మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభాక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్కు నోటీసులు జారీ చేశారు ముంబై పోలీసులు.. అక్రమంగా ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై ఆదివారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కోరుతూ ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు దేవేంద్ర ఫడ్నవీస్కు నోటీసులు జారీ చేశారు.. ఆదివారం ఉదయం 11 గంటలకు బీకేసీ సైబర్ పోలీస్ స్టేషన్కు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న […]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది… ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విమర్శలు ఓ రేంజ్లో జరుగుతున్నాయి… తాజాగా, ఆ విషయంపై స్పందించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. సీఎం వైఎస్ జగన్ సొంత బాబాయి (వైఎస్ వివేకానందరెడ్డి)ని ఎవరు చంపారో క్లారిటీ వచ్చిందన్నారు.. సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి ప్రథమ ముద్దాయిగా.. జగన్ కూడా అందులో భాగస్వామిగా తేలిందని వ్యాఖ్యానించిన ఆయన.. వైఎస్ వివేకా […]
తెలంగాణలో డ్వాక్రా మహిళలకు త్వరలోనే అభయ హస్తం నిధులు వాపస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం… కొద్ది రోజుల్లోనే మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అసెంబ్లీలో సమావేశమైన మంత్రులు హరీష్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయ హస్తం నిధులను ఆ మహిళలకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల మంది డ్వాక్రా […]
ఐపీఎల్లో రాయల్ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ 2021 ముగిసిన తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, ఐపీఎల్ 2022 సీజన్కు కెప్టెన్ ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది.. ఓ దశలో మళ్లీ విరాట్ కోహ్లీకే బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ కూడా సాగింది.. అయితే, ఆర్సీబీ కొత్త కెప్టెన్ ఎవరు…? అనే ఉత్కంఠకు తెరపడింది.. సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఫఫ్ డుప్లెసిస్కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు […]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే తగిలింది.. పంజాబ్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఏ మాత్రం గట్టిపోటీ ఇవ్వలేని పరిస్థితి.. దిగ్గజాలు సైతం ఓటమిపాలయ్యారు. ఇక, మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా.. కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. కర్ణాటకకు చెందిన కీలక నేత, ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం.. పార్టీకి గుడ్బై చెప్పేశారు.. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. తాను వెంటనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు లేఖలో […]
తెలంగాణలో ఒంటిపూట బడులకు సమయం ఆసన్నమైంది.. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.. ఇక, ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ.. ఒంటిపూట బడులను ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిగంటలుగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది… ఇక, మే 20వ తేదీన 10వ తరగతులు ముగియనున్నాయి.. అంటే, అదే రోజు స్కూళ్లకు చివరి పనిదినం కానుంది. ఇక, […]
భారత వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి ఐసీసీ మహిళల ప్రపంచకప్లో సరికొత్త రికార్డు సృష్టించారు.. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా ఇవాళ వెస్టిండీస్-భారత్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో ఝులన్ గోస్వామి చరిత్ర సృష్టించారు.. మహిళల ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించారు.. వెస్టిండీస్ బ్యాటర్ అనిసా మహ్మద్ను ఔట్ చేయడంతో ఈ రికార్డు కెక్కారు గోస్వామి.. ఇప్పటి వరకు అత్యధిక వికెట్ల రికార్డు ఆస్ట్రేలియా బౌలర్ లిన్ ఫుల్స్టన్ […]
లఖింపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆశిశ్ మిశ్రా కాన్వాయ్లోని ఓ కారు దూసుకెళ్లిన ఘటనలో అక్కడికక్కడే నలుగురు రైతులు మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇలాంటి ఘటనే ఇప్పుడు ఒడిశాలో కలకలం రేపుతోంది.. ఒడిశా ఖుర్దాలో ప్రజలపైకి దూసుకెళ్లింది ఎమ్మెల్యే ప్రశాంత్జగ్దేవ్కారు… ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 25 మందికి పైగా గాయాలపాలైనట్టు తెలిపారు. […]
ఈపీఎఫ్ ఖాతాదారులకు షాక్ తప్పదా..? వడ్డీ రేట్లను తగ్గించి ఖాతాదారులు ఊహించని షాక్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది… జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 40 ఏళ్ల తర్వాత ఈపీఎఫ్వోపై ఇచ్చే వడ్డీ రేట్లను కోతపెట్టేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది.. సెంట్రల్ బోర్డ్ ఆఫర్ ట్రస్ట్రీ (సీబీటీ) సభ్యులు 2021 -2022 సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు వచ్చే వడ్డీరేట్లపై భేటీ అయ్యారు.. ఈ సమావేశంలో ఖాతాదారులకు 8.1 శాతం వడ్డీ […]
ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఇవాళ వెల్లడించారు.. ఈ ఫలితాల్లో ఎగ్జిట్పోల్స్ అంచనాలకు మించి నరేంద్ర మోడీ-అమిత్షా ద్వయం ప్రభంజనాన్ని సృష్టించింది.. పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో విజయాన్ని సాధించింది.. పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. ఇక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్లో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది భారతీయ జనతా పార్టీ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మాత్రం ఎక్కడా పుంజుకున్నది లేదు.. పైగా తన ఓటమి పరంపరను కొనసాగించిందనే చెప్పాలి.. […]