Sugali Preethi Case: పవన్ కల్యాణ్పై మరోసారి సుగాలి ప్రీతి తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఓజీ డైలాగ్ చెప్పి మరి..!
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు..
- సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగింతపై ప్రకటన ఏది..? అని ప్రశ్న..
- సీఎం, డిప్యూ సీఎం, లోకేష్ పై మండిపడ్డ పార్వతి..
- ఓజీ సినిమా డైలాగ్ చెప్పి మరి...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugali Preethi Case: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సుగాలి ప్రీతి తల్లి.. సుగాలి ప్రీతిబాయికి న్యాయం చేయాలని మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు తల్లి పార్వతి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2017 నుండి నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం పోరాటం చేస్తున్నా.. 8 ఏళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూనే ఉన్నాను.. విజయవాడ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ప్రశ్నించాను.. ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగలేదు అన్నారు.. కూటమి ప్రభుత్వంలో హోంమంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు తన కేసును సీబిఐకి అప్పగించినట్లు ప్రకటన చేయడం లేదు.. దీనిపై స్పష్టత ఇవ్వలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు..
Also Read
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశామని చంద్రబాబు, పవన్ కల్యా్ణ్ గొప్పలు చెబుతున్నారు.. తమ సమస్యలను పట్టించుకోవడం లేదు. అసెంబ్లీలో ప్రస్తవిస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. పవన్ కల్యాణ్ ఒక్కసారైనా అసెంబ్లీలో ఈ విషయం మాట్లాడారా..? అని నిలదీశారు పార్వతి.. అసలు, పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు.. పవన్ తన పై, తన కులంపై, తన కుటుంబంపై వారి నాయకుల చేత అనేక ఆరోపణలు చేయించారు.. జనసేన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు తమపై అనేక ఆరోపణలు చేసి కించపరిచే విధంగా మాట్లాడారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం, జనసేన పార్టీ ఎమ్మెల్యే గాద వెంకటేశ్వర్లు అనేక ఆరోపణలు చేశారు. తమను కించపరిచే విధంగా తమ పై అనేక కామెంట్లు చేశారు అని మండిపడ్డారు..
ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ అనేక హామీలు ఇచ్చారు. కానీ, అధికారంలో వచ్చిన తరువాత తమను పట్టించుకోవడం లేదన్నారు పార్వతి.. సుగాలి ప్రీతి కేసులో తమకు అన్యాయం జరుగుతుందని నమ్మించి పవన్ కల్యాణ్ నమ్మక ద్రోహం చేశారన్న ఆమె.. న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు గిరిజన కుటుంబంపై అనేక ఆరోపణలు చేశారు అని ఫైర్ అయ్యారు.. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా తమకు కలిసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు పార్వతి.. హైకోర్టులో తాము పిటిషన్ వేశాం, తమకు న్యాయం కోసం వీల్ చైర్ యాత్రను నిర్వహించేందుకు హైకోర్టు ఆశ్రయించినట్టు పేర్కొన్నారు.. అయితే, ఓజీ సినిమాలో ఒక డైలాగ్ ఉంది.. “చాలా మంది చాలా చేస్తున్నారు.. ఉసురు తగులుతుంది అని..” నాకు న్యాయం జరగపోతే నా ఉసురు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ కు తగులుతుంది అంటూ శాపనార్థాలు పెట్టారు..
అన్ని పార్టీలను, అందరు నాయకులను స్వయంగా కలసి విన్నవిస్తా.. వైఎస్ షర్మిల కూడా స్పందించాలన్నారు పార్వతి.. నాకు జరిగిన అన్యాయంపై స్పందించిన వైసీపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె.. వీల్ చైర్ యాత్ర చేస్తానంటే అడ్డుకున్నారు.. చిత్తశుద్ధి ఉంటే పవన్ కల్యాణ్ వీల్ చైర్ యాత్రకు అనుమతి ఇప్పించాలని డిమాండ్ చేశారు.. 16వ తేదీ ప్రధాని మోడీ కర్నూలు వస్తున్నారు.. మోడీని కలసి విన్నవించే ప్రయత్నం చేస్తా… మోడీ అపాయింట్ మెంట్ ఇప్పించండి అని కోరారు.. మోడీని కలవడానికి అనుమతించకుంటే 13, 14, 15 తేదీలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తా.. కలెక్టరేట్ ముందు ఆందోళన చేయకుండా అడ్డుకుంటే ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి..
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!