Electricity Charges Hike: ఏపీలో భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు.. ఇలా వడ్డింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలపై క్రమంగా భారం మోపుతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు… పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు… ఇలా అవకాశం ఉన్న ప్రతీది వడ్డించేస్తున్నారు.. ఇప్పటికే తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ఏపీలో విద్యుత్ ఛార్జీల మోత మోగింది. కరెంట్ ఛార్జీలను పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్ణయం తీసుకుంది. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్లను తీసుకొచ్చింది ఈఆర్సీ.. వాటి ప్రకారం.. 30 యూనిట్ల వరకూ ఉన్న స్లాబ్కు 1.90 రూపాయల చొప్పున వసూలు చేయనుండగా.. ఈ స్లాబ్లో యూనిట్కు 45 పైసల చొప్పున పెంచారు. ఇక, 31-75 యూనిట్ల వరకూ ఉన్న స్లాబ్కు యూనిట్కు రూ.3 వసూలు చేస్తారు.. అంటే ఈ స్లాబ్లో యూనిట్కు 91 పైసల చొప్పున వడ్డించనున్నారు.. మూడో స్లాబ్ అయిన 76 -125 యూనిట్ల మధ్య యూనిట్ ధర రూ.4.50 చేశారు. ఈ స్లాబ్లో రూ.1.40 చొప్పున ప్రతి యూనిట్పై అదనంగా చెల్లించాలి..
Read Also: DA Hike: ఉద్యోగులకు గుడ్న్యూస్.. కేబినెట్ కీలక నిర్ణయం
Also Read
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ఇక, నాల్గో స్లాబ్ విషయానికి వస్తే 126-225 వరకూ ఉన్న ఈ స్లాబ్లో యూనిట్ ధర రూ.6 పెంచేందుకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. అంటే, ఒక్కో యూనిట్కు రూ.1.57 చొప్పున అదనంగా వసూలు చేస్తారు.. ఆ తర్వాత స్లాబ్లో 226-400 యూనిట్ల వరకూ ప్రతీ యూనిట్కు రూ.8.75 చొప్పున వసూలు చేయనున్నారు.. అంటే, ఈ స్లాబ్లో ప్రతీ యూనిట్కు అదనంగా రూ.1.16 చొప్పున పెరగనుంది. ఇక, 400 ఆపైన యూనిట్లకు రూ.9.75 చొప్పున పెంచేందుకు అనుమతి వచ్చింది.. ఈ స్లాబ్లో ప్రతీ యూనిట్కు అదనంగా 55 పైసల చొప్పున పెంచేశారు.. ఏపీ ఈఆర్సీ తాజాగా పెంచిన విద్యుత్ ఛార్జీలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ నుంచి అమల్లోకి రాబోతున్నాయి..
తాజావార్తలు
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి