Minister Anagani Satya Prasad: ఎన్టీఆర్ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది.. 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి..
- ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు కల కల నిజం..
- చంద్రబాబు దూరదృష్టితో 16 నెలల్లో 3 లక్షల ఇళ్లు పూర్తి..
- ఎన్టీఆర్ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది..
- జగన్ రెడ్డి సెంటు పట్టా పేరుతో రూ.7,500 కోట్లు దోపిడీ..
- 2029 నాటికి ప్రతి అర్హుడికి పక్కా ఇల్లు లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anagani Satya Prasad: ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే ఎన్టీఆర్ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్ల 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి పేదలకు అందిస్తున్నాం అన్నారు.. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈ రోజు పేదల సొంతింటి కల సాకారం అవుతున్న చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు.. ఆర్థిక ఇబ్బందులున్నా ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా ఈ లక్ష్యాన్ని సాధించామని మంత్రి గుర్తుచేశారు. 2014-19లో పట్టణాల్లో సెంటున్నర, గ్రామాలలో 2 సెంట్లు ఇచ్చి పేదల పెన్నిదిగా టీడీపీ పనిచేసిందని చెప్పారు. కానీ, వైఎస్ జగన్ రెడ్డి దాన్ని సెంటుకు కుదించి, పేదల ద్రోహిగా మారాడని ఆరోపించారు.
Read Also: ‘The Girlfriend’ : ‘ది గర్ల్ఫ్రెండ్’ సక్సెస్ పార్టీకి టైమ్, ప్లేస్ ఫిక్స్!
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
టీడీపీ ప్రభుత్వం 12 లక్షల గృహాలను పూర్తి చేసి పేదలకు అందించిందని గుర్తు చేశారు మంత్రి అనగాని.. గతంలో, జగన్ రెడ్డి మాట్లాడుతూ “ఇళ్లు కాదు, ఊళ్లు నిర్మిస్తాం”, కానీ రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలతో ఇళ్లు పూర్తిచేసిన తర్వాత చేతులు దులుపుకున్నాడని మంత్రి ఆరోపించారు. సొంత స్థలం లేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల సాయం అందిస్తున్నదని తెలిపారు. 2029 నాటికి ప్రతి అర్హుడికి పక్కా ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. వైఎస్ జగన్ సెంటు పట్టా పేరుతో రూ.7,500 కోట్లు దోచుకున్నారని, టీడీపీ పూర్తి చేసిన ఇళ్లను కూడా పంచకుండా, పేదలను అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!