ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. ఈ సమయంలో ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోవడంతో… సైబర్ నేరగాలు కూడా చెలరేగిపోతున్నారు.. కొందరు కేటుగాళ్లు.. ఫోన్లు చేసి.. ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, ఖాతా నెంబర్లు, పాస్వర్డ్లు, ఓటీపీలు తెలుసుకుని.. ఖాతాల్లో ఉన్న సొమ్ము మొత్తం ఊడ్చేస్తున్నారు.. మరోవైపు.. ఏదో బ్యాంకు పేరుతో ఓ లింక్ పంపి.. ట్రాప్ చేస్తున్నారు.. లోక్ కావాలంటే… ఈ లింక్ క్లిక్ చేయండి.. ఈజీగా లోన్ పొందండి.. లాంటి మెసేజ్లు పెట్టి ఓ లింక్ అటాచ్ చేస్తున్నారు.. […]
మాన్సాస్ ట్రస్టుకూ, సింహాచలం దేవస్థానానికి చైర్మన్గా టిడిపి మాజీ మంత్రి అశోక్గజపతి రాజు స్థానంలో ఆయన అన్న కుమార్తె సంచైతను నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. అశోక్ గజపతిని మళ్లీ నియమించాలని ఆదేశించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు ఉత్తర్వులు తమకింకా అందలేదని దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెబుతున్నారు. మరోవైపున తెలుగుదేశం నాయకులు ఇది ప్రజాస్వామ్య విజయమనీ, ప్రభుత్వానికి చెంపపెట్టు అని […]
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ… ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఇవాళ్టితో స్కూళ్లకు వేసవి సెలవులు ముగియగా.. రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కావాల్సిఉంది.. విద్యార్థులు స్కూళ్లకు రారు కానీ, ఉపాధ్యాయులు స్కూళ్లకు హాజరు కావాల్సి ఉంది.. కానీ, ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రభుత్వం వేసవి సెలవులను పొడిగించింది.. అన్ని స్కూళ్లు, డైట్ కాలేజీలకు జూన్ 20వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ […]
కాంగ్రెస్, బీజేపీ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారు.. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. నకిరేకల్లో నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో కడుతున్న ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇచ్చిందా..? అని ప్రశ్నించారు.. కానీ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ప్రగతి పథంలో నడిపిస్తున్న నాయకుడు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అని ప్రశ్నించారు.. ఈనాడు తెలంగాణ లో […]
డీఎస్సీ 2008 అభ్యర్థులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. టీడీపీ హయాంలో డీఎస్సీ అభ్యర్థులను పట్టించుకోలేదని.. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.. డీఎస్సీ-2008 సమస్య 13 ఏళ్లుగా పెండింగ్లో ఉందన్న ఆయన.. అభ్యర్థుల భవితవ్యంపై సీఎం వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో వ్యవహరించారని పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్ధులను ఎస్జీటీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.. త్వరలోనే డీఎస్సీ అభ్యర్ధులకు పోస్టింగ్లు ఇస్తామని.. త్వరలోనే దీనికి సంబంధించిన జీవో విడుదల […]
బీహార్ రాజకీయాలు మరోసారి హాట్టాపిక్గా మారిపోయాయి… గత అసెంబ్లీ ఎన్నికల్లో హడావిడి చేసిన యువ నేత చిరాగ్ పాశ్వాన్కు గట్టి షాక్ తగిలింది.. లోక్ జనశక్తి పార్టీలో తిరుగుబాటు రావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.. చిరాగ్ పాశ్వాన్ బాబాయ్, ఎంపీ పశుపతి పరాస్ నేతృత్వంలో ఎల్జేపీలో తిరుగుబాటు చేశారు.. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు… లోక్సభలో ఎల్జేపీ నేతగా పరాస్ను ఎన్నుకున్నట్లు ఇప్పటికే స్పీకర్ ఓం బిర్లాను స్వయంగా కలసి తెలియజేయగా.. పరాస్ను ఎల్జేపీ […]
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో రెండో ఏడాది కూడా ఇంటర్ పరీక్షలు రద్దు చేసింది ప్రభుత్వం… మొదట్లో ఫస్టియర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. తాజాగా అధికారులతో సమీక్ష నిర్వహించిన సెకండియర్ ఫలితాలను సైతం రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఇక, ఏ ప్రతిపాదికన విద్యార్థులను పాస్ చేయాలన్న దానిపై ఇంటర్ బోర్డు కసరత్తు పూర్తి చేసింది.. వారం రోజుల్లో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల కానున్నట్టు తెలిపారు ఇంటర్ బోర్డు […]