాడకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు.. వరుసగా పోలీస్ స్టేషన్లలో వైసీపీ ఎమ్మెల్సీపై ఫిర్యాదులు చేస్తున్నారు..
ఏకంగా 13.4 శాతానికి అప్పులు తీసుకొచ్చారు.. వీళ్లని ఏమనాలి..? అంటూ ఫైర్ అయ్యారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. బడ్జెట్పై రిప్లై ఇస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ సమాజానికి హానికరం అంటూ వ్యాఖ్యానించారు.. సిగరెట్ పెట్టెల మీద స్టాట్యూటరీ వార్నింగ్ ఇచ్చినట్లు.. వైసీపీ సమాజానికి హానికరం అంటూ పదే పదే చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు..