ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చెందిన ఓ నేత దారుణ హత్యకు గురయ్యాడు.. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్సీపీ నేత, గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామశేషును తెల్లవారుజామును హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. అయితే, గతంలోనూ అంటే 2017లోనూ రామశేషుపై హత్యాయత్నం జరిగిందని చెబుతున్నారు.. శ్రీకూర్మంలోని తన వ్యాపార గోడౌన్కు వెళ్తున్నప్పుడు మాటు వేసి గుర్తు తెలియని వ్యక్తులు.. దేశవాలి కత్తితో నరికి చంపారు.. శ్రీకూర్మం గ్యాస్ గోడౌన్ […]
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిసే విషయంలో సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కొద్ది రోజుల క్రితం సీఆర్పీసీ 160 కింది ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే కాగా.. డిసెంబర్ 6వ తేదీన అంటే ఈరోజు తమను కలవాలని.. ఢిల్లీలోనైనా సరే.. హైదరాబాద్లోనైనా సరే అని పేర్కొంది సీబీఐ.. అయితే, శనివారం రోజు సీబీఐకి లేఖ రాసిన కవిత.. ఈ కేసులో ఎంహెచ్ఏ […]
తెలంగాణలోనే కాదు… ఆంధ్రప్రదేశ్లోనూ ఐటీ, ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి.. మొన్నటికిమొన్న అక్కినేని ఉమెన్ హాస్పిటల్, ఎన్ఆర్ఐ ఆస్పత్రుల్లో ఈ దాడులు కొనసాగిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు విజయవాడలో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు సాగుతున్నాయి.. ఇవాళ ఉదయం 6.30 గంటల నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.. మొత్తం ఐదు బృందాల అధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.. వైఎస్సార్సీపీ నేత అయిన దేవినేని అవినాష్.. విజయవాడ తూర్పు […]
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పీడ్ పెంచారు.. మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. ఈ నెల 10వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత జాగా ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం, దళిత బంధు అమలు సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని […]
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ విద్యార్థిని హత్య కలకలం సృష్టిస్తోంది.. మెడికోను ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసినట్టు చెబుతున్నారు.. మొత్తంగా.. ప్రేమోన్మాది దాడిలో మెడికల్ స్టూడెంట్ తపస్వి ప్రాణాలు కోల్పోయింది.. నేడు తపస్వి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు వైద్యులు.. ఉద్యోగరీత్యా ముంబైలో నివాసం ఉంటున్న తపస్వి తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు.. హాస్టల్లో ఉండి ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న తపస్వి… స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురం.. అయితే, ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్కు ఇంస్టాగ్రామ్లో […]
* నేడు లోక్సభ స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల అజెండాపై చర్చ * నేడు కడప అమీన్ పీర్ దర్గాను దర్శించనున్న సీఎం వైఎస్ జగన్.. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుని నేరుగా దర్గా చేరుకోనున్న సీఎం.. రాయచోటి రోడ్డులోని మాధవి కన్వెన్షన్ లో జరిగే వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్న జగన్.. మధ్యాహ్నం 1.30కి కడప ఎయిర్ పోర్టు నుంచి గన్నవరం బయల్దేరనున్న సీఎం జగన్. * నిర్మల్: […]
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి.. ఇవాళ రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది.. ఇక, ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించింది భారతీయ జనతా పార్టీ.. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పధాదికారుల సమావేశాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన.. ఆ తర్వాత ఢిల్లీ చేరుకుని ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తంగా 2024 సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కమలదళం.. ఎన్నికల […]
చైనాను మినహాయిస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసుటు తగ్గుముఖం పట్టాయి.. అయితే, వీవీఐపీలను సైతం వదలలేదు కోవిడ్.. ఇప్పటికే ఎంతో మంది కరోనా బారినపడ్డారు.. వీరిలో వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఉన్నతాధికారులు, ఇలా ఎవ్వరూ మినహాయింపు కాదు అన్నట్టుగా అందరినీ టచ్ చేస్తూ వచ్చింది.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కేసులు తగ్గుతోన్న సమయంలో.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మరోసారి కరోనా బారినపడ్డారు. తాజాగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు […]
పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిస్థితులు మరోసారి కాకరేపుతున్నాయి.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి.. బీజేపీ వర్సెస్ టీఎంసీగా పరిస్థితి మారిపోయి.. విమర్శలు, ఆరోపణలు, దాడులు, రైడ్స్, అరెస్ట్లు.. ఇలా ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.. మరోసారి దీదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం ఎక్కడా తగ్గేదే లే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.. తాజాగా, కేంద్ర మంత్రి, బీజేపీ నేత నిశిత్ ప్రమానిక్ చేసిన వ్యాఖ్యలు సంచనలంగా […]
భారతీయ జనతా పార్టీ దక్షిణాదిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.. అందులో తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, ఇతర కేంద్ర మత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఇలా ఎవరికి వీలైనప్పుడల్లా వారు వస్తూనే ఉన్నారు.. మునుగోడు బై పోల్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కూడా జేపీ నడ్డా రావాల్సి ఉన్నా.. చివరి క్షణాల్లో తన పర్యటన రద్దుచేసుకున్న విషయం విదితమే.. […]