ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక..! ఈ ఐదు మరవద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. ఈ సమయంలో ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోవడంతో… సైబర్ నేరగాలు కూడా చెలరేగిపోతున్నారు.. కొందరు కేటుగాళ్లు.. ఫోన్లు చేసి.. ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, ఖాతా నెంబర్లు, పాస్వర్డ్లు, ఓటీపీలు తెలుసుకుని.. ఖాతాల్లో ఉన్న సొమ్ము మొత్తం ఊడ్చేస్తున్నారు.. మరోవైపు.. ఏదో బ్యాంకు పేరుతో ఓ లింక్ పంపి.. ట్రాప్ చేస్తున్నారు.. లోక్ కావాలంటే… ఈ లింక్ క్లిక్ చేయండి.. ఈజీగా లోన్ పొందండి.. లాంటి మెసేజ్లు పెట్టి ఓ లింక్ అటాచ్ చేస్తున్నారు.. పొరపాటున ఆ లింక్ క్లిక్ చేస్తే.. ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తం మాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బ్యాంకులు కూడా జాగ్రత్తగా ఉండాలని తమ ఖాతాదారులుకు సూచిస్తున్నాయి. తాజాగా ఈ సైబర్ మోసల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులను కోరింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ఎంచుకున్న వినియోగదారులు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి సూచించింది అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థ ఎస్బీఐ.
సోషల్ మీడియా వేదకగా.. తమ ఖాతాదారులన అలర్ట్ చేసింది ఎస్బీఐ.. విలువైన సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దని కోరింది.. మా ఖాతాదారులకు గమనిక మోసగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండండి, ఆన్లైన్లో ఎటువంటి సున్నితమైన వివరాలను పంచుకోవద్దు, తెలియని వారు చెబితే ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దు అని సలహా ఇచ్చింది.. ఇక, ముఖ్యంగా ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దంటూ.. ఐదు పాయింట్స్ సూచించింది.. అందులో.. పుట్టిన తేదీ డెబిట్ కార్డ్ నెంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్, డెబిట్ కార్డు పిన్, సీవీవీ, ఓటీపీ వంటి వివరాలను షేర్ చేసుకోవద్దు అని సలహా ఇచ్చింది.. ఇక, ఎస్బీఐ, ఆర్బీఐ, ప్రభుత్వ కార్యాలయలు, పోలీసు, కెవైసి అథారిటీ పేరుతో కాల్ చేస్తున్న మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని కోరింది.. మరోవైపు.. ప్లే స్టోర్ కాకుండా, టెలిఫోన్ కాల్స్ లేదా ఈ-మెయిల్ ఆధారంగా ఏ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేయవద్దని హెచ్చరించింది. అలాగే, తెలియని మూలాల నుంచి వచ్చిన మెయిల్స్లోని అటాచ్మెంట్లపై క్లిక్ చేయవద్దని పేర్కొంది. అలాగే, ఈ-మెయిల్ లు, ఎస్ఎంఎస్, ఇతర సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆకర్షణీయమైన, అపరిచిత ఆఫర్లకు స్పందించవద్దని తన ఖాతాదారులకు సూచించింది ఎస్బీఐ.
Also Read
- Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
- Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..