ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు మరో కొత్త ఫీచర్ను తీసుకొస్తుంది… వాట్సాప్ రంగ ప్రవేశం చేసినప్పట్టి నుంచి ఎన్నో అప్డేట్లు.. మరో కొత్త కొత్త ఫీచర్లతో.. యూజర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తూ వస్తుంది.. ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది.. వారి ఇబ్బందులను గుర్తించి.. వారి అభిరుచులకు అనుగుణంగా ఫీచర్స్ తీసుకొస్తున్న వాట్సాప్ ఇప్పుడు.. ఒకే నంబర్తో ఒకేసారి రెండు స్మార్ట్ ఫోన్లతో పాటు మరో రెండు డివైస్లలో యాక్సిస్ కలిపించనుంది.. […]
విద్యార్థులు కాలేజీలోనే కొట్టుకున్నారు.. ల్యాబ్లో ప్రాక్టికల్స్ చేసే వస్తువులతోనే పరస్పరం దాడులకు దిగారు.. కలకలం సృష్టించిన ఈ ఘటన కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగింది. కాలేజీలోనే సీనియర్లు, జూనియర్లు గొడవకుదిగారు.. బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్.. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పై దాడికి దిగారు.. ల్యాబ్లో ప్రాక్టికల్స్ చేసే వస్తువులతో కొట్టుకున్నారు. గత కొంతకాలంగా జూనియర్లు, సీనియర్లు మధ్య వార్ నడుస్తున్నట్టుగా తెలుస్తుండగా.. ఇప్పుడు అది దాడి వరకు వెళ్లింది… […]
కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మిస్తామని తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి… టీటీడీ ఆధ్వర్యంలో విశాఖలోని ఆర్కే బీచ్ లో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు.. సైతిక శ్రీవారి శంఖు చక్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి… విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రి గుడివాడ అమరనాథ్, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ వంశీ, కలెక్టర్ మల్లికార్జున తదితరులు హాజరయ్యారు.. […]
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇప్పటికే డిసెంబరు నెలకు సంబంధించిన రూ.300 దర్శన కోటాను టీటీడీ శుక్రవారం ఆన్లైన్ ద్వారా విడుదల చేసింది.. కోటా విడుదలైన 80 నిమిషాల్లోనే 5,06,600 టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు భక్తులు… డిసెంబరు నెల టికెట్ల కోటాను అక్టోబరులోనే విడుదల చేయాల్సి ఉండగా.. వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని డిసెంబర్ నెల నుంచి మార్పు చేయాలని టీటీడీ నిర్ణయానికి రావడంతో […]
ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతోన్న కోటిదీపోత్సవం నేటితో ముగియనుంది.. అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైన ఈ మహా దీపయజ్ఞం.. ఇవాళ్టితో ముగుస్తుంది… ఇవాళ శ్రీశైలం మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం వైభవంగా సాగుతోంది.. శంఖారావంతో ప్రారంభమైన పదిహేనవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం.. వేదపఠనం : శ్రీ శారదా వైదిక స్మార్థ వేదపాఠశాల – వర్గల్, భక్తి గీతాలు : పర్ణిక బృందం, వేణుగానం : జయప్రద రామ్మూరి బృందం, కొల్హాపూర్ కరవీరపుర […]
క్రెడిట్ కార్డుపై నెల నెలా ఇంటి అద్దె చెల్లించేవారు కొంతమంది అయితే.. ఇంటి అద్దె పేరుతో తమ క్రెడిట్ కార్డులోని మొత్తాన్ని మరో ఖాతాకు బదలాయించి వాడుకునేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారట. బయట అప్పులు తీసుకోవడం కంటే.. క్రెడిట్ కార్డుపై చెల్లించే వడ్డీ రేటు కాస్త తక్కువగానే ఉండడంతో.. చాలా మంది వివిధ యాప్ల నుంచి నెలా నెలా.. కార్డుపై లిమిట్ ఉన్నకాడికి లాగేస్తున్నారట.. అయితే, ఇప్పుడు వారికి జేబుకు చిల్లు తప్పని పరిస్థితి.. ఎందుకంటే.. […]
బెల్టుషాపులు తొలగించడం, పర్మిట్ రూమ్లు రద్దు వంటి ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల నియంత్రణ చర్యల వల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని.. రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది.. వైఎస్ జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారు.. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని విపక్షం ధీమా వ్యక్తం చేస్తుంటే.. అధికార పార్టీ మాత్రం.. మరోసారే కాదు.. 25 ఏళ్ల పాటు వైఎస్ జగనే సీఎంగా ఉంటారంటోంది.. తాజాగా ఈ వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజకవర్గ ఇంచార్జ్ కరణం వెంకటేష్… తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో […]