మయన్మార్ కోర్టు నోబెల్ గ్రహీత అంగ్సాన్ సూకీని మూడు నేరారోపణలలో దోషిగా నిర్ధారించింది.. తాజా కేసులలో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుండి నిర్బంధంలో ఉన్నారు.. చట్టవిరుద్ధంగా దేశంలోకి వాకీటాకీలను దిగుమతి చేసుకోవడంతోపాటు, కోవిడ్ ఆంక్షలను ధిక్కరించిన కేసుల్లో కోర్టు ఆమెను దోషిగా తేల్చిందని న్యాయశాఖ అధికారి వెల్లడించారు.. అయితే, గత డిసెంబర్లో వివిధ నేరాలకు పాల్పడ్డారంటూ కోర్టు సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా.. ప్రభుత్వం ఆ శిక్షను రెండేళ్లకు తగ్గించింది.. కానీ, ఇప్పుడు మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.. కాగా, సూకీకి చెందిన నేషనల్ లీగ్ఫర్ డెమోక్రసీ పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన తరుణంలో 2021 ఫిబ్రవరిలో మిలటరీ.. సూకీతోపాటు పలువురు నేతలను నిర్బంధంలో ఉంచి అభియోగాలు మోపిన విషయం తెలిసిందే.
Read Also: ఎన్95 మాస్కు ఎన్నిసార్లైనా వాడొచ్చు..! కాకపోతే ఇలా చేయాలి..
అయితే, స్థానిక పర్యవేక్షణ బృందం ప్రకారం, జనరల్స్ అధికారాన్ని లాక్కోవడం విస్తృతమైన అసమ్మతిని ప్రేరేపించింది, భద్రతా దళాలు సామూహిక నిర్బంధాలు మరియు రక్తపాత అణిచివేతలతో అణచివేయడానికి ప్రయత్నించాయి, ఇందులో 1,400 కంటే ఎక్కువ మంది పౌరులు మరణించారు.. వాకీ-టాకీలను అక్రమంగా దిగుమతి చేసుకోవడం, కరోనావైరస్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి రెండు ఆరోపణలకు 76 ఏళ్ల అంగ్సాన్ సూకీ దోషిగా తేలిందని ఆమెపై ఇతర కేసులు కొనసాగుతాయని చెప్పారు. తిరుగుబాటు జరిగిన రోజున సైనికులు ఆమె ఇంటిపై దాడి చేసి, నిషిద్ధ సామగ్రిని కనుగొన్నారు.. అప్పుడే వాకీ-టాకీ ఆరోపణలు వచ్చాయి. కాగా, జుంటా పాలనలో, మయన్మార్లోని అతిపెద్ద నగరమైన యాంగాన్లోని తన కుటుంబ భవనంలో సూకీ చాలా కాలం పాటు గృహనిర్బంధంలో గడిపారు. ఈరోజు, ఆమె రాజధానిలోని ఒక అజ్ఞాత ప్రదేశానికి పరిమితమైంది, బయటి ప్రపంచానికి ఆమెకు లింక్ లేకుండా పోయింది.. సోమవారం నాటి కేసులతో పాటు, ఆమె అనేక అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.. ప్రతీ కేసుకు 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్నారు.. అవన్నీ రుజువైతే ఆమెకు 100 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నమాట.