మూడు కేసుల్లో దోషిగా అంగ్సాన్ సూకీ.. మరో నాలుగేళ్ల జైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మయన్మార్ కోర్టు నోబెల్ గ్రహీత అంగ్సాన్ సూకీని మూడు నేరారోపణలలో దోషిగా నిర్ధారించింది.. తాజా కేసులలో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుండి నిర్బంధంలో ఉన్నారు.. చట్టవిరుద్ధంగా దేశంలోకి వాకీటాకీలను దిగుమతి చేసుకోవడంతోపాటు, కోవిడ్ ఆంక్షలను ధిక్కరించిన కేసుల్లో కోర్టు ఆమెను దోషిగా తేల్చిందని న్యాయశాఖ అధికారి వెల్లడించారు.. అయితే, గత డిసెంబర్లో వివిధ నేరాలకు పాల్పడ్డారంటూ కోర్టు సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా.. ప్రభుత్వం ఆ శిక్షను రెండేళ్లకు తగ్గించింది.. కానీ, ఇప్పుడు మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.. కాగా, సూకీకి చెందిన నేషనల్ లీగ్ఫర్ డెమోక్రసీ పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన తరుణంలో 2021 ఫిబ్రవరిలో మిలటరీ.. సూకీతోపాటు పలువురు నేతలను నిర్బంధంలో ఉంచి అభియోగాలు మోపిన విషయం తెలిసిందే.
Read Also: ఎన్95 మాస్కు ఎన్నిసార్లైనా వాడొచ్చు..! కాకపోతే ఇలా చేయాలి..
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
అయితే, స్థానిక పర్యవేక్షణ బృందం ప్రకారం, జనరల్స్ అధికారాన్ని లాక్కోవడం విస్తృతమైన అసమ్మతిని ప్రేరేపించింది, భద్రతా దళాలు సామూహిక నిర్బంధాలు మరియు రక్తపాత అణిచివేతలతో అణచివేయడానికి ప్రయత్నించాయి, ఇందులో 1,400 కంటే ఎక్కువ మంది పౌరులు మరణించారు.. వాకీ-టాకీలను అక్రమంగా దిగుమతి చేసుకోవడం, కరోనావైరస్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి రెండు ఆరోపణలకు 76 ఏళ్ల అంగ్సాన్ సూకీ దోషిగా తేలిందని ఆమెపై ఇతర కేసులు కొనసాగుతాయని చెప్పారు. తిరుగుబాటు జరిగిన రోజున సైనికులు ఆమె ఇంటిపై దాడి చేసి, నిషిద్ధ సామగ్రిని కనుగొన్నారు.. అప్పుడే వాకీ-టాకీ ఆరోపణలు వచ్చాయి. కాగా, జుంటా పాలనలో, మయన్మార్లోని అతిపెద్ద నగరమైన యాంగాన్లోని తన కుటుంబ భవనంలో సూకీ చాలా కాలం పాటు గృహనిర్బంధంలో గడిపారు. ఈరోజు, ఆమె రాజధానిలోని ఒక అజ్ఞాత ప్రదేశానికి పరిమితమైంది, బయటి ప్రపంచానికి ఆమెకు లింక్ లేకుండా పోయింది.. సోమవారం నాటి కేసులతో పాటు, ఆమె అనేక అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.. ప్రతీ కేసుకు 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్నారు.. అవన్నీ రుజువైతే ఆమెకు 100 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నమాట.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!