హైదరాబాద్ కాటేదాన్లో అదృశ్యమైన సాయిప్రియ అనే యువతి.. చివరకు శవమై కనిపించింది… ఇంటి నుంచి వెళ్లిపోయిందనుకున్నారు.. ఎక్కడో ప్రాణాలతోనే ఉంటుంది అనుకున్నారు.. అంతేకాదు.. ఆమె మొబైల్ నుంచి.. ఆమె తండ్రికి వచ్చిన మెసేజ్లను బట్టి చూస్తే.. నేను ప్రేమించిన వ్యక్తిని నువ్వు కాదన్నావు.. అందుకే లేచిపోతున్నానంటూ సందేశాలు పంపారు.. దీంతో, ఆ యువతి ఎక్కడో ఉండే ఉంటుంది అనే నమ్మకంతో ఉన్నారు.. కానీ, ఆమె ప్రాణాలే తీశాడు.. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడే ఆమెను దారుణంగా […]
ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వై విద్యాసాగర్పై హైదరాబాద్లో కేసు నమోదైంది… తిరుపతికి చెందిన వై. విద్యాసాగర్పై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.. కమలానగర్కు చెందిన హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ నుంచి రూ. 20 వేలు తీసుకున్న ఆయన… తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తానని నమ్మించారని.. ఇందుకోసం రూ. 20 వేలు గూగుల్ పే ద్వారా ట్రాన్స్ పర్ చేసిన తర్వాత.. ఎన్నిసార్లు ఫోన్ […]
అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్… అమరావతి దేవతల రాజధాని కాదు దెయ్యాల రాజధానిగా పేర్కొన్న ఆయన.. మూడు రాజధానులపై కొత్త బిల్లుతో వస్తాం అన్నారు.. వచ్చే సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు అవకాశం ఉండొచ్చు అని సంకేతాలిచ్చారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.. మరోవైపు.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మంత్రి… హైదరాబాద్ అభివృద్ధి నేనే శిల్పినని చంద్రబాబు చెప్పుకోవడం చూస్తే కులీకుతుబ్ షా ఉరేసుకుంటాడని సెటైర్లు వేసిన […]
ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయనకు ఒక విజ్ఞప్తి కూడా చేశారు.. వలసవాద పాలనా చిహ్నాలను చెరిపేస్తున్న మోడీ అభినందనీయులని పేర్కొన్న పవన్.. కర్తవ్య పథ్ అనేది భారతీయత ఉట్టిపడే నామ ధేయం.. బ్రిటీష్ పాలనలో కింగ్స్ వే .. ఆ తరవాత రాజ్ పథ్ గా మారి ఇప్పుడు కర్తవ్య పథ్ గా అవతరించింది.. బ్రిటీష్ రాచరిక పాలన అంతరించి 75 ఏళ్ళు గడిచినా వారి వలసవాద పాలనకు […]
అమరావతి రైతుల మహా పాదయాత్రకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రేదశ్ హైకోర్టు.. అయితే, కొన్ని పరిమిత ఆంక్షలతో మహా పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… పాదయాత్రకు అనుమతి కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి.. హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేసింది.. 600 మంది పాదయాత్రలో పాల్గొనేలా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది… వాదనలు విన్న హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇవ్వడగా.. పాదయాత్రలో పాల్గొనే వారికి ఐడీ కార్డులివ్వాలని సూచించింది.. ఇక, పాదయాత్ర ముగింపు రోజు మహాసభకు ముందుగానే అనుమతి […]
తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య మూడు.. ఆ పార్టీ శ్రేణులు వారిని ఆర్ఆర్ఆర్గా పిల్చుకుంటున్నారు… రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.. అయితే, తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించి.. రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. ఆ తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచి రఘునందన్రావు, హుజురాబాద్ బైపోల్లో నెగ్గి ఈటల రాజేందర్ సభలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ, అప్పడికే పార్టీలో సీనియర్ […]
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ… తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ గవర్నర్ వ్యవహార శైలి సరికాదు… ఆమె ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిలా పనిచేస్తున్నారు… ఆమెకు సంబంధం లేని వాటిలో జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు.. అంతే కాదు.. తెలంగాణ గవర్నర్ ను వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు నారాయణ.. మరోవైపు.. పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి విగ్రహాలను పార్లమెంట్ లో ఏర్పాటు […]