కాంగ్రెస్, బీజేపీ నేతలకు ప్రజలే బుద్ధి చెప్పాలి.. కేటీఆర్ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్, బీజేపీ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారు.. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. నకిరేకల్లో నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో కడుతున్న ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇచ్చిందా..? అని ప్రశ్నించారు.. కానీ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ప్రగతి పథంలో నడిపిస్తున్న నాయకుడు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అని ప్రశ్నించారు.. ఈనాడు తెలంగాణ లో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు.. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు బంధు పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్న ఆయన.. ఈ వానాకాలం సీజన్లో కూడా రైతు బంధు సాయం చేస్తున్నారు సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు.. ఇప్పటి వరకు అన్ని సీజన్లలో కలిపి 50 వేల కోట్ల రూపాయలను రైతు బంధు పథకం కింద రైతులకు అందించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించిన ఆయన.. సమైక్యాంధ్ర పాలనలో రైతులు అనేక అవస్థలు పడ్డారు.. కానీ, ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అల్ టైం హై దిగుబడులు సాధించి గొప్ప పెరును సంపాందించింది.. తెలంగాణకే నల్గొండ జిల్లా దిక్కూచిగా నిలిచిందని తెలిపారు..
ఇక, ఎఫ్సీఐ లెక్కల్లో దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్నరాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సాధించిందన్నారు మంత్రి కేటీఆర్.. గతంలో 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పండించేవారు.. ఇప్పుడు కోటి ఆరు లక్షల ఎకరాల్లో వరి పండుతుంది.. ఇది మన ఘనత అన్నారు.. రైతుకు పెట్టుబడి సాయం చేయాలని దేశంలో ఏ నాయకునికి కనీస ఆలోచన రాలేదన్న కేటీఆర్.. సీఎం కేసీఆర్ నాయకత్వం లో వ్యవసాయం పండుగలా మారిందని.. రైతులు సంఘటితం కావాలని, బాగు పడాలని రైతు వేదికలను నిర్మించారని.. రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. పండించిన ప్రతి గింజను కొంటున్న ప్రభుత్వం ఏదన్నా ఉందా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ రాష్ట్రం ఒక్కటే రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసిందని.. ఇది అంతా గమనించాలన్నారు.. ఇక, నకేరేకల్ లో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్న ఆయన.. మున్సిపల్, ఎమ్మార్వో కార్యాలయల నిర్మాణానికి కృషి చేస్తాం.. ఉదయ సముద్రం ప్రాజెక్ట్ పెండింగ్ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు.
Also Read
- TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
- OTR: టీఆర్ఎస్ పేరు చుట్టూ కొత్త వివాదాలు..తెలంగాణ రక్షణసేన పేరుకు ఈసీ బ్రేక్స్
- OTR: ఉమ్మడి నల్గొండ పరిధిలోకి అడుగుపెట్టని బీఆర్ఎస్ అగ్రనేతలు...అసలు కారణాలేంటి ?
- CM Revanth Reddy : మిడ్జిల్ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం.. నాడు మీరు నాటిన మొక్కే.. నేడు సీఎంగా..
- Tags
- bjp
- congress
- ktr
- Minister KTR
- Nakrekal
తాజావార్తలు
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
-
OTR : అనంతపురం జిల్లా వైసీపీలో తోపుదుర్తి ఒంటరి అయ్యారా?
-
Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
-
TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..