గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్వల్ప ఓట్ల మోజార్టీతో విజయం సాధించారు.. ఈ రోజు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శాంక్విలిమ్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి 650 ఓట్ల తేడాలో గెలుపొందారు సావంత్.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ధర్మేష్ సగ్లానీపై ఆయన విక్టరీ కొట్టారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. గోవాలో మరోసారి తాము (బీజేపీ) సర్కార్ ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయం ఘనత ప్రతీ కార్యకర్తకు […]
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీ.. దేశ రాజధాని ఢిల్లీకే పరిమితమైన ఆ పార్టీ.. మరో రాష్ట్రంలో గ్రాండ్ విక్టరీ కొట్టింది… ఇక, ఆప్ ప్రభంజనం ముందు.. సీఎం, మాజీ సీఎంలు.. ఏకంగా ఐదుసార్లు పంజాబ్ సీఎంగా సేవలందించిన నేతకు కూడా ఓటమితప్పలేదు.. మాజీ సీఎం, కురువృద్ధుడు ప్రకాశ్ సింగ్ బాదల్ను కూడా మట్టికరిపించింది ఆమ్ ఆద్మీ పార్టీ.. 94 ఏళ్ల బాదల్.. ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల బరిలో నిలిచిన అత్యధిక […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమైంది… ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చర్చనుప్రారంభించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో కూడా ఆర్థిక ప్రగతి బాగానే ఉందన్నారు.. కరోనా సమయంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు కూడా అందించామని.. పేదరికాన్ని తగ్గించాలంటే విద్యతోనే సాధ్యం.. అందుకే విద్యకే అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకం కూడా లేదంటే […]
దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. మరో రాష్ట్రం అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధం అయ్యింది… 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్లో ఇప్పటికే 90కి పైగా స్థానాల్లో విజయం ఖాయం చేసుకుంది… మాజీ సీఎం అమరీందర్సింగ్, ప్రస్తుత సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ సిద్ధూ.. ఇలా అంతా ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఇక, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్… పెద్ద పెద్ద […]
మెడికల్ విద్య చదవాలనుకుంటున్న వారికి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. అండర్ గ్రాడ్యుయేషన్ నీట్కు గరిష్ట వయోపరిమితిని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు అండర్ గ్రాడ్యుయేషన్ నీట్ రాసేందుకు జనరల్ కేటగిరి అభ్యర్థులకు 25 ఏళ్లు, రిజర్వేషన్ కేటగిరి వారికి 30 ఏళ్ల వయోపరిమితి నిబంధన ఉండగా.. తాజా నిర్ణయంతో గరిష్ట వయోపరిమితి నిబంధన తొలగిపోయినట్టు అయ్యింది.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ […]
కార్వీ చైర్మన్ పార్థసారథికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది.. కార్వీ సంస్థకు చెందిన రూ.1,984 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈడీ… కార్వీ సంస్థ ఎండీ పార్థసారథికి చెందిన షేర్లతో పాటు భూములు, భవనాలను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు ఇచ్చింది.. వీటిలో రూ. 213 కోట్లు విలువైన భూములు, రూ. 438 కోట్ల విలువైన షేర్లు, రూ.1,280 కోట్ల విలువ చేసే ఇతర ఆస్తులును ఉన్నట్లు ఈడీ […]
జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది పార్టీ.. ఇవాళ ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీలతో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల భేటీ అయ్యారు.. సభకు వచ్చే వారి రవాణా, పార్కింగ్ ఏర్పాట్ల పైనే ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సూచించారు.. సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.. అయితే, జనసేన ఆవిర్భావ సభకు ప్రభుత్వం అనుమతి వస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం చేసిన జనసేన పార్టీ నేతలు.. అవసరం అయితే, హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం […]
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు చేతులెత్తేసి.. తాను నాటోలో చేరబోను.. యుద్ధం ఆపండి.. అంటూ విజ్ఞప్తి చేసినా.. ఇంకా.. రష్యా మాత్రం యుద్ధం ఆపలేదు.. మరోవైపు.. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపు కోసం చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా రేపు ఇండియాకు చివరి విమానాలు రాబోతున్నాయి.. సుమీలో చిక్కుకున్న భారతీయులను తరలింపు ప్రక్రియ పూర్తి చేశారు.. సుమీ నుంచి […]
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, ఆ వివాదాల పరిష్కారానికి కొన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం మరోసారి భేటీ కానుంది… రేపు ఉదయం వర్చువల్ విధానంలో కమిటీ సభ్యులు సమావేశం కాబోతున్నారు.. తెలంగాణ, ఏపీ మధ్య నీటి కేటాయింపులపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ సాగనుంది.. ఆ నీటిని వినియోగించుకోవద్దు, నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి […]
కాంగ్రెస్ పార్టీకి జాతీయ మరియు సహజ ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీయే… ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. కోట్లాది మంది ప్రజల ఆశాకిరణమం.. భవిష్యత్లో ఆయన ప్రధానమంత్రి వంటి ఉన్నత పాత్రను పోషించగలరంటూ ఆప్ నేత, పంజాబ్ ఎన్నికల సహ ఇన్ఛార్జ్ రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారిపోయాయి.. పంజాబ్లో ఆమ్ […]