New Zealand vs England: ఉత్కంఠ రేపిన టెస్ట్ మ్యాచ్.. చరిత్ర సృష్టించారు..
New Zealand vs England: క్రికెట్ స్వరూపమే మారిపోయింది.. అసలైన ఆటగాడిని వెలికితీసే టెస్ట్లకు ఆదరణ తగ్గిందని.. ఆ తర్వాత వన్డే మ్యాచ్లకు కూడా గతంలో ఉన్న స్పందన లేదని.. ఇప్పుడంతా.. టీ-20 ఫార్మాట్ మ్యాచ్లదే హవా అంటున్నారు.. కానీ, కొన్ని ఘటనలు అనూహ్యంగా.. ఆ మ్యాచ్వైపు మళ్లేలా చేస్తుంటాయి.. అలాంటి ఉత్కంఠబరితమైన ఘటన ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో చోటు చేసుకుంది.. ఇదంతా ఎందకంటే.. టెస్ట్ మ్యాచ్లో సంచలనం నమోదైంది.. వెల్లింగ్టన్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఇంగ్లండ్పై సంచలన విక్టరీని కొట్టింది.. ఫాలో ఆన్ను అదిగమించి చరిత్ర సృష్టించింది..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
- Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
వెల్లింగ్టన్లో ఫాలో-ఆన్ చేయవలసి వచ్చినప్పటికీ సిరీస్ని డ్రా చేసుకోవడానికి న్యూజిలాండ్ మంగళవారం జరిగిన రెండవ-టెస్ట్ థ్రిల్లరన్లో కేవలం ఒక పరుగుతో ఇంగ్లండ్ను ఓడించింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ను 435 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక, ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన కివీస్ జట్టు 209 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్ను ఇంగ్లండ్ ఫాలోఆన్ ఆడించింది. అయితే, రెండో ఇన్నింగ్స్లో 483 పరుగులకు ఆలౌటైంది. ఇక, దీంతో ఇంగ్లండ్ ముందు 258 పరుగుల టార్గెట్ను ఉంచగలిగింది.. న్యూజిలాండ్ నిర్దేశించిన 258 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 256 పరుగు దగ్గర పెవిలియన్ చేరింది.. ఈ మ్యాచ్ ఉత్కంఠబరితంగా సాగింది.. ఒకసారి మ్యాచ్ ఇంగ్లండ్వైపు మొగ్గితే.. మరోసారి కివీస్ చేతిలోకి వచ్చినట్టు అనిపించింది.. చిట్ట చివరకు ఒకే ఒక్క పరుగుతో ఇంగ్లండ్ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.. ఈ విక్టరీతో కివీస్ రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను 1-1తో డ్రా చేసి పరువు కాపాడుకుంది.
ఒకే ఒక్క పరుగుతో విక్టరీ కొట్టి సంచలనం సృష్టించి.. కొత్త రికార్డునే సృష్టించారు.. న్యూజిలాండ్ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. అతి తక్కువ మార్జిన్తో టెస్టు క్రికెట్లో విజయం సాధించిన రెండో జట్టుగా నిలిచింది న్యూజిలాండ్.. గతంలో 1993లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ ఒక్క పరుగు తేడాతో విజయాన్ని నమోదు చేసింది.. మళ్లీ ఇప్పుడు అంటే.. 30 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్తో మ్యాచ్లో కివీస్ ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది..
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!