ఈ సారి అమరావతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ సచివాలయం వెనక ప్రాంతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది కూటమి సర్కార్..
రోజువారి ప్రభుత్వ పరిపాలనలో ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి నారా లోకేష్.. విజయవాడ నోవాటెల్ హోటల్ లో ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ – ఆంధ్రప్రదేశ్ సదస్సులో సీఎం నారా చంద్రబాబు నాయుడతో కలిసి పాల్గొన్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఏఐ అండ్ డేటా సెంటర్లపై జరిగిన చర్చలో మాట్లాడుతూ.. డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్…
రాజధాని ప్రాంతం అమరావతి రైతులకు తీపికబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రైతులకు సంబంధించిన 11వ ఏడాది కౌలు సొమ్మును విడుదల చేసింది సర్కార్.. 163.67 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు ఓ దళిత యువకుడిపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై స్పందించారు మంత్రి సుభాష్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మొన్న అమలాపురం ఘటనలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది డబ్బులు తీసుకున్నారు.. ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు దాడి చేశారని తెలిపారు.. అయితే, దాడి చేసినవారు. నా అనుచరులు అని వైసీపీ బ్యాచ్.. నా పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
పల్నాడు జిల్లాలో దారుణ ఘటన జరిగింది.. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు అయినా తండ్రీకొడుకులను దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా సంతమగులూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం చాలా ఏళ్లుగా బెంగుళూరులో స్థిరపడ్డారు.. అయితే, కొడుకు ప్రశాంత్ రెడ్డికి, తండ్రి వీరస్వామి రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల్లో భాగస్వాములతో వివాదాలు వచ్చాయి..
నేను రౌడీనే.. అందుకే నా ఊరు బాగుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అందరూ మున్సిపల్ ఎన్నికలలో ఓడిపోతే.. నన్ను ఒక్కడినే గెలిపించారని గుర్తుచేశారు జేసీ.. ఇక, తాడిపత్రి ప్రజలు నాకు దేవుళ్లు.. వాళ్ల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అన్నారు..
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర సహా.. దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. ఈ సమయంలో ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలో మీటర్లు వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది..
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది జలశక్తి శాఖ.. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య ఈరోజు జలశక్తి మంత్రిత్వ శాఖలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల జలవనరుల మంత్రులు, రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరయ్యారు.. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నీటి నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ…
ముతుకుమిల్లి శ్రీభరత్..... తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ. ఉద్దండులు గెలిచిన విశాఖ గడ్డ మీద రికార్డులు బ్రేక్ చేసిన నాయకుడు. రాజకీయ వారసత్వ పునాదుల ఆధారంగా 2019లో తొలిసారి పోటీ చేసిన శ్రీభరత్కు షాకింగ్ ఎక్స్పీరియన్స్ మిగిల్చారు విశాఖ ఓటర్లు. నాడు వైసీపీ ప్రభంజనం ఒకవైపు, జనసేన ఓట్లు చీలిక మరోకవైపు తీవ్ర ప్రభావం చూపి ఫస్ట్ అటెంప్ట్లో ఓడిపోయారాయన. అప్పట్లో... ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ గెలుపుకంటే... భరత్ ఓటమిపైనే ఎక్కువ విశ్లేషణలు నడిచాయి. అదంతా గతం. ఇక 2024 నాటికి…