ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. అయితే, దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి మధ్యంతర రక్షణ కొనసాగనున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.. తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ కొనసాగనుంది..
రాబోయే 3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.. రానున్న మూడు రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఇక, ఈ రోజు పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ పేర్కొన్నారు..
ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది.. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది.. ఈ నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లు తీసుకుంటారు.. ఇప్పటి వరకు బీజేపీ నుంచి రాజ్యసభకు సంబంధించి నామినేషన్ ఎవరూ వేయలేదు. దీంతో ఏపీ నుంచి ఎవరికీ రాజ్యసభ స్థానం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది... అయితే, కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి రాజ్యసభ స్థానం ఇవ్వడానికి ఒప్పందం జరిగింది.. దీంతో బీజేపీ నుంచి కొన్ని పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. మత్స్యకారుల వలసలు తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది.. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రెట్టింపు చేస్తాం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది.. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రూ.10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచామని ఓ ప్రకటను పేర్కొన్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. మే 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది టీటీడీ.. ఈ సమయంలో స్వయంగా విచ్చేసే వీఐపీలకు మాత్రమే ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.. మే 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శనాలు ఉదయం 6 గంటలకు ప్రారంభించబోతోంది టీటీడీ.. అయితే, సిఫార్సు లేఖలు తీసుకుని శ్రీవారి దర్శానికి ఏర్పాట్లు చేసుకుంటున్న భక్తులు.. ఈ…
ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. వచ్చేనెల 2న ప్రధాని మోడీ అమరావతికి వస్తున్నారు... ప్రధాని రాక కోసం పూర్తిస్ధాయి ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం .. లక్షలాదిగా రైతులు, ప్రజలు తరలి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.. సెక్రటేరియట్ వెనుక స్ధలంలో అతిపెద్ద సభ ఏర్పాటు చేస్తున్నారు.. ఆ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు..
కడప ఎమ్మెల్యే మాధవి పీఏ వాహిద్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.. డబ్బులు ఇస్తానంటూ నమ్మించి పెళ్లి చేసుకున్న వాహిద్.. ఆ తర్వాత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్కు దిగాడు.
ఏపీలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీపై జెండా ఎగరేయాలన్న టీడీపీ కల ఎట్టకేలకు నెరవేరింది. ఏడాది కాలపరిమితి కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి విజయం లాంఛనం అయింది. మేయర్ అభ్యర్ధిగా ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. పార్టీ బీఫార్మ్ ను పీలాకు అందజేశారు నగర పార్టీ అధ్యక్షుడు గండిబాబ్జీ. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపిక టీడీపీ, వైసీపీల్లో హైటెన్షన్ పుట్టిస్తుంది.. నిన్నటివరకూ ఏకపక్షమే అనుకున్న మేయర్ ఎన్నికల్లోకి వైసీపీ అనుహ్యంగా ఎంట్రీ ఇవ్వడంతో టీడీపీ నేతలు ఎలర్ట్ అయ్యారు.. మరోవైపు కూటమి అభ్యర్దిగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు.. మేయర్ ఎన్నికపై వైసీపీ విప్ జారీ చేసింది.