New Zealand vs England: ఉత్కంఠ రేపిన టెస్ట్ మ్యాచ్.. చరిత్ర సృష్టించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Zealand vs England: క్రికెట్ స్వరూపమే మారిపోయింది.. అసలైన ఆటగాడిని వెలికితీసే టెస్ట్లకు ఆదరణ తగ్గిందని.. ఆ తర్వాత వన్డే మ్యాచ్లకు కూడా గతంలో ఉన్న స్పందన లేదని.. ఇప్పుడంతా.. టీ-20 ఫార్మాట్ మ్యాచ్లదే హవా అంటున్నారు.. కానీ, కొన్ని ఘటనలు అనూహ్యంగా.. ఆ మ్యాచ్వైపు మళ్లేలా చేస్తుంటాయి.. అలాంటి ఉత్కంఠబరితమైన ఘటన ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో చోటు చేసుకుంది.. ఇదంతా ఎందకంటే.. టెస్ట్ మ్యాచ్లో సంచలనం నమోదైంది.. వెల్లింగ్టన్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఇంగ్లండ్పై సంచలన విక్టరీని కొట్టింది.. ఫాలో ఆన్ను అదిగమించి చరిత్ర సృష్టించింది..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
- Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
వెల్లింగ్టన్లో ఫాలో-ఆన్ చేయవలసి వచ్చినప్పటికీ సిరీస్ని డ్రా చేసుకోవడానికి న్యూజిలాండ్ మంగళవారం జరిగిన రెండవ-టెస్ట్ థ్రిల్లరన్లో కేవలం ఒక పరుగుతో ఇంగ్లండ్ను ఓడించింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ను 435 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక, ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన కివీస్ జట్టు 209 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్ను ఇంగ్లండ్ ఫాలోఆన్ ఆడించింది. అయితే, రెండో ఇన్నింగ్స్లో 483 పరుగులకు ఆలౌటైంది. ఇక, దీంతో ఇంగ్లండ్ ముందు 258 పరుగుల టార్గెట్ను ఉంచగలిగింది.. న్యూజిలాండ్ నిర్దేశించిన 258 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 256 పరుగు దగ్గర పెవిలియన్ చేరింది.. ఈ మ్యాచ్ ఉత్కంఠబరితంగా సాగింది.. ఒకసారి మ్యాచ్ ఇంగ్లండ్వైపు మొగ్గితే.. మరోసారి కివీస్ చేతిలోకి వచ్చినట్టు అనిపించింది.. చిట్ట చివరకు ఒకే ఒక్క పరుగుతో ఇంగ్లండ్ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.. ఈ విక్టరీతో కివీస్ రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను 1-1తో డ్రా చేసి పరువు కాపాడుకుంది.
ఒకే ఒక్క పరుగుతో విక్టరీ కొట్టి సంచలనం సృష్టించి.. కొత్త రికార్డునే సృష్టించారు.. న్యూజిలాండ్ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. అతి తక్కువ మార్జిన్తో టెస్టు క్రికెట్లో విజయం సాధించిన రెండో జట్టుగా నిలిచింది న్యూజిలాండ్.. గతంలో 1993లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ ఒక్క పరుగు తేడాతో విజయాన్ని నమోదు చేసింది.. మళ్లీ ఇప్పుడు అంటే.. 30 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్తో మ్యాచ్లో కివీస్ ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది..
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!